- 36 ప్రాజెక్టులకు ఇరిగేషన్ క్యాలెండర్ సిద్ధం
- పోలవరం ఎడమ కాల్వ- చంపావతి లింక్ పై అధ్యయనం
- 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి
- జలధార- జలహరతి పనులకు అధిక ప్రాధాన్యత
- సీజన్ ఆలస్యం కాకుండా కాల్వలకు నీటి విడుదల
- ఇరిగేషన్ క్యాలెండర్లో మరో 11 ప్రాజెక్టులకు ప్రాధాన్యత
- జలవనరుల శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణం, శంకుస్థాపనలు చేపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో 25 ఇరిగేషన్ ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈక్రమంలో సోమవారం రాష్ట్ర సచివాలయంలో పోలవరం సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించారు. దీంట్లో భాగంగా ఇరిగేషన్ క్యాలెండర్ అంశంపై చర్చించారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులు కాకుండా ప్రాధాన్యత కలిగిన మరో 11 ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఆ మేరకు ఆ 11 ప్రాజెక్టులను ఇరిగేషన్ క్యాలెండర్లో చేర్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, సివిల్ వర్క్స్వంటి వాటికి ఎలాంటి నిధుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను సూచించారు. గతంలో ప్రకటించిన 25, సమీక్షలో ప్రకటించిన 11 ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా తీసుకుని ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్కు అనుగుణంగా పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పోలవరం పనులు
సమీక్షా సమావేశం సందర్భంగా పోలవరం సహా వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సివిల్ వర్క్స్ 88 శాతం పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. భూసేకరణ 93శాతం పూర్తైందని, నిర్వాసితుల తరలింపు 45 శాతం పూర్తైందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 2 నాటికి డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి చేశామని వివరించారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1, 2 పనులు 2027 మార్చి 31నాటికి పూర్తవుతాయని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. పోలవరం కుడి కాలువను అనుసంధానించే ట్విన్ టన్నెల్స్ పనులు 85 శాతం పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. ఎడమ కాలువ అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్, ఇరిగేషన్ టన్నెల్ పనులను చేపడుతున్నట్టు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు వివిధ ప్రాజెక్టుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. హంద్రీనీవా ఫేజ్`1లో భాగంగా కాలువల వెడల్పు 92 శాతం పూర్తైందని అధికారులు చెప్పారు. ఫేజ్`2 కుప్పం-పుంగనూరు కాలువల లైనింగ్ 85 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. మల్యాల లిఫ్ట్ నుంచి రాయలసీమ ప్రాంతానికి తొలిసారిగా 52 టీఎంసీ నీటిని తరలించామని చెప్పారు. మొత్తంగా 432 చెరువులు పూర్తిగా నింపామని వెల్లడించారు. జూన్ 2024నుంచి ఇప్పటి వరకూ రూ.2123 కోట్లు వ్యయం చేశామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “ప్రతి నెలా పోలవరం పనుల పురోగతిపై సమీక్షిస్తాను. ఈసీఆరఎఫ్ డ్యామ్ గ్యాప్-1, 2 పనులు చెప్పిన సమయానికి పూర్తి చేయాల్సిందే. ఈ ఏడాది జూలై నెల నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఎడమ కాలువనుంచి నీరు అందివ్వాలి. ఎడమ కాలువ నీరు మేఘాద్రిగడ్డకు పోలవరం జలాలు తీసుకువెళ్లాక అక్కడి నుంచి వంశధార-నాగావళి-చంపావతి వరకూ నీరు వెళ్లేలా చూడాలి. మేఘాద్రిగడ్డ నుంచి చంపావతి లింక్కు ఎంత ఖర్చవుతుందో అధ్యయనం చేయాలి. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించే విషయంలో చట్టప్రకారం ముందుకెîళ్లాలి. 2027 ఏప్రిల్నాటికి నిర్వాసితుల తరలింపును పూర్తి చేయాలి. ఎలాంటి వివాదాలు లేకుండా ఆర్ అండ్ ఆర్ వేగంగా పూర్తి కావాలి. పోలవరం స్పిల్వే దిగువన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. బెస్ట్ టూరిజం ప్రాంతంగా పోలవరం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం కావాలి” అని సీఎం చంద్రబాబు సూచించారు.
వెలిగొండకు హై ప్రయారిటీ
“వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ జూలైనాటికి పూర్తి కావాలి. హెడ్ వర్క్స్, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూసేకరణలాంటి పనుల కోసం ఇంకా రూ.2019 కోట్లు అవసరం. టీబీఎంను తొలగించి అడ్డంకులు లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ బ్యాలెన్సు పనులు వేగంగా పూర్తి కావాలి. అడవిపల్లి, శ్రీనివాసపురం నుంచి నీవా కాలువ ద్వారా చిత్తూరుకు నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. హంద్రీ నుంచి నీవా వరకూ నీళ్లు తీసుకెళ్లేలా ప్రాధాన్యతగా తీసుకుని పనులు పూర్తి కావాలి. నీళ్లు చూస్తే ప్రజల్లో ఓ నమ్మకం వస్తుంది. మైదుకూరు, మడకశిరలాంటి చివరి ప్రాంతాలకు నీళ్లు వెళ్లాలి. నీవాకు ఈ ఏడాది నీరు ఇచ్చేలా లక్ష్యం పెట్టుకోవాలి. కల్యాణి డ్యామ్ నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా మూలపల్లి చెరువుకు నీరు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు కాలువ పనులు వచ్చే ఏడాది జూలైనాటికి పూర్తి కావాలి. వరికిపూడిశెలను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన ఇంపాక్ట్ స్టడీ చేయాలి. అంతరాష్ట్ర సమస్యలు లేకుండా ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం. నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయమై కేంద్రంతో మాట్లాడదాం. గోదావరి-కావేరి అనుసంధానంపైనా కేంద్రంతో సంప్రదింపులు జరుపుదాం” అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఖరీఫ్కు నీరిచ్చే అంశంపై జలవనరుల శాఖకు దిశానిర్దేశం
“ఎల్ నినోలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు అంచనాలను సిద్ధం చేసుకుంటూ పంటలు వేసేలా రైతులను సమాయత్తం చేయాలి. నెల్లూరు సాగు తీరును మార్చేలా చర్యలు తీసుకోవాలి. ఈసారి రెయిన్ఫాల్ మైనస్ 3 శాతంగా ఉంది. భూగర్భ నీటి నిల్వలు 9.49 మీటర్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 0.5 మీటర్లు ఎక్కువ ఉంది. ప్రస్తుత నీటి వనరులను నింపేలా స్ట్రక్చర్ల నిర్మాణం జరగాలి. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. సాగునీటి సంఘాలతోపాటు ప్రజల భాగస్వామ్యం ఉండాలి. నీటి భద్రత అత్యంత కీలకమనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. కృష్ణా డెల్టాలో గతంలో ఆలస్యంగా సాగు సీజన్ ఉండేది. తుపాన్ల ప్రభావంవల్ల పంటనష్టానికి పరిహారం ఇవ్వాల్సి వచ్చేది. పట్టిసీమ ద్వారా గతంలో నీరిచ్చాం. ఈసారి సీజన్ను ముందుకు తీసుకువచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. వాటర్ మేనేజ్మెంట్లో ఇది కీలకమైన అంశం. మైక్రో ఇరిగేషన్ రంగంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. జలధార-జలహరతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. ప్రస్తుతం వ్యవసాయం కోసం సుమారు రూ.17 వేల కోట్ల మేర విద్యుత్ ఖర్చులను భరిస్తున్నాం. భూగర్భ జలాలు పెరిగితే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అప్పుడు ప్రభుత్వంపై విద్యుత్ భారం కూడా తగ్గుతుంది. అందుకే నీటి భద్రతకు ప్రాధాన్యమిస్తున్నాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
గత పాలకుల నిర్వాకంవల్ల నిర్వీర్యమైన లిఫ్ట్ స్కీంలు
ఇరిగేషన్ రివ్యూలో భాగంగా లిఫ్ట్ స్కీంల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 2014-19 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం లిఫ్ట్ స్కీంలకు అవసరమైన కేటాయింపులు జరిపేదని, మరమ్మతులకు తగినన్ని నిధులు వెచ్చించేవారని అధికారులు తెలిపారు. అయితే 2019-24 మధ్య కాలంలో లిఫ్ట్ స్కీంలకు ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు జరపలేదని అధికారులు సీఎంకు వివరించారు. దీనివల్ల సుమారు 362 లిఫ్ట్ స్కీంలు నిర్వీర్యమయ్యాయని అధికారులు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లిఫ్ట్ స్కీంలను పునరుద్ధరించే అంశంపై చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రస్తుతం 156 లిఫ్ట్ స్కీంలు సంపూర్ణంగా, 505 స్కీంలు పాక్షికంగా పని చేస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. లిఫ్ట్ స్కీంలను గాడిలో పెట్టేలా పని చేయాలని సీఎం సూచించారు. గతంలో సుమారు 10 లక్షల ఎకరాలకు లిఫ్ట్ స్కీంల ద్వారా సాగునీటిని అందించే పరిస్థితి ఉండేదని సీఎం గుర్తు చేశారు. అలాంటి వ్యవస్థలు నిర్వీర్యం కాకూడదని, వీటిని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటే రైతులకు మరింత మేలు జరుగుతుందని సీఎం అన్నారు. సమీక్షా సమావేశానికి జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయిప్రసాద్, జలవనరులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమీక్షలో ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్ వివరాలు:
కాటన్ బ్యారేజ్ గేట్స్ (ఫౌండేషన్) – జూన్ 2026
పోలవరం ఎడమ ప్రధాన కాలువ – జూలై 2026
గుంటూరు ఛానల్ ఆధునీకరణ (ఫౌండేషన్) – జూలై 2026
వెలిగొండ ఫేజ్-1 – ఆగస్టు 2026
తుంగభద్ర కొత్త గేట్లు – జూన్/జూలై 2026
హంద్రీ నీవా బ్రాంచ్ (ఫౌండేషన్) – ఆగస్టు 2026
గాలేరు నగరి (ఫౌండేషన్) – ఆగస్టు 2026
నేరడి బ్యారేజ్ (ఫౌండేషన్) – నవంబర్ 2026
మద్దువలస ఫేజ్-2 – జనవరి 2027
హీర మండలం ఎత్తిపోతల పథకం – ఏప్రిల్ 2027
నాగావళి-చంపావతి నదుల లింక్ – జూన్ 2027
పోలవరం ప్రాజెక్ట్ – జూన్ 2027
బుడమేరు ఫ్లడ్ ప్రొటెక్షన్ (అండర్ టన్నెల్, డ్రైనేజ్ ఛానల్, కొల్లేరు వరకు) – జూన్ 2027
ముక్త్యాల ఎత్తిపోతల పథకం – జూన్ 2027
వంశధార ఫేజ్-2 స్టేజ్-2 (హీర మండలం బ్యారేజ్) – జూలై 2027
చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 – జూన్/జూలై 2027
హంద్రీ-నీవా ఫేజ్-2 (నీవా బ్రాంచ్ కెనాల్ వరకు) – అక్టోబర్ 2026
తోటపల్లి డిస్ట్రిబ్యూటరీ – జూలై 2027
నీవా బ్రాంచ్ కెనాల్ (మూలపల్లి వరకు) – జనవరి 2027
మూలపల్లి లిఫ్ట్ – డిసెంబర్ 2027
మడకశిర బ్రాంచ్ కెనాల్ వైడెనింగ్ – డిసెంబర్ 2027
ఝంఝావతి రిజర్వాయర్ – డిసెంబర్ 2027
వేదవతి ఎత్తిపోతల పథకం – జూన్ 2028
భైరవాని తిప్ప – జూన్ 2028
అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ – జూన్ 2028
జీఎనఎసఎస్ కెనాల్ (కడప వరకు) – జూన్ 2028
సోమశిల-స్వర్ణముఖి లింక్ – జూన్ 2028
శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ వైడనింగ్ – డిసెంబర్ 2028
తారక రామతీర్థ సాగర్ – డిసెంబర్ 2027
మహేంద్ర తనయ – జూలై 2027
గజపతినగరం బ్రాంచ్ కెనాల్ – జూలై 2027
గాలేరు-నగరి (కడప, కోడూరు వరకు) – డిసెంబర్ 2028
కోడూరు-బాలాజీ సాగర్ – డిసెంబర్ 2028
గోదావరి డెల్టా మోడర్నైజేషన్ – జూన్ 2028
పెన్నా-సర్వేపల్లి – డిసెంబర్ 2026
వరికిపూడిశెల – డిసెంబర్ 2028














