- సీఎం, మంత్రి సవిత సమక్షంలో ఒప్పందాలు
- 7 సంస్థలతో ఎంవోయూలు..6,100 ఉద్యోగాలు
- ఐదు జిల్లాల్లో ఏర్పాటు కానున్న పరిశ్రమలు
- రూ.4 వేల కోట్లతో ముందుకొచ్చిన ఫిన్లాండ్ కంపెనీ
- టెక్స్టైల్స్ రంగానికి ఊపరి: మంత్రి మంత్రి సవిత
విశాఖపట్నం(చైతన్యరథం): విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్లో టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,380.38 కోట్ల మేర ఏడు ఎంవోయూలు జరిగాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖ సమ్మిట్లో శనివా రం మంత్రి సవిత సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. టెక్నికల్ టెక్స్టైల్స్, రీసైక్లింగ్, గార్మెంట్స్, సిల్క్, అప్పారెల్స్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపారు. విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాప ల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొ చ్చారు. కామధేను సటికా సంస్థ రూ.90 కోట్లతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్ర మతో 650 మందికి ఉద్యోగాలు రానున్నాయి. చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో జీనియస్ ఫిల్టర్స్ సంస్థ రూ.120 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ వల్ల ప్రత్యక్షంగా 250 మంది కి ఉపాధి లభించనుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అరవింద్ అపెరల్ పార్క్ రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ ఏర్పాటుతో రెండు వేల ఉద్యోగాలు రానున్నాయి. గుంటూరులో వామిని ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 కోట్లు మేర పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థతో గుంటూరులో రెండు వేల మందికి ఉపాధి లభించనుంది. విశాఖపట్నంలో ఎంవీఆర్ టెక్స్ టైల్స్ రూ.105.38 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో 900 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనకాపల్లిలో బీసీ యూబీఈ టెక్స్టైల్స్ యాజమాన్యం రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టంది. ఈ సంస్థ 100 మందికి ఉపాధి కల్పించనుంది.
సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు
ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ఏపీలో రూ. 4 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి సవిత సమక్షంలో ప్రభుత్వంతో ఇన్ఫిని టెడ్ ఫైబర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ విశాఖ పట్నంలో ఏర్పాటు కానుంది. టెక్స్టైల్ రీసైక్లింగ్ టెక్నాలజీని ఈ సంస్థ భారత్కు తొలిసారి తీసుకువస్తోంది. మొత్తం ఏడు ఒప్పందా ల ద్వారా ఏపీ టెక్స్టైల్స్ రంగంలో రూ.రూ.4,380.38 కోట్ల మేర పెట్టుబడులు తరలివచ్చాయి. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 6,100 ఉద్యోగాలు రానున్నాయి.
టెక్స్టైల్స్ రంగానికి ఊతం : మంత్రి సవిత
విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్లో చేసుకున్న ఒప్పందాలతో ఏపీ టెక్స్ టైల్స్ రంగానికి ఊతం లభించిందని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టెక్స్టైల్స్ విధానంతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారన్నారు. వారేకాక మరింత మంది రాష్ట్రంలో పెట్టు బడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ పరిశ్ర మలను ఆరు నెలల్లో నెలకొల్పనున్నట్లు వెల్లడిరచారు.













