- ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టండి
- అర్జీల స్వీకరణకు వారంలో ఒకరోజు ప్రజావేదిక
- ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ప్రజావేదికకు హాజరవ్వాలి
- పింఛన్ల పంపిణీకి విధిగా హాజరవ్వండి
- ఫేక్ ప్రచారాలపట్ల నాయకులకు అప్రమత్తంగా ఉండాలి
- పార్టీ కార్యాలయ విభాగాల సమీక్షలో చంద్రబాబు దిశానిర్దేశం
మంగళగిరి (చైతన్య రథం): ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరేలా పార్టీ నేతలు సమన్వయం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లోని పార్టీ కార్యాలయ విభాగాలతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేశారు. పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యల పరిష్కారం, నాయకుల బాధ్యతలపె ముఖ్యమంత్రి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పేదల సేవలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంతోపాటు కార్యకర్తల బీమా, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. పార్టీ కార్యకర్తల బీమాకు సంబంధించిన లెటర్లు ఇంకా అందించని వారి వివరాలను సేకరించి తనకు అందజేయాలన్నారు.
“పేదలకు సేవలో” కార్యక్రమానికి క్రమం తప్పకుండా తాను హాజరవుతున్నానని, నాయకులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ప్రజాసేవలో నేతలు నిబద్ధతతో వ్యవహరించాలని, ప్రభుత్వ కార్యక్రమాలకు నాయకులు తప్పనిసరిగా హాజరై ఫీల్డ్లో ఉండాలని స్పష్టం చేస్తూ, ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా తీసుకెళ్లాలని గుర్తుచేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి అనూహ్య స్పందన, విశేష ఆదరణ లభించడంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రతి నాయకుడు ప్రత్యేక సమయం కేటాయించాలని కోరారు. ఇకనుండి ప్రతి ప్రజాప్రతినిధి వారంలో ఒకరోజు ఖచ్చితంగా ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి ప్రత్యక్షంగా అర్జీలు స్వీకరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవాలని సూచించారు.
ప్రతి జిల్లాకు -నియమించిన ఇంఛార్జి మంత్రులు ఎప్పటికప్పుడు -అప్రమత్తంగా ఉంటూ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నగ్రీవెన్స్ వివరాలను తెప్పించుకొని జిల్లా-యంత్రాంగంతో సమన్వయం చేసుకొని సమస్యల-పరిష్కారం వేగవంతం చేయాలని,-నియోజకవర్గస్థాయిలో పరిష్కారం కాని సమస్యలనుజిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం చూపకపోతే రాష్ట్రస్థాయిలో పరిష్కారం చూపించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని గుర్తు చేశారు. పార్టీ నేతలు జవాబుదారీతనంతో వ్యవహరిస్తే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం రెట్టింపు అవుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న పార్టీ శ్రేణులను పక్కనబెట్టి కొత్తగా వైసీపీ నుండి వచ్చిన వారికి కొందరు ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, క్షేత్రస్థాయినుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, సీనియర్లను, పార్టీ శ్రేణులను పక్కనబెట్టి కొత్తగా బయటనుంచి వచ్చిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. ఎమ్మెల్యేలకు నచ్చిన కార్యకర్తలే కాకుండా పార్టీలోని సీనియర్లను కూడా కలుపుకొని పోవాలని సూచించారు. ప్రతి రోజు కార్యాచరణను అమలుచేసి, వారానికోసారి విశ్లేషించి, నెలకోసారి సమీక్షించి, ప్రజల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నానని, ప్రతిఒక్కరి పనితీరుక సంబంధించిన సమాచారం తనవద్ద ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంవల్ల పేదలకు నాణ్యమైన వైద్యం అందడంతోపాటు పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందన్నారు. శరవేగంగా మెడికల్ కాలేజీలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అసత్యాలతో అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొంథా తుఫాను సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు. ప్రజలకు అండగా నిలబడితే జగన్మోహన్రెడ్డి విషం చిమ్ముతున్నాడన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం గ్రామ, వార్డుస్థాయిలో పార్టీ శ్రేణులను చైతన్యం చేయడంపై నాయకులు దృష్టి సారించాలని కోరారు. కూటమి నాయకులతో సమన్వయం, పార్టీలో క్రమశిక్షణ, సేవా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని మరింత బలపరచాలని సూచించారు. కూటమిలోని పార్టీలతో మాట్లాడి పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా ట్రస్ట్ బోర్డ్ కమిటీలను కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. సమీక్షలో పార్టీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.















