- ఆరు అంశాల్లో టీటీడీ కార్యకలాపాల పునర్వవస్థీకరణ
- రాష్ట్రంలో 5 వేల శ్రీవారి ఆలయాల నిర్మాణం లక్ష్యం
- భక్తుల కోసం రూ.2 లక్షల బీమా అమలు చేస్తున్నాం
- విద్య, వైద్యరంగాల్లో శ్రీవారి సేవకులకు కార్యాచరణ
- టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలకు చర్యలు
- తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి స్కైవాక్ ప్రాజెక్ట్
- త్వరలో కేంద్ర సహకారంతో చేపడతాం
- తిరుమలలో నెబీరో కాన్సెప్ట్ కార్యకలాపాలు
- తిరుమల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
తిరుమల (చైతన్యరథం): సీఎం చంద్రబాబు తిరుమలలో రెండోరోజు బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిం చారు. తర్వాత టీటీడీ అధికారులతో సమీక్షించారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పవిత్రమైన దివ్యక్షేత్రంగా తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యం తో పనిచేస్తున్నామని తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియాన్ని ఆధునికీకరించి పునః ప్రారంభించినట్లు చెప్పారు. శ్రీవారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాధలు, శ్రీవారి పరిణ యం లాంటి అంశాలను ప్రదర్శించేలా మ్యూజియంలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. టీసీఎస్ ట్రస్ట్ రూ.104 కోట్లతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే ఐదేళ్ల పాటు ఈ మ్యూజి యం నిర్వహణను కూడా ఆ ట్రస్టుకే అప్పగించాలని నిర్ణయించి నట్లు చెప్పారు. ప్రతీ భక్తుడికీ ఎలసీతో కలిసి ఆధార్ బేస్డ్ ఆన్లైన్ బీమా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఎవరైనా భక్తులు దురదృష్టవశాత్తూ ఇక్కడ మృతిచెందితే వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు వివరించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో దుర్లభ్ దర్శన్ పేరిట ఓ హీలింగ్ ఎక్స్పరి యన్స్ సెంటర్ను ఏర్పాటు చేశాం. శ్రీవారి వైభవం, ఆలయ చరిత్రను ఇతర అంశాలను వివరించేలా ఈ ఎక్సపీరియన్స్ సెంట ర్ ఏర్పాటు అయింది. సామాన్య భక్తులందరికీ స్వామి వారి వైభవాన్ని అందించేలా ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ అందుబా టులోకి వస్తుంది. తిరుమలలో భక్తుల రాకపోకల కోసం 32 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ ఫౌండేష న్ 25, భారత్ బయోటెక్ సంస్థ 7 ఈవీ బస్సులను విరాళంగా టీటీడీకి ఇచ్చాయి. మొత్తం 44 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడు తిరుమలలో భక్తుల రాకపోకలకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా దేవాలయాలు
ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా దేవాలయాలు తయారు కావాలన్నది మా ఆలోచన. శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5000 దేవాలయాలను నిర్మించాలన్నది ఆలోచన. శ్రీవారి సేవ కులను కూడా ఈ ఆలయాలకు అనుసంధానించేలా కార్యక్రమం చేపడతాం. రాష్ట్రవ్యాప్తంగా 65 దేవాలయాలు టీటీడీతో ఆను సంధానమై ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న నగరాల్లో శ్రీవారి దేవాలయాలను ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు ఏర్పాటు చేస్తాం. ప్రతీ వాడలోనూ దేవాలయాలను నిర్మించటం ద్వారా ఆధ్యాత్మికతను పెంపొందిం చాలని నిర్ణయించాం. భవిష్యత్ తరాలకు మన సంస్కృతీ సంప్ర దాయాలను అందించాలన్నది ఆలోచన అని వివరించారు.
ఇంకా మెరుగ్గా అన్న ప్రసాదం
రూ.3,165 కోట్ల కార్పస్ అన్నదానం ట్రస్ట్ కింద ఉంది. అన్న ప్రసాదాన్ని ఇంకా మెరుగ్గా అందించేలా చర్యలు చేపడతాం. ప్రాణదాన ట్రస్ట్ కింద రూ.191 కోట్లు, బర్డ్స్ రూ.240 కోట్లు కార్పస్ ట్రస్ట్ కింద ఉంది. స్విమ్స్ బర్డ్స్, రుయా, చిన్నపిల్లల ఆస్పత్రి ఇలా అన్నింటినీ అనుసంధానం చేస్తాం. వైద్యులను కూడా శ్రీవారి సేవకులుగా మారి ఈ ఆస్పత్రుల్లో సేవలు అందిం చేలా చర్యలు చేపడతాం. తిరుపతిలో ఉన్న ఆస్పత్రులను అను సంధానించి మెరుగైన వైద్యచికిత్సలు అందేలా ప్రణాళిక చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది శ్రీవారి సేవకులుగా రిజిస్టర్ చేసుకున్నారు. టీటీడీ ద్వారా అందే విద్యావ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించాం. విద్యార్థులకు నైపుణ్యం కల్పించటంతో పాటు మంచి ఉద్యోగాలు వచ్చేలా ఈ కార్యక్రమం చేపడతాం. శ్రీవారి దేవాలయాల పేరుతో రాష్ట్రంలో 5 వేల దేవాలాయల నిర్మాణం చేస్తాం. ప్రస్తుతం ఉన్న పాత దేవాలయాలను కూడా పునరుద్ధరించేలా చర్యలు శ్రీవాణి కార్యక్ర మం కిందే చేపడతాం. వృక్ష గోవిందం కార్యక్రమం కింద మెడిసినల్ ప్లాంట్స్ సహా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. ఏడుకొండల నుంచి జాలువారే నీటిని సంరక్షించే లా కార్యక్రమాలు కూడా చేపట్టి భూగర్భజలాలు పెరిగేలా చర్యలు తీసుకుంటాం. మొత్తం ఆరు కార్యక్రమాల ద్వారా తిరు మల అభివృద్ధిని భక్తుల భాగస్వామ్యంతో చేపడతామని వివరించారు.
తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి స్కైవాక్ ప్రాజెక్ట్
తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్ వరకూ లింక్ చేసేలా స్కైవాక్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. త్వరలోనే కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టు చేపడతాం. ఇటీవల సేకరించిన 50 ఎకరాల్లో మల్టీస్టోరీడ్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఉద్యోగులకు ఇంటి జాగాలు ఇచ్చేందుకు రూ.230 కోట్లు వ్యయం అవుతుంది. 5,192 మంది ఉద్యోగులకు ఇంటి జాగాల కు చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే తిరుపతిని వివిధ హైవేలకు కనెక్ట్ చేసేలా కార్యాచరణ చేపడతాం. దిగువ తిరుపతిలో కోర్టు కాంప్లెక్సు కోసం రూ.90 కోట్ల వ్యయం అవుతోంది. తిరుపతి కేంద్రంగా పెద్దఎత్తున ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి. శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చే వారితో తిరుమల తిరుపతి సర్వీస్ హబ్ గా మారుతుంది. తిరుమలతో పాటు తిరుపతిలోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగాలి. ఆధ్యాత్మికంగా ప్రజల్ని కలిపేందుకు ఈ ఉత్సవాలు అత్యంత కీలకం. వెడ్డింగ్ డెస్టినేషన్గా తిరుపతిని మార్చాలన్నది మా ఆలోచన అని తెలిపారు.
నెటీజీరో కాన్సెప్ట్ విధానంలోనే కార్యకలాపాలు
తిరుపతి, తిరుమల అంతా నెటీజీరో కాన్సెప్ట్ విధానంలోనే కార్యకలాపాలు నిర్వహించాలి. సౌర, పవన విద్యుత్ పాటు బ్యాట రీ స్టోరేజి ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరగాలి. ప్రతీ టీటీడీ భవనంపైనా సౌరవిద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని సూచిస్తు కోట్ల యూనిట్లు టీటీడీ వినియోగిస్తోంది. ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలు సర్క్యులర్ ఎకానమీకి వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలి. పర్యావర ణాన్ని కాపాడుకునేలా జీరో వేస్ట్ విధానం అమలు కావాలి. ఓ మోడల్గా తిరుమల అభివృద్ధి కావాలి. దేశంలోని అన్ని దేవాల యాల కంటే తిరుమల తిరుపతి అత్యంత పరిశు భ్రంగా చక్కటి నిర్వహణలో ఉంది. 2300 ఏళ్ల నుంచి ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యుత్తమ దేవాలయంగా ఉండాలి. అత్యంత సేవాభావంతో నిర్వహిస్తున్నాం కాబట్టే దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తున్నారని పేర్కొన్నారు.
ఇతర ప్రాంతాల్లోనూ శ్రీవారి ఆలయాలు
శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని విశిష్టతను ప్రశ్నించిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. శిష్ట రక్షణ- దుష్ట శిక్షణ అనేది స్వామివారే చూసుకుంటారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, బంగా రం, నిధులు, భూములు ఇలా అన్ని వివరాలు ఆన్లైన్లో అత్యంత పారదర్శకంగా ఉన్నాయి. మారిషస్, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని అడుగుతున్నారు. దీని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ శ్రీవా రి ఆలయాలు నిర్మించాలని కోరుతున్నారు. వచ్చే ఏడాదికి సోమశిలకు, ఆపై కందలేరు బాలాజి సాగర్కు నీరు తీసుకొస్తాం. వచ్చే ఏడాదికి కల్యాణి డ్యామ్కు కూడా నీటిని తరలిస్తామని తెలిపారు.













