- బీహార్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా ప్రధాన్
- ధర్మేంద్ర ప్రధాన్కు మంత్రి లోకేష్ అభినందనలు
పాట్నా/బీహార్ (చైతన్యరథం): కేంద్ర విద్యాశాఖ మంత్రి, బీహార్ బీజేపీ ఎన్నికల ప్రచారకర్త ధర్మేంద్ర ప్రధాన్తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాట్నాలో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బీహార్లో ఎన్డీఏ విజయం కోసం ప్రధాన్ అహరహం శ్రమిస్తున్నారు. గతేడాది హర్యానా, ఒడిశా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయంలో ప్రధాన్ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు బీహార్లో ఎన్డీఏ విజయం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. బీహార్లో మరోమారు ఎన్డీఏ సర్కారును గెలిపించేందుకు ప్రధాన్ చేస్తున్న నిర్మాణాత్మక కృషిని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. బీహార్లో మరోమారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగలదన్న నమ్మకాన్ని లోకేష్ వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ వెంట ఎంపీలు సానా సతీష్, గంటి హరీష్, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు.















