- పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
- మంత్రి లోకేష్ పిలుపు
అమరావతి (చైతన్యరథం): కన్నతల్లి లాంటి పుడమితల్లిని కాపాడుకుందామని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరం బాధ్యతగా తీసుకుందామన్నారు. ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టిక్ను విడనాడదాం. ప్రపంచ పర్యావరణ దినోత్సావాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవనన్న ఆధ్వర్యంలో వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఇందులో భాగంగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. వనమహోత్సవంలో ప్రతిఒక్కరం భాగస్వాములవుదాం. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందామంటూ అందరికీ మంత్రి లోకేష్ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.