న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే విడుదలైన డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ అరుగురు అభ్యర్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. ఏవైనా సమస్యలు ఉంటే హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం సూచించింది. టెట్, డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.