చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర రాష్ట్రం.. అమరజీవి త్యాగఫలం!

ఆత్మార్పణం పుస్తకం ఆవిష్కరించిన సీఎం

by చైతన్యరధం
Dec 16, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఆంధ్ర రాష్ట్రం.. అమరజీవి త్యాగఫలం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆత్మార్పణ స్ఫూర్తితో సుపరిపాలన
  • పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు వర్సిటీ
  • 125వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తాం
  • అమరజీవి పుట్టిన ఊరితో పాటు అమరావతిలో మెమోరియల్‌
  • అత్యున్నత పరిపాలన మా అభిమతం
  • సుస్థిర ప్రభుత్వంతోనే నిరంతర సంక్షేమం, అభివృద్ధి
  • పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • ఆత్మార్పణం పుస్తకం ఆవిష్కరించిన సీఎం

విజయవాడ (చైతన్యరథం): అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల స్ఫూర్తితో సుపరిపాలన అందిస్తున్నామని.. సుస్థిర ప్రభుత్వంతోనే నిరంతర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిరోజూ ఓ ముఖ్యమైనదే అయినా ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉందని.. తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే ఓ వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. చాలాకొద్ది మందే జాతికోసం ఆలోచిస్తారని.. ఇదేకోవలో తెలుగు జాతి కోసం ఆలోచించి, ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఉదయం అల్పాహారం చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతేనే తట్టుకోలేం.. అలాంటిది 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి, భయంకర పరిస్థితుల మధ్య సంకల్ప సిద్ధి కోసం ప్రాణ త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు అని, అందుకే ఆయన అమరజీవి అయ్యారన్నారు. ఓ వ్యక్తి త్యాగం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైంది. ఇలాంటి నాయకులను శాశ్వతంగా గుర్తుంచుకోవాల్సిన అవసరముందని భావించి.. ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తంమీద వ్యాప్తిచేయాల్సిన బాధ్యత ఉందని మొదటగా చెప్పిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌. తెలుగుజాతి కోసం ప్రాణాలర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అయితే దేశాన్ని ఐకమత్యంగా ఉంచేందుకు పోరాడిన ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని సీఎం చంద్రబాబు వివరించారు.
సామాజిక, మానవతా వాది
తెలుగుజాతి అనేకసార్లు చాలా ఇబ్బందులు పడిరదని, ఒకప్పుడు ఏ పనికావాలన్నా మద్రాస్‌ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని ఆనాటి పరిస్థితులను సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మొదటగా గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితి ఏర్పడిరదని.. ఆ తర్వాత వివిధ రూపాల్లో దాదాపు 50 ఏళ్ల పోరాటం తర్వాత, పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన తర్వాత 1953లో తెలుగు రాష్ట్రం వచ్చిందని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 1912లో గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో సంయుక్త సదస్సు ఏర్పాటు చేశారు. నిడదవోలులో పెద్ద సమావేశం పెట్టారు. తెలుగుజాతికి ఒక రాష్ట్రం కావాలని గట్టిగా అడిగారు. 1913లో బాపట్లలో ఆంధ్ర మహాసభ పెట్టి నినదించారు. పట్టాభి సీతారామయ్య ఒక మాట అన్నారు.. మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేలోపే బ్రిటిష్‌వారే స్వాతంత్య్రం ఇస్తారని. చివరికి అదే జరిగింది. స్వాతంత్య్రానంతరం 1948, మార్చిలో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విశాఖకు రాగా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం నిరసన వ్యక్తంచేస్తే.. అదే ఏడాది జూన్‌ 17న ధార్‌ కమిషన్‌ వేశారు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని ఆ కమిషన్‌ నివేదిక ఇచ్చింది. ఇలా రకరకాల సమస్యలు ఎదురయ్యాయి. చివరికి పొట్టి శ్రీరాములు త్యాగం ఫలితంగా తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఆయన 1901, మార్చి 16న ఆనాటి మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని పడమటిపల్లిలో జన్మించారని.. స్వాతంత్య్రంతో పాటు సామాజిక ఉద్యమాల్లో పాల్గొని, షెడ్యూల్డు కులాల హక్కుల కోసం కూడా పోరాడిన సామాజిక వాది, మానవతా వాది పొట్టి శ్రీరాములు అని సీఎం చంద్రబాబు తెలిపారు.
పొట్టి శ్రీరాములు త్యాగంతో..
పొట్టి శ్రీరాములు త్యాగం, కొందరు నాయకుల రాజీనామాలతో ఉద్యమం తీవ్రమై చివరకు 1952, డిసెంబర్‌ 19న ఆనాటి ప్రధాని నెహ్రూ దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇదీ చరిత్ర. ఆ తర్వాత రాజధాని ఏదనే దానిపై గందరగోళం తలెత్తింది. ప్రకాశం పంతులు వంటివారు ఆలోచన చేసి కర్నూలు రాజధానిగా గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకున్నారు. ఇలా తాత్కాలికంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్లారు. ఆ తర్వాత 11 జిల్లాలతో రాష్ట్రం ఏర్పాటు బిల్లును 1953, ఆగస్టు 10న పార్లమెంటు ఆమోదించింది. తర్వాత 13 జిల్లాలు అయ్యాయి. 1953, అక్టోబర్‌ 1న కర్నూలు రాజధానిగా పాలన ప్రారంభమైంది. 1956, ఫిబ్రవరి 1న ఆనాటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అసెంబ్లీలో విశాలాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1956, నవంబర్‌ 1న హైదారాబాద్‌ రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి.. మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ప్రమాణం చేశారు. తర్వాతి కాలంలో 1969లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆపై ఇక్కడ జై ఆంధ్రా ఉద్యమం జరగడం.. ఇలా అనేక ఉద్యమాలు జరిగాయి. తెలుగువారంతా ఒకటే అని ఎన్‌టీ రామారావు గట్టిగా నినదించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తొలిసారిగా తెలుగువారందరినీ గుర్తుంచుకునేలా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాలు పెట్టారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన పేరుతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్నప్పుడే నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేశామని సీఎం వివరించారు.
మహనీయుల పోరాట స్ఫూర్తితో ముందుకు
గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు.. పొట్టి శ్రీరాములు పుట్టిన ఊర్లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. తాగునీటి వసతితో పాటు, వంతెన నిర్మించి, హైస్కూల్‌ అభివృద్ధి చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి.. పద్ధతి ప్రకారం తీర్చిదిద్ది ఒక మెమోరియల్‌ ఏర్పాటుకు చర్యలు ప్రారంభిస్తే తరువాత వచ్చిన పాలకులు దానిని పక్కన పెట్టారు. త్వరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. మహనీయులు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకావాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందన్న ఆలోచనతోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహనీయుల పోరాట స్ఫూర్తిని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్రంలోని మొత్తం ఐదు కోట్ల 50 లక్షల మందిపైనా ఉందన్నారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశానికి దశదిశను చూపించిన ఏకైక వ్యక్తి తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు. ఇలాంటి గొప్పవారి త్యాగాలందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరముంది. ప్రాంతీయ పార్టీ పెట్టినా.. దేశాభివృద్ధి దృక్పథంతో ముందుకెళ్లిన వ్యక్తి ఎన్‌టీ రామారావు అని సీఎం చంద్రబాబు వివరించారు.
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే..
మహనీయుల స్ఫూర్తితోనే స్వర్ణాంధ్ర` 2047 తీసుకొచ్చాం. ఒక వ్యక్తి కోసమో, ఒక కులం కోసమో, మతం కోసమో, కుటుంబం కోసమో కాదు.. రాష్ట్రంలోని ప్రతివ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి ప్రాంతం కోసం ఏమి చేయబోతామనేది చాలా స్పష్టంగా విజన్‌ డాక్యుమెంట్‌లో పొందుపరిచామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను పొందుపరిచామన్నారు. కొందరు నాయకులు త్యాగాలు చేశారు.. మరికొందరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు.. మరికొందరు దేశాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషిచేశారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆలోచించారు. కొందరు మాత్రం తమ స్వార్థం కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇలా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేకుండా చేశారు. పొట్టి శ్రీరాములు పుట్టిన ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారు. 2014లో విభజన జరిగిన తర్వాత 13.5 శాతం వృద్ధి రేటు సాధించాం. ఎవరికీ ఏ కష్టం లేకుండా చేశాం. కానీ.. 2019లో వచ్చిన ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా అమరావతిపై కక్షకట్టి విధ్వసం చేసింది. పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించారు. తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆర్నెల్లుగా కష్టపడుతున్నాం. మహనీయుల స్ఫూర్తి ఇచ్చిన దృఢ సంకల్పమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తోంది. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
అమరావతిలో మెమోరియల్‌
త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తితో ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకెళ్తున్నాం. పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, ఎన్‌టీ రామారావును మనమంతా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా చెడుచేసిన వ్యక్తుల్నీ గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేద్దామని తెలిపారు. అమరావతిలో మెమోరియల్‌ పెట్టి.. ఆయన త్యాగాలను గుర్తుంచుకునేలా చేస్తామని సీఎం చెప్పారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో ఆయన ఇంటిని స్మారకంగా అభివృద్ధి చేసి, శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేస్తామని తెలిపారు.
2047 నాటికి రాష్ట్రంలోని ప్రతిఒక్కరి ఆదాయం దాదాపు 42 వేల యూఎస్‌ డాలర్లకు పెరగాలనేదే నా ఆలోచన. రైతు ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే రైతు ఖాతాల్లో డబ్బులు పడాలి. ఇవన్నీ సాధ్యమే. అలాంటి విధానాల కోసం ఆలోచిస్తున్నాం. త్వరలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ను తీసుకొస్తున్నాం. ఇవన్నీ జరగాలంటే ప్రజల్లో గొప్ప ఆలోచన రావాలి. అందరూ సహకరించాలి. ప్రపచంలోనే అత్యున్నత పరిపాలనకు నాంది పలకాలనేది మా అభిమతం. ఇందుకు ప్రజలందరూ సహకరించి, ముందుకు రావాలి. సుపరిపాలన ద్వారానే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం. ఈ దిశగా ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఒకేరోజు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ గ్రామసభలను విజయవంతంగా నిర్వహించిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు చెందుతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములుని గౌరవించుకునే ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 15-12-2024

Next Post

అమరజీవి పొట్టి శ్రీరాములు..ఆంధ్రజాతికే నాయకుడు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

ఉన్నత విద్యలో సంస్కరణలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist