- రాత్రికి హత్య..తెల్లారి మొసలికన్నీరు వారి నైజం
- బాధితుల దగ్గరకు వెళ్లి సానుభూతి నాటకాలు
- గంజాయి బ్యాచ్ గొడవగా చిత్రీకరించి పక్కదారి
- ఏపీ ప్రతిష్ఠను వైసీపీ అధఃపాతాళానికి తొక్కేసింది
- విధ్వంసం, హత్యలపైనే ఆ పార్టీ మనుగడ
- రవీంద్రనాథ్రెడ్డి కుటుంబసభ్యుల పేర్లపై ఉన్న
- పదుల డాక్యుమెంట్లు దస్తగిరి వద్ద ఎందుకున్నాయి?
- పరామర్శకు వెళతానన్న జగH ఎందుకు వెళ్లలేదు
- వాస్తవాలు బయటపడతాయన్న భయం పట్టుకుందా?
- ఫొటోలు, ఆర్థిక లావాదేవీలే వారి సంబంధానికి సాక్ష్యం
- తాడేపల్లి పెద్దలకు తెలియకుండానే జరుగుతున్నాయా?
- గహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి
మంగళగిరి(చైతన్యరథం): ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఎంతో గౌరవం, పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రతిష్ఠను వైసీపీ అధఃపాతాళానికి తొక్కేసిందని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. అధికారం, ఆస్తి కోసం వైసీపీ నేతలు ఎంతటి నీచానికైనా దిగజా రుతారని మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళ వారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ మను గడ మొత్తం విధŠ్వంసం, భయాందోళనలు, హత్యలు అనే మూడు రెక్కల మీద సాగుతోందని విమర్శించారు. వివేకా హత్య నుంచి నేటి దస్తగిరి హత్య వరకు ఆ పార్టీ అనుసరిస్తున్న పనితీరు ఒకేలా ఉందని ఆరోపించారు. నాడు అప్పట్లో వివేకానందరెడ్డి గుండెపో టుతో చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేసి ఆపై సానుభూతి కోసం నాటకాలు ఆడారు. దస్తగిరి మరణాన్ని కూడా గంజాయి బ్యాచ్ గొడవగా చిత్రీకరించి పక్కదారి పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. హంతకులే బాధితుల వద్దకు వెళ్లి మొసలికన్నీరు కార్చడం అత్యంత హేయమైన చర్య అని ధ్వజమెత్తారు.
దస్తగిరి నివాసంలో పత్రాలు..వైసీపీ దోపిడీకి నిదర్శనం
2019 నుంచి 2024 వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దస్తగిరి వంటి వారిని వాడుకుని వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని పేర్కొన్నారు. దస్తగిరి నివాసంలో పోలీసుల సోదా ల్లో ప్రాథమికంగా రూ.150 కోట్ల విలువైన పత్రాలు దొరికినట్లు తెలిసినా.. లోతుగా పరిశీలిస్తే అవి రూ.500 కోట్ల వరకు ఉండ వచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారని వెల్లడించారు. సామాన్యుల నుంచి లాక్కున్న అగ్రిమెంట్లు, ఖాళీ పత్రాలు ఆ పార్టీ దోపిడీకి నిదర్శనాలని పేర్కొన్నారు. హత్యలు చేయించడం, మళ్ళీ ఆ కుటుంబాలను పరామర్శించడం, తమ సొంత మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను, పోలీసులను తప్పుదోవ పట్టిం చడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. ఇలాంటి నేరపూరిత చరిత్ర కలిగిన పార్టీ రాజకీయాల్లో ఉండటానికి అర్హత ఉందో లేదో కేంద్ర ఎన్నికల సంఘం పునఃసమీక్షించాలని డిమాం డ్ చేశారు. సొంత చిన్నాన్నను చంపినప్పుడే లేని జాలి, నేడు దస్తగిరి విషయంలో ఉంటుందని ప్రజలు నమ్మరు. వైసీపీ అంటేనే ఒక విధ్వంసకర శక్తుల అడ్డాగా మారిపోయిందని ధ్వజమెత్తారు.
అవినాష్రెడ్డికి, రవీంద్రనాథ్రెడ్డికి దస్తగిరి ఆప్తమిత్రుడు
దస్తగిరి ఎవరో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన సాధారణ వ్యక్తి కాదు. ఎంపీ అవినాష్రెడ్డికి, మాజీ ఎమ్మె ల్యే రవీంద్రనాథ్రెడ్డికి అత్యంత ఆప్తమిత్రుడు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలతో కూడా ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నా యి. పులివెందలలో జరిగే ప్రతి రహస్య మంత్రాంగంలోనూ, రాజకీయ కుట్రల్లోనూ దస్తగిరి పాత్ర ఉండేదని కడపలో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారని గుర్తు చేశారు. వైసీపీ రాజకీయాల్లో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే రాత్రికి రాత్రే చీకట్లో హత్యలు చేయించి తెల్లవారేసరికి ఏమీ తెలియనట్లు మొట్టమొద టిగా వెళ్లి ఆ శవాల దగ్గర నివాళులర్పించి మొసలి కన్నీరు కార్చ డం. ఈరోజు ఎవరైతే ప్రధాన కుట్రదారుడిగా ఆరోపణలు ఎదు ర్కొంటున్నారో అదే వ్యక్తి వెళ్లి దస్తగిరి భౌతికకాయాన్ని పరామ ర్శించడం అత్యంత ఘోరం. హత్య చేసిన నిందితులు, ఘటన జరిగిన మూడు గంటల్లోనే నిత్యానందరెడ్డి అనే వ్యక్తి వద్దకు వెళ్లి ఆశ్రయం పొందినట్లు పక్కా ఆధారాలు లభించాయని స్పష్టం చేశారు.
జగన్ పరామర్శను ఎందుకు విరమించుకున్నారు
దస్తగిరి కుటుంబాన్ని పరామర్శిస్తానని స్వయంగా ప్రకటించిన జగన్రెడ్డి చివరకు ఎందుకు వెళ్లలేకపోయారని ప్రశ్నించారు. అక్కడ వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే తన పర్యట నను విరమించుకున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే లక్ష్యంగా వైసీపీ పరిపాలన సాగిందని మండిపడ్డారు. దస్తగిరిని అడ్డుపెట్టుకుని కడపలో అమాయక ప్రజలను భయపెట్టి చిత్రహింసలు పెట్టి కారుచౌకగా భూములను లాక్కున్నారని ఆరోపించారు. దస్తగిరి ఇంట్లో దొరికిన 175కు పైగా డాక్యుమెంట్లు వైసీపీ నేతల భూ దోపిడీకి నిలువెత్తు సాక్ష్యా లని పేర్కొన్నారు. అంతేకాకుండా గూడూరు వద్ద రవీంద్రనాథ్ రెడ్డి కోసం దస్తగిరి ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ఇప్పటికీ ఆ భవనానికి గృహ ప్రవేశం కూడా జరగలేదని గుర్తు చేశారు. దస్తగిరికి, తమకు సంబంధం లేదని కడప వైసీపీ నేతలు చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని, వారి మధ్య ఉన్న ఫొటోలు, ఆర్థిక లావాదేవీలే అందు కు సాక్ష్యాలని స్పష్టం చేశారు. ఈ అరాచక రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
హత్యారాజకీయాలకు డెన్గా వైసీపీ
వైసీపీ రాజకీయ పార్టీ కాదు..అది హత్య రాజకీయాలకు ఒక ‘డెన’ (నిలయం)గా మారిందని ధ్వజమెత్తారు. అధికారం కోసం కార్యకర్తలను వాడుకుని, అవసరం తీరాక వారిని అడ్డు తొలగిం చుకోవడం ఆ పార్టీ నైజమని మండిపడ్డారు. దస్తగిరి వద్ద లభిం చిన డాక్యుమెంట్లు వైసీపీ అగ్రనేతల బినామీ వ్యవహారాలను స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. రామాంజిరెడ్డి పేరుతో 30 డాక్యుమెంట్లు, రవీంద్రనాథ్రెడ్డి కుమారుడి పేరుతో మరో 30 డాక్యుమెంట్లు, అలాగే ఆయన సతీమణి అరుణ్కుమార్ పేరుతో మరికొన్ని పత్రాలు లభించాయని వెల్లడించారు. వీరంతా ఎవరి కి బినామీలో ప్రజలు ఆలోచించాలని, దస్తగిరిని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో దీనిని బట్టే అర్థమవుతుందని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తల పేదరి కాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్ప డతారని విమర్శించారు. తమ అసలు పేర్లు బయటకి రాకుండా ఉండేందుకు వాడుకున్న వ్యక్తులనే హతమార్చడం వైసీపీ విధానమని పేర్కొన్నారు.
నిందితులకు వైసీపీ నాయకుడి షెల్టర్
నిందితులకు వైసీపీ నాయకుడు నిత్యానందరెడ్డి షెల్టర్ ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేమిటో చెప్పాలని డిమాండ్ చేశా రు. గత ఐదేళ్లలో వైసీపీ చేసిన పాపాలు అంతులేనివని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నపూర్ణమ్మ ఆలయం వద్ద వృద్ధ దంపతులను బెదిరించి భూములు లాక్కోవడం, మన ప్రాణాలు కాపాడే పోలీస్ డిపార్ట్మెంట్ సంక్షేమం కోసం కేటాయించిన భూములను కబ్జా చేయడం, బుక్కవంక జలాశయం వద్ద 35 ఎకరాల భూకబ్జా, రైల్వే ఉద్యోగుల ప్లాట్ల ఆక్రమణ, ఈ అరాచ కాలన్నీ తాడేపల్లి పెద్దలకు తెలియకుండానే జరిగాయా? అని ప్రశ్నించారు. తెలిసీ చర్యలు తీసుకోలేదంటే ఇవన్నీ వారి ఆశీ స్సులతోనే జరిగాయని ప్రజలు నమ్మాల్సి ఉంటుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ వివాదాలు ఉంటే ఎవరైనా పోలీసుస్టేషన్లకు లేదా కోర్టులకు వెళతారని, కానీ వైసీపీ నాయకులకు మాత్రం ‘హత్యే’ ఏకైక పరిష్కారమని ఎద్దేవా చేశారు. న్యాయస్థానాలు అక్కర్లేదు.. నేరుగా ఎలిమినేషన్ ప్రాసెస్ ఒక్కటే మా పద్ధతి అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దస్తగిరి హత్య, ఆయన ఇంట్లో దొరికిన పత్రాలు, వారి మధ్య లావాదేవీల వెనుక ఖచ్చితంగా వైసీపీ పెద్దల హస్తం ఉందని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి కుమారుడు రామాంజిరెడ్డి పేరుతో 30 డాక్యుమెంట్లు, ఆయన సతీమణి పేరుతో మరికొన్ని పత్రాలు లభించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
భూకబ్జాలపైనా విచారణ జరుపుతుంది
గత ఐదేళ్లలో కడప జిల్లాలో అమాయకులను బెదిరించి కారుచౌకగా లాక్కున్న ప్రతి అంగుళం భూమిపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని హామీ ఇచ్చారు. 2019లో వివేకా హత్య కేసులో ఏ విధంగా ప్రజలను మబ్బి పెట్టారో, ఇప్పుడు దస్తగిరి కేసులో అటువంటి కుతంత్రాలు సాగవని హెచ్చ రించారు. ఈ హత్యల వెనుక ఎంతటి పెద్ద నాయకులు ఉన్నా, వారెంతటి పలుకుబడి కలిగిన వారైనా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇటువంటి అరాచక శక్తులను గుర్తించి చీకటి రాజకీయాలకు చరమగీతం పాడాలని సూచించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నింది తులకు ఆశ్రయం ఇచ్చిన వారితో సహా ఈ మొత్తం కుట్రలో భాగస్వాములైన ప్రతిఒక్కరినీ బోనులో నిలబెడతామని స్పష్టం చేశారు.














