Telugu Desam

తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం:

ఎన్టీఆర్ హయాంలో...

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అభ్యుదయభావాలు, సమసమాజ సిద్ధాంతాలతో, సంస్కరణలతో తెలంగాణ ప్రాంతం పై తనదైన ముద్ర వేశారు. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్ర ప్రాంతంలో మునసబు, కరణాలు... తెలంగాణలో పటేల్‌, పట్వారీలు గ్రామీణ ప్రాంతాలను తమ గుప్పిట పెట్టుకుని ప్రజలను శాసించేవారు. ఎన్టీఆర్ ఆ వ్యవస్థలను రద్దుచేయడంతో బడుగులకు స్వేచ్ఛ దొరికింది. వారందరినీ ఎన్టీఆర్ రాజకీయాలలోకి ఆహ్వానించి ప్రోత్సహించారు. ఫలితంగా తెలంగాణలో బీసీ, దళిత నేతలు రాజకీయాల్లో రాణించారు.
ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడి గిరిజనుల బతుకులను చూసి చలించిపోయారు. ఆ తర్వాతనే గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు గిరిజనులకే చెందాలని, గిరిజనులకు అటవీ హక్కులు ఉండాలని... ఇలా 14 నిర్ణయాలు తీసుకుని జీవోలు జారీ చేసారు. అలాగే వ‌ల‌స‌లు ఎక్కువ‌గా ఉన్న‌.. ఆదిలాబాద్‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌.. వంటి జిల్లాల్లో వివిధ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసి.. అక్క‌డ నుంచి ప్ర‌జలు వ‌ల‌సబాట‌ ప‌ట్ట‌కుండా ఎన్టీఆర్ చర్యలు తీసుకున్నారు. పాలమూరు ప్రాంతంగా పిలువబడే నాటి మహబూబ్ నగర్ జిల్లా నుండి కరవును తరిమేసేందుకు ప్రియదర్శిని జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు ఎన్టీఆర్ 
హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్‌ మీద కొలువుదీరిన తెలుగు సాహిత్య, సాంస్కృతిక, వైతాళికుల విగ్రహాలు చూడగానే ప్రజలకు గుర్తొచ్చేది ఎన్టీఆరే. 'తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం' పేరిట విగ్రహాల ఏర్పాటు, ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ... బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పేరిట హుస్సేన్‌సాగర్‌ మధ్య బుద్ధుని విగ్రహం ఏర్పాటు... ఇవన్నీ ఎన్టీఆర్.కృషికి నిదర్శనాలు.
హుస్సేన్‌సాగర్‌ పక్క నుంచి ఖైరతాబాద్‌ వరకు ఉన్న కచ్చా రోడ్డును విస్తరించింది... పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్‌ వరకు, కూకట్‌పల్లి నుంచి చార్మినార్‌ వరకు రోడ్డు విస్తరణ చేపట్టింది ఎన్టీఆర్ హయాంలోనే.
హైదరాబాద్ లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పింది... అదే ప్రాంగణంలో లలిత కళాతోరణం ఆడిటోరియంను నిర్మించింది ఎన్టీఆరే.
హైదరాబాద్‌ నగరానికి రాజధానికి తగ్గ స్థాయిలో అత్యంత విశాలమైన ఇమ్లిబన్‌ (మహాత్మాగాంధి) బస్‌ స్టేషన్‌ను నిర్మించింది ఎన్టీఆరే. అంతకు ముందు గౌలిగూడలో ఒక రేకుల షెడ్డు వంటి బస్టాండ్ ఉండేది. తెలంగాణ ప్రజల కోరికను మన్నిస్తూ... 1985 డిసెంబర్‌లో స్థానికేతరులను వారివారి ప్రాంతాలకు పంపడానికి 610 జీఓను తీసుకొచ్చారు.

నారా చంద్రబాబు నాయుడు హయాంలో...

యువతకు వేలల్లో ఐ టి ఉద్యోగాలిస్తోన్న హైటెక్ సిటీ... అభివృద్ధికి అద్దంలా నిలిచే సైబర్ సిటీ.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, ఎం ఎం టి ఎస్ పరుగులు, ఫ్లై ఓవర్లు, మల్టీప్లెక్సులు, బిజినెస్ స్కూళ్ళు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు.... హైదరాబాద్ లో ఇంతటి అభివృద్ధికి బాటలు వేసింది నూటికి నూరుపాళ్లూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వమే. ఈరోజు మామూలు డిగ్రీ చదివిన వ్యక్తి, హైదరాబాద్ వస్తే ఉపాధి దొరుకుతుంది అనే భరోసా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే.

తెలుగుదేశం హయాంలో తెలంగాణ లో ఏర్పాటైన మరికొన్ని సంస్థలు:

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist