- సొంత మనుషుల్నే మింగేసే “రాక్షస” క్రీడ వైసీపీది
- పార్టీకోసం శ్రమించిన పెద్ద దస్తగిరినే అడ్డుతొలగించుకున్నారు
- వివేకా హత్యను ‘గుండెపోటు’గా చిత్రించారు
- దస్తగిరి హత్యను ‘గంజాయి’ గొడవగా మార్చేశారు
- విచారణకు ముందే సాక్షిలో విష కథనాలు అందుకే..
- రూ.500 కోట్ల విలువైన ఆస్తుల లావాదేవీలు..
- విలువైన దస్తావేజులే హత్యకు కారణం కాదా?
- న్యాయం చేయమని దస్తగిరి భార్య వేడుకుంటుంటే..
- పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం
- మైనార్టీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ ధ్వజం
మంగళగిరి (చైతన్య రథం): ‘వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేవలం వ్యక్తి హత్య కాదు. ఇది వైసీపీ అనుసరిస్తున్న హత్యా రాజకీయాలకు పరాకాష్ట’ అని మైనార్టీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ విమర్శించారు. పార్టీకోసం పనిచేసిన వ్యక్తిని, తమ అక్రమాలకు సహకరించిన వ్యక్తినే ప్రాణాలుతీసే స్థాయికి రాక్షస రాజకీయం వెళ్ళిందంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “పెద్ద దస్తగిరి హత్య జరిగిన మరుసటి రోజే (ఏప్రిల్ 7) వైసీపీ పాంప్లెట్ సాక్షి పత్రికలో ‘గంజాయి ముఠా దారుణ హత్య’ అని బ్యానర్ వేశారు.
అసలు పోలీసు విచారణ జరగకముందే, నిజానిజాలు తెలియకముందే దీన్ని గంజాయి ముఠా గొడవగా చిత్రీకరించడం వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఆనాడు వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి చంపితే, ‘గుండెపోటు’ అని రాసి ప్రజలను తప్పుదారి పట్టించారు. చంద్రబాబు చేతికి గొడ్డలి ఇచ్చి నారాసుర రక్తచరిత్ర అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే పద్ధతిలో పెద్ద దస్తగిరి హత్యను ‘డ్రగ్స్ ముఠా’ గొడవగా మార్చి అసలు హంతకులను కాపాడాలని చూస్తున్నారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న నిత్యానంద రెడ్డి (కడప మాజీ డిప్యూటీ మేయర్), దస్తగిరి శవం దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తుంటే ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చు అనిపిస్తుంది. ఆనాడు వివేకా మరణం తర్వాత అవినాష్ రెడ్డి చేసిన నటననే ఇది గుర్తు చేస్తోంది. హత్య చేసిన వారే నివాళులు అర్పించడం, కన్నీళ్లు కార్చడం వీరి కుటుంబ సంప్రదాయంగా మారింది. పోలీసుల ప్రాథమిక విచారణలోనే ఇది గంజాయి ముఠా గొడవ కాదు, కేవలం భూవివాదాల్లో వైసీపీ ముఠాల మధ్య జరిగిన అంతర్గత హత్య అని తేలింది. దస్తగిరి ఇంట్లో దొరికిన 150కి పైగా దస్తావేజులు, సుమారు రూ.500 కోట్ల విలువైన ఆస్తుల లావాదేవీలే ఆయన ప్రాణాలు తీశాయి” అని పేర్కొన్నారు.
మైనార్టీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ.. “రఫా రఫా ఆడిస్తాం.. గంగమ్మ జాతరలో పొట్టేళ్లను బలిచ్చినట్టు బలిస్తాం” అని వైఎసఆర్సిపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే హత్యలు జరుగుతున్నాయి. అధికారం ఉన్నా లేకపోయినా వీరి హంతక ప్రవృత్తి మారదు. పార్టీ కోసం రక్తం ధారపోసిన వ్యక్తినే బలి తీసుకున్న వీరు, సామాన్య ప్రజల మాన ప్రాణాలను ఏ రకంగా రక్షిస్తారు? పోలీసు విచారణ పూర్తికాకముందే, సాక్షి పత్రికలో ఇది “గంజాయి ముఠా గొడవ” అని బ్యానర్ వార్తలు రాయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం హంతకులను కాపాడటమే. వివేకా కేసులో ‘గుండెపోటు’ అని ఎలాగైతే అబద్ధం ప్రచారం చేశారో, ఇప్పుడు ‘గంజాయి మత్తు’ అని దస్తగిరి హత్యను తప్పుదారి పట్టిస్తున్నారు. రైతులకు నీరందించే ఖ్పు కెనాల్ ప్రభుత్వ భూములను (సర్వే నెం. 492) అక్రమంగా వెంచర్లు చేసి అమ్మడంలో దస్తగిరి ప్రధాన పాత్ర పోషించారు. ఆ వెంచర్లలోనే మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తన కోసం విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారంటే, వీరి భూదందాలు ఏ స్థాయిలో సాగాయో అర్థమవుతోంది. వైఎసఆర్సిపీ నైజం ఏంటో ఈ ఉదాంతంతో మరోసారి రుజువైంది. తమకు అడ్డం వస్తే సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డిని కూడా వదలని వీరు, పార్టీ కార్యకర్తలను, నేతలను బలి తీసుకోరా? అధికారం, ధనం కోసం సొంత పార్టీ వారినే
చంపేసే ఈ ‘మర్డర్ పాలిటిక్స’ రాష్ట్రానికి ప్రమాదకరం.
పెద్ద దస్తగిరి భార్య వైఎసఆర్సిపీ పార్టీ కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ “మాకు న్యాయం చేయండి, నిందితులను శిక్షించండి” అని వేడుకున్నారు. కానీ, ఆ పార్టీ సోషల్ మీడియా ముఠా మాత్రం ఆమె పార్టీకి ‘క్లీన్ చిట’ ఇచ్చిందని అబద్ధపు ప్రచారం చేస్తోంది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక మహిళ మాటలను తమ రాజకీయ స్వార్థం కోసం వక్రీకరించడం వీరి దిగజారుడుతనానికి నిదర్శనం. ఈ కేసులో అందరూ దొరికారు కానీ, ప్రధాన నిందితుడైన కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. వందలాది కోట్ల రూపాయల ఆస్తుల వ్యవహారంలో అడ్డు వస్తున్నాడనే కారణంతోనే దస్తగిరిని పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చారని స్పష్టమవుతోంది. నిందితుడు పరారీలో ఉన్నాడంటేనే దీని వెనుక ఎంతటి పెద్ద తలకాయల హస్తం ఉందో అర్థం చేసుకోవచ్చు.
గత ఐదు ఏళ్ల అరాచక పాలనను చూసి ప్రజలు వారిని 11 స్థానాలకే పరిమితం చేసి మÖలన కూర్చోబెట్టారు. అయినా సరే, వీరి నైజం అస్సలు మారలేదు. ప్రజల ఆస్తులను కైవసం చేసుకోవడం, భూకబ్జాలు చేయడం. అడ్డు వస్తే సొంత పార్టీ నాయకులనే హతమార్చడం. శాంతి భద్రతలను అపహాస్యం చేస్తూ అగత్యాలకు, దౌర్జన్యాలకు పాల్పడటం. సొంత పార్టీ కోసం రక్తం చెమట ధారపోసిన నాయకులనే చంపేసే ప్రవృత్తి ఉన్న వైఎసఆర్సిపీ, రేపు ప్రజల మాన ప్రాణాలను, ఆస్తులను ఏ రకంగా రక్షించగలుగుతుంది? అధికారం ఉన్నా లేకపోయినా వీరి హంతక రాజకీయాల పరంపర కొనసాగుతూనే ఉంది. సామాన్య ప్రజలు వీరి అరాచక విధానాలను గమనించాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వైఎసఆర్సిపీ నైజం ఏంటో మరోసారి స్పష్టమవుతోంది. ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీని, ఎన్డీయే కూటమిని, చివరకు ప్రజలను కూడా భయపెట్టాలని చూడటం వీరి దుష్ట విధానానికి నిదర్శనం. “మళ్ళీ వస్తాం.. రఫా రఫా ఆడిస్తాం.. గంగమ్మ జాతరలో పొట్టేళ్లను బలిచ్చినట్టు నరుకుతాం” అంటూ వీరు చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే, ప్రజాస్వామ్యం మీద వీరికి ఎంత గౌరవం ఉందో అర్థమవుతోంది. దస్తగిరి ఎవరి కోసం పనిచేశాడు? ఎవరి కోసం భూకబ్జాలు చేసి, అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించి పెట్టాడు? ఎవరి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు? తన నాయకుల కోసమే కదా. అలాంటి వ్యక్తిని, తమ అక్రమాలకు అడ్డు వస్తున్నాడని ఈలోకం నుండి పంపించేశారంటే.. ఇక సామాన్య ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ఈ వైఎసఆర్సిపీ ఇచ్చే గ్యారెంటీ ఏంటి? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి.
రాష్ట్రం శాంతియుతంగా ఉండాలి, ప్రతి ఒక్కరి మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ ఉండాలి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. ఈ రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని కూకటివేళ్లతో లాగి పడేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రాణాలతో ఆడుకునే ఇటువంటి శక్తులకు స్వస్తి పలకడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. రాబోయే రోజుల్లో ఇటువంటి శక్తులు ఎక్కడా ఎదగకుండా, చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకున్నాం. దౌర్జన్యమే ఊపిరిగా బతికే పార్టీలకు కాలం చెల్లింది. అరాచక శక్తులను చట్టం తన పని తాను చేసుకోని పోతుంది. రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని షరీఫ్ స్పష్టం చేశారు.
















