అమరావతి (చైతన్య రథం): రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్ను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాల్లోని 1,575 కుటుంబాలకు పింఛన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వైకాపా ప్రభుత్వం ఈ పింఛన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన మంత్రిమండలి భేటీలో పింఛను పునరుద్ధరణకు ఆమోదం లభించడంతో.. రాజధాని నిర్మాణంలో జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు పింఛన్లను మంజూరు చేస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేశకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2015లో జరిపిన ఇంటింటి సర్వే ఆధారంగా 1,575 కుటుంబాలు పింఛన్లకు అర్హులుగా గుర్తించారు. మరోవైపు నేలపాడులో ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్ పెండిరగ్ పనుల పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.524.70 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. 18 టవర్లలో 492 అపార్ట్మెంట్ యూనిట్ల నిర్మాణం జరుగుతోంది.