చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇది నవశకం, యుద్ధానికి ఆరంభం

యువగళం ముంగిపు సభలో నారా లోకేష్

by చైతన్యరధం
Dec 21, 2023 at 8:11am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, రాయలసీమ
ఇది నవశకం, యుద్ధానికి ఆరంభం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ అహంకారానికి – ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటం
  • తాడేపల్లి ప్యాలెస్‌ గోడలు బద్దలు కొడదాం
  • మూడు ముక్కలాట పేరుతో మోసం
  • ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్క ఇటుక కూడా వెయ్యలేదు
  • పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాను, పరిష్కరిస్తాం.
  • యువగళం – నవశకం బహిరంగ సభలో నారా లోకేష్‌

పోలిపల్లి: ఇది నవశకం.. యుద్ధం మెదలయింది.. తాడేపల్లి ప్యాలెస్‌ గోడలు బద్దలు కొట్టేవరకు ఆ యుద్ధం ఆగదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో బుధవారం జరిగిన యువగళం` నవశకం సభలో లోకేష్‌ మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ ఉత్త రాంధ్ర,కొండంత అండ కోస్తాంధ్ర, రత్నాలసీమ రాయ లసీమ, అందరి విశాఖ…అందాల విశాఖ, అన్ని ప్రాం తాల నుండీ వచ్చిన ప్రజలు, ముఖ్య అతిధులుగా వచ్చి న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, మీ అందరి బాలయ్య నా ఒక్కరికే ముద్దుల మామయ్య, టీడీపీ – జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభించారు.

బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ గురూ!
ఏ బొమ్మ చూస్తే జగన్‌ దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్‌కి జ్వరం వస్తుం దో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి ప్యాలస్‌లో టీవీలు పగు లుతాయో ఆ బొమ్మ నేను మీకు చూపిస్తున్నా. విజనరీ చంద్రబాబు, పవర్‌ ఫుల్‌ పవనన్న, మన సింహం బాలయ్య తో కూడిన ఈ బొమ్మ అదుర్స్‌ కదూ. ఒక సారి జూమ్‌ వేసి జగన్‌కి ఐమ్యాక్స్‌ సినిమా చూపిద్దాం. ఇది యువగళం ముగింపు సభ కాదు…ఇది ఆరంభం. ఇది నవశకం. యుద్ధం మొదలైంది. తాడేపల్లి ప్యాలస్‌ గోడలు బద్దలు కొడదాం. ప్రజాస్వామ్యంలో పాదయా త్ర చేస్తే అది పోరాటం. రాక్షసరాజ్యంలో పాదయాత్ర చెయ్యడం ఒక విప్లవం. యువగళం.. మనగళం.. ప్రజాబలం. యువగళం పాదయాత్ర నేను కుప్పంలో మొదలుపెట్టాను. 226రోజులు, 97 నియోజకవర్గాలు, 2100గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసా ను. యువగళాన్ని ఆపేందుకు జగన్‌ జిఓ.1 తీసు కొచ్చాడు. నేను ఆ రోజే చెప్పా బ్రదర్‌ జగన్‌ జిఓ.1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో తగ్గేదేలేదు అని. నా మైక్‌ వెహికల్‌ లాక్కున్నాడు. అన్న ఎన్టీఆర్‌ ఇచ్చిన గొంతు ఇది. ఆపే మగాడు ఇంకా పుట్టలేదు. పోలీ సుల్ని పంపాడు యువగళం ఆగలేదు. వైసీపీ గూండా లను పంపితే మన పసుపు సైన్యాన్ని చూసి పారి పోయారు. బాంబులకే భయపడని బ్లడ్‌ మనది… బెది రింపులకు భయపడతామా? భయం మా బయోడేటా లో లేదు బ్రదర్‌ అని లోకేష్‌ అన్నారు.

సంబంధితవార్తలు

చంపేస్తాం..!

నేడు 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు

ప్రజలకు భరోసా ‘దర్బార్‌’!

మా ముగ్గురినీ చూస్తే జగన్‌కు భయం
నేను మొదటి రోజే చెప్పా సాగనిస్తే పాదయాత్ర… అడ్డుకుంటే దండయాత్ర. జగన్‌ ది రాజారెడ్డి రాజ్యాం గం పొగరు అయితే.. మీ లోకేష్‌ ది అంబేద్కర్‌ రాజ్యాంగం పౌరుషం.
ఒక పక్క యువగళం.. మరో పక్క చంద్రబాబు భవిష్యత్తుకి గ్యారెంటీ.. పవనన్న వారాహి యాత్రతో జగన్‌కి, ఫ్యాన్‌కి ఉక్కపోత మొదలైంది. జగన్‌కు చంద్ర బాబుని చూస్తే భయం, పవనన్నని చూస్తే భయం, మీ లోకేష్‌ని చూస్తే భయం. అందుకే చంద్రబాబుని అక్ర మంగా అరెస్ట్‌ చేసి 53రోజులు నిర్బంధించారు. విజ నరీ అంటే చంద్రబాబు… ప్రిజనరీ అంటే జగన్‌ ఇది ఫిక్స్‌. జగన్‌ అరెస్ట్‌ అయితే రోజుకో స్కామ్‌ బయట పడిరది. చంద్రబాబు గారి అరెస్ట్‌ చేస్తే 15ఏళ్లు సీఎం గా ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం బయటకు వచ్చింది. 53 రోజులు నిజాన్ని బంధించారు. కానీ ఆఖ రికి నిజమే గెలిచిందని లోకేష్‌ అన్నారు.
జగన్‌ అహంకారానికి – ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం
పవనన్న ఏపీకి వస్తుంటే వైసీపీ పిరికి సన్నాసులు అడ్డుకుంటారు. ఆయన రావాలి అనుకున్న విమానం క్యాన్సిల్‌ చేస్తారు. పవనన్నని ఏపీ బోర్డర్‌లో ఆపేస్తారు. ప్రజాస్వామ్యాన్ని నువ్వు దెబ్బతీసావ్‌ జగన్‌… ప్రజా స్వామ్యం తిరగబడి దెబ్బకొడితే ఎలా ఉంటుందో నువ్వు త్వరలోనే చూస్తావ్‌. జగన్‌ ఈ మధ్య పేదలకు – పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నాడు. లక్ష కోట్లు దోచిన వాడు, లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు, వెయ్యి రూపాయల వాటర్‌ బాటిల్‌ తాగేవాడు పేదవాడా? జరగబోయేది జగన్‌ అహంకారానికి – ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం. జగన్‌ అహంకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి పాతిపెడతానని లోకేష్‌ హెచ్చరించారు.

అప్పుల ఊబిలో రాష్ట్రం
జగన్‌ ఒక అప్పుల అప్పారావు. ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్‌ అని ముద్దులు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని నాశనం చేసాడు. జగన్‌ హయాంలో ఏపీ అప్పు రూ. 12 లక్షల కోట్లకు చేరబోతోంది. ఏడాదికి మనం కట్టాల్సిన వడ్డీ ఎంతో తెలుసా రూ. లక్ష కోట్లు. అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే భారం మొయ్యాల్సింది ప్రజలే.
సంపద సృష్టించి సంక్షేమం అందించే విజనరీ చంద్రబాబు రాష్ట్రానికి కావాలి… ప్రజలకు మంచి చెయ్యాలి అనుకునే పవర్‌ ఫుల్‌ నాయకుడు పవనన్న రాష్ట్రానికి కావాలని లోకేష్‌ అన్నారు.
ప్రజల జీవితాలతో ఆడుకున్నావ్‌ సరిపోదా
జగన్‌ కొత్త స్కీం తెచ్చాడు దాని పేరు ఆడుదాం ఆంధ్రా అంట. నాలుగున్నర ఏళ్లుగా ప్రజల జీవితాలతో ఆడుకున్నావ్‌ సరిపోదా జగన్‌? స్టేడియంలు, గ్రౌండుల్లో ప్రాక్టీస్‌ చేయడానికి, ఆడ్డానికి వచ్చినవాళ్లని ఫీజులు కట్టకపోతే రావొద్దంటూ తరిమేస్తున్నాడు ఈ జగన్‌. ఐపీఎల్‌ టీము పెడతామంటున్నాడు. దీనికి కోడికత్తి వారియర్స్‌ అని పేరు పెడితే బాగుంటుంది. సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ అవినాష్‌ రెడ్డి, బెట్టింగ్‌ స్టార్‌ అనిల్‌, అరగంట స్టార్‌ అంబటి, గంట స్టార్‌ అవంతి, ఆల్‌ రౌండర్‌ గోరంట్ల మాధవ్‌, రీల్‌ స్టార్‌ భరత్‌, బూతుల స్టార్‌ కొడాలి నాని, పించ్‌ హిట్టర్‌ బియ్యం మధు. అబ్బో మామూలు టీము కాదని లోకేష్‌ ఎద్దేవా చేశారు.

పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది
పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పింది.నాయకుడు ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకున్నాను. ఒక్క నాయకుడు చేసిన తప్పుల వలన రాష్ట్రం ఎంత నష్టపోయిందో కళ్లారా చూసాను. జగన్‌ విధ్వంసం ప్రతి అడుగులో చూసాను. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు, నకిలీ విత్తనాలతో రైతన్న నష్టపోతున్నాడు. తాగునీటి కోసం మహిళలు బిందెలు మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. పాదయాత్రలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక పక్క మనం తెచ్చిన ఎలెక్ట్రానిక్స్‌, ఐటి కంపెనీలు కనిపించాయి… మరో పక్క పాపాల పెద్దిరెడ్డి పది వేలకోట్ల అవినీతి సామ్రాజ్యం కనిపించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రన్న తెచ్చిన కియా, డ్రిప్‌ ఇరిగేషన్‌ కనపడిరది… జగన్‌ తెచ్చిన కష్టాలు కనపడ్డాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తెచ్చిన విమానాశ్రయం, మెగా సీడ్‌ పార్క్‌, జైన్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌, మెగా సోలార్‌ పార్క్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీలు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించాయి… జగన్‌ మిగిల్చిన కన్నీరు కనిపించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ మునిరాజమ్మ జగన్‌ పాలనలో పడుతున్న బాధని నాతో చెప్పుకుంది. మీడియాతో మాట్లాడిరది. పిల్ల సైకో బియ్యపు మధుసూదన్‌ రెడ్డి మునిరాజమ్మ టిఫిన్‌ బండిని ధ్వంసం చేసాడు. కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరితే వదిలేస్తాం అన్నారు. అయినా ఆమె తగ్గలేదు. సైకో పాలనపై పోరాడిరది ఆమెకు టీడీపీ అండగా నిలబడిరది. ఆమె ధైర్యాన్ని నేను స్ఫూర్తిగా తీసుకున్నాను. పలమనేరుకి చెందిన మిస్బా తల్లితండ్రులు నన్ను కలిసారు. వైసీపీ నాయకుడు కూతురు స్కూల్‌ ఫస్ట్‌ రావాలి అని మిస్బాకి టీసీ ఇచ్చి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసారు. డాక్టర్‌ అవుతానని డైరీ లో రాసుకున్న మిస్బా ని చంపేసిన పాపం ఈ సైకోలను ఊరికే వదలదు. ఇలాంటి బాధ ఏ కుటుంబానికి రాకూడదని కోరుకున్నాను. ఎమ్మిగనూరులో రైతులతో సమావేశమైనప్పుడు రంగమ్మ అనే మహిళా రైతు తన భర్త 12 ఎకరాలు కౌలుకి తీసుకోని అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు అని కన్నీరు పెట్టుకుంది. ఆ మహిళా రైతు కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయాను. వెంటనే ఆమెకు పార్టీ తరపున సాయం అందించాను. మంత్రాలయం నియోజకవర్గంలో వలస కూలీలను కలిసాను. వ్యవసాయ పనులు లేక పిల్లలతో సహా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వస్తున్న వారితో మాట్లాడాను. వ్యాన్‌ లో వాళ్ళను చూసిన తరువాత నాకు బాధ కలిగింది. ఆలూరు నియోజకవర్గంలో నీళ్ల కోసం మహిళలు కిలోమీటర్లు నడవడం చూసాను. ప్యాలస్‌ లో పడుకునే జగన్‌ కి మహిళలు పడుతున్న కష్టం కనపడటం లేదు. జి.డి నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చిన్న టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకొని జీవిస్తున్న మోహన అనే మహిళను కలిసాను. ఆమె భర్త చనిపోయాడు. కష్టపడి ఇద్దరు పిల్లల్ని చదివించారు. పెద్దబ్బాయి ఎంసిఎ, చిన్నబ్బాయి డిప్లొమా చేసారు. ఆమె ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సాయం వద్దు. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూడండి చాలు అని అన్నారు. ఆ మాటలు విన్న తరువాత ఎంత బాధ్యతగా పనిచెయ్యాలో అర్థమైంది. పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పద్మావతి అనే యువతి వచ్చి నన్ను కలిసింది. ఆమె కియా అనుబంధ సంస్థలో పనిచేస్తుంది. అంతకు ముందు హౌస్‌ వైఫ్‌ గా ఉన్న ఆమె ఇప్పుడు కియా అనుబంధ సంస్థలో పనిచేస్తూ నెలకు రూ.30 వేల జీతం సంపాదిస్తుంది. ఆమె కళ్ళలో ఆనందం చూసిన తరువాత నాకు చాలా సంతోషం వచ్చింది. రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు టిడిపి నాయకుడు తగరకుంట ప్రభాకర్‌ పిల్లలు నన్ను కలిసారు. 2004 లో వైఎస్‌ సీఎం అయిన తరువాత తగరకుంట ప్రభాకర్‌ని దారుణంగా హత్య చేసారు. వారి పిల్లల్ని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ లో చదువుకున్నారు. అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ప్రభాకర్‌ చిన్న అమ్మాయి శ్రావణి వచ్చి అన్ని విషయాలు చెప్పి తనకి కూడా బెంగుళూరు లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం వచ్చింది అన్నా అన్నప్పుడు చంద్రన్న లో మానవత్వం గుర్తొచ్చిందని లోకేష్‌ అన్నారు. ప్రకాశం జిల్లా ని ఎడారిగా మార్చాడు. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ పూర్తిచెయ్యలేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాలుగున్నర ఏళ్లుగా అమరావతి రైతులు, మిర్చి, పత్తి రైతులు పడుతున్న కష్టాలు నేరుగా చూసాను. రాజధానిని చంపేసి జగన్‌ పడుతున్న రాక్షస ఆనందం చూసాను. ఉభయగోదావరి జిల్లాల్లో జగన్‌ ఆక్వా రంగాన్ని ఎలా దెబ్బతీశాడో చూసాను. కొబ్బరి, వరి, పామ్‌ ఆయిల్‌ రైతుల బాధలు తెలుసుకున్నాను. గుంతల్లో రోడ్డు ఎక్కడ ఉందా అని వెతుక్కున్నానని లోకేష్‌ అన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి కి ఒక్క ఇటుక వెయ్యలేదు
రాయలసీమ జిల్లాల ప్రజలు పడుతున్న కష్టాలు చూసిన తరువాత మిషన్‌ రాయలసీమ ప్రకటించాను. పెండిరగ్‌ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాము, హార్టీ కల్చర్‌ హబ్‌ గా తయారు చేస్తాం, స్పోర్ట్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా గా మారుస్తాం. ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్‌ గా మారుస్తాం. నెల్లూరు లో ఆక్వా రైతుల కష్టాలు చూసాను. ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్‌ తో సంబంధం లేకుండా రూ.1. 50కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తాం. ప్రజా రాజధాని అమరావతి పూర్తి చేస్తాం. మిర్చి, పత్తి రైతులను ఆదుకుంటాం.
(3వ పేజీ తరువాయి)
ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా, కొబ్బరి, వరి, పామ్‌ ఆయిల్‌ రైతులకు గతంలో ఇచ్చిన సబ్సిడీలు ఇస్తాం. మేజర్‌ రోడ్లు అన్ని సిసి రోడ్లు వేస్తాం. మూడుముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కి ఒక్క ఇటుక వెయ్యలేదు జగన్‌. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆస్తులు కొట్టేయడానికి జగన్‌ స్కెచ్‌ వేసాడు. అందుకే 31 మంది ఎంపీలు ఉన్నా ప్రైవేటీకరణ ఆపడానికి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. క్యాప్టివ్‌ మైన్స్‌ ఇవ్వాలని అడగడు, ఏపీలో ఉన్న మైన్స్‌ ని రెన్యూవల్‌ చెయ్యడు, విద్యుత్‌ బిల్లులు విపరీతంగా పెంచేస్తాడు. విశాఖ రైల్వే జోన్‌ ఒక్క అడుగు ముందుకు కదల లేదు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోవటం వలనే రైల్వే జోన్‌ పనులు ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. రైల్వే జోన్‌ పై పార్లమెంట్‌ లో పోరాడుతోంది టీడీపీ ఎంపీలు మాత్రమే. విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌ ని మూలనపడేసింది వైసిపి ప్రభుత్వం. మనం 42 కిలోమీటర్లు అంటే జగన్‌ వచ్చి 80 కిలోమీటర్ల మెట్రో అన్నాడు. ఇప్పటి వరకూ అసలు డిపిఆర్‌ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తానని జగన్‌ ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. ఒక్క ఫ్యాక్టరీ కూడా ప్రారంభించలేదు. చెరుకు పండిరచే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని జగన్‌ గాలికి వదిలేసాడు. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకొక కంపెనీ విశాఖకు వచ్చేది. ఎన్నో కంపెనీలు నేను స్వయంగా ప్రారంభించాను. ఇప్పుడు ఆ కంపెనీలు అన్నింటినీ తరిమేసాడు. కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఐటీ కంపెనీలు అన్ని పక్కరాష్ట్రానికి పరారయ్యాయని లోకేష్‌ విమర్శించారు.

విశాఖను కబ్జాల రాజధాని చేశాడు
విశాఖని కేపిటల్‌ చేస్తానంటూ క్రైం కేపిటల్‌ చేశాడు. పరిపాలనా రాజధాని చేస్తానని కబ్జాల రాజధాని చేశాడు. దసపల్లా భూములు, సిఎన్బిసి భూములు, హయగ్రీవ భూములు, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ భూములు, స్వతంత్ర సమరయోధుల భూములు, శివారు ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేసారు. లూలూ ని తరిమేసారు. ఆ భూములు కొట్టేసారు. టిడిఆర్‌ బాండ్స్‌ కుంభకోణంలో వేల కోట్లు వైసిపి నాయకులు కొట్టేసారు. రుషికొండ కు గుండు కొట్టి 500 కోట్లతో ప్యాలస్‌ కట్టుకున్నాడు. ఏ2 విజయసాయి రెడ్డి విశాఖను నాశనం చేసాడు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌ రెడ్డి విశాఖ మన్యంలో లేటరైట్‌, బాక్సైట్‌ ను దోచుకుంటున్నాడు. జివిఎంసి అవినీతికి అడ్డాగా మారిపోయింది. చెత్త ట్యాక్స్‌ తప్ప ఒక్క రోడ్డు వెయ్యరు, ఒక్క డ్రైనేజ్‌ కట్టరు. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌ ను జగన్‌ చంపేసాడు. రాయితీలు ఇవ్వకపోవడంతో విజయనగరం జిల్లాలో ఉన్న 31 పైగా ఫెర్రో అల్లా యిస్‌ పరిశ్రమలు మూతపడ్డాయని లోకేష్‌ అన్నారు.

జగన్‌ కట్టింగ్‌ అండ్‌ ఫిట్టింగ్‌ మాస్టర్‌
జగన్‌ కట్టింగ్‌ అండ్‌ ఫిట్టింగ్‌ మాస్టర్‌. ఫిట్టింగ్‌ ఎలా ఉంటుందో చెబుతా. జగన్‌ కి రెండు బటన్స్‌ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్‌. రెండోవది రెడ్‌ బటన్‌. బ్లూ బటన్‌ నొక్కగానే మీ అకౌంట్‌లో 10 రూపాయలు పడతాయి. రెడ్‌ బటన్‌ నొక్కగానే మీ అకౌంట్‌ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్‌ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్‌ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్‌ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్‌ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్‌ కాదు కరెంట్‌ బిల్లుకి, బస్సు టికెట్‌ మీద, పెట్రోల్‌, డీజిల్‌ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్‌ వెయ్యాలి. జగన్‌ కట్టింగ్‌ మాస్టర్‌. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్‌ కట్‌, పండుగ కానుక కట్‌, పెళ్లి కానుక కట్‌, చంద్రన్న బీమా కట్‌, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ కట్‌, ఫీజు రీయింబర్స్మెంట్‌ కట్‌, 6 లక్షల పెన్షన్లు కట్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌ కట్‌. అనంతపురం జిల్లా గుంతకల్‌ మండలం నక్కనదొడ్డి గ్రామానికి చెందిన సరోజ కి రెండు కళ్లు కనిపించవు. ఆమె తమ్ముడికి రైల్వే ఉద్యోగం రావడంతో, అదే రేషన్‌ కార్డులో సరోజ పేరుందని పెన్షన్‌ తీసేశారు. ఇది తట్టుకోలేని ఆమె ఆత్మహత్యకి పాల్పడిరది..ఇది సైకో జగన్‌ చేసిన మర్డర్‌ కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను.

మహిళల్ని నమ్మించి జగన్‌ మోసం చేసాడు
100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్‌. మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. బూమ్‌ బూమ్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌, గోల్డ్‌ మెడల్‌ తెచ్చాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్‌ అన్నాడు. పెన్షన్‌ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ. 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 3,132వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారని లోకేష్‌ తెలిపారు.
మహాశక్తి పథకం కింద…
1) ఆడబిడ్డ నిధి: 18 ఏళ్లు నిండిన మహిళలకు ` నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు.
2) తల్లికి వందనం: ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు బిడ్డలు ఉంటే రూ.30 వేలు.
3) దీపం పథకం: ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం
4) ఉచిత ప్రయాణం: మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం.

యువత భవష్యత్‌ దెబ్బతీసిన జగన్‌
జగన్‌ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్‌ కోరుకుంటున్నాడు. జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు. గ్రూప్‌2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్‌ స్టడీ సర్కిల్స్‌, బీసీ స్టడీ సర్కిల్స్‌ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్‌ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్‌, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్‌ నోటిఫికేషన్‌ ఇస్తాం. పెండిరగ్‌ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం.అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

రైతుల బాధలు పట్టని జగన్‌
జగన్‌ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్‌ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్‌ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్‌ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. మిచౌంగ్‌ తుఫాను తీవ్రంగా ఉంటుందని పది రోజుల నుంచే కేంద్ర విపత్తు సంస్థలు హెచ్చరించాయి. దున్నపోతు జగన్‌ సర్కారు పట్టించుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఎకరాల్లో రూ.10వేల కోట్ల విలువైన పంటలు దెబ్బతింటే కనీసం ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాసే తీరిక కూడా జగన్‌ కి లేదు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని లోకేష్‌ చెప్పారు.

ఉద్యోగులను వేధిస్తున్న జగన్‌
జగన్‌ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్‌ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్‌ లీవులు, 8 టిఎ, డీఏలు పెండిరగ్‌ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్‌ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్‌ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్‌ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్‌ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్‌ కూడా కోతపెట్టాడు జగన్‌. 15 శాతం అలవెన్స్‌ కట్‌ చేసాడు. ఎస్‌ఐ కి 10 వేలు, హెడ్‌ కానిస్టేబుల్‌ కి 8 వేలు, కానిస్టేబుల్‌ కి 6 వేలు కట్‌ చేసాడు. జగన్‌ తెచ్చిన జిఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్‌ యథాతధంగా ఇస్తామని లోకేష్‌ అన్నారు.

బీసీలు, దళితులు, మైనారిటీలకు వేధింపులు
బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. అమర్నాధ్‌ గౌడ్‌ ని పెట్రోల్‌ పోసి చంపేసారు. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు బనాయించారు. నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు బీసీలకి ఇచ్చారు. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.
దళితుల్ని చంపడానికి వైసిపి నాయకులకు జగన్‌ స్పెషల్‌ లైసెన్స్‌ ఇచ్చాడు. డాక్టర్‌ సుధాకర్‌ దగ్గర నుండి కొవ్వూరులో మహేంద్ర వరకూ జగన్‌ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్‌ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్‌ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్‌ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్‌, విదేశీ విద్య, రంజాన్‌ తోఫా, ఇమామ్‌, మౌజమ్‌ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

ఇక మూడు నెలలే..
జగన్‌ పనైపోయింది. అందుకే హడావిడిగా ఎమ్మెల్యేలను ట్రాన్స్‌ ఫర్‌ చేస్తున్నాడు. ఒకరి ఇంటి ముందు చెత్త తీసుకొచ్చి ఇంకొకరి ఇంటి ముందు పోసినంత మాత్రానా చెత్త బంగారం కాదు బ్రదర్‌ జగన్‌. జగన్‌ ఎమ్మెల్యేలను మార్చాలి అంటుంటే జనం జగన్‌ ని మార్చాలి అంటున్నారు. మూడే మూడు నెలలు.. వైసిపికి అంతిమయాత్ర డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. చంద్రబాబుని అరెస్ట్‌ చేసినప్పుడు మొదట నాకు కాల్‌ చేసి అండగా నిలిచింది పవనన్న.
గుండెల్లో ఎంత బాధ ఉన్నా నువ్వు ప్రజల కోసం పోరాడు అని ప్రజల్లోకి పంపింది మా అమ్మ భువనమ్మ. టిడిపి కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. వడ్డీతో సహా చెల్లిస్తాం. చట్టాన్ని ఉల్లఘించిన వారి పేర్లు అన్ని రెడ్‌ బుక్‌ లో ఉన్నాయి వారికి శిక్ష తప్పదు. నా పాదయాత్రలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లు, ఇతర కమిటీల సభ్యులను అభినందిస్తున్నాను. సైకో పోవాలి… సైకిల్‌ రావాలి. మరి మా పవనన్న పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ కూడా చెప్పాలి కదా హలో ఏపీ … బై బై వైసిపి అంటూ లోకేష్‌ ప్రసంగం ముగించారు.

Tags: అప్పుల ఊబిలో రాష్ట్రంఆత్మగౌరవంఉత్తరాంధ్ర అభివృద్ధిఉద్యోగులుచంద్రబాబుజగన్‌ అహంకరంజనసేన అధ్యక్షుడుటీడీపీ అధ్యక్షుడుతాడేపల్లి ప్యాలెస్‌ గోడలు బద్దలుదళితులునవశకంనారా లోకేష్పవన్‌ కళ్యాణ్‌పాదయాత్రపోలిపల్లిప్రజలుప్రజలు కష్టాలుబహిరంగ సభబాలయ్యబీసీలుమూడు ముక్కలాటమైనారిటీలుయుద్ధంయుద్ధం ఆరంభంయువగళంయువత భవష్యత్‌రెడ్ బుక్వేధింపులు
Previous Post

టీడీపీ జనసేన పొత్తు చారిత్రాత్మకం, రాష్ట్రానికి అవసరం

Next Post

మార్పు తెస్తాం, జగన్‌ను ఇంటికి పంపిస్తాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 3-11-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 3-11-2025

కార్యకర్త
@ November 3, 2025
జోగి పాపం పండింది
ఆంధ్రప్రదేశ్

జోగి పాపం పండింది

చైతన్యరధం
@ November 3, 2025
మొంథా బాధిత చేనేతలకు భరోసా
ఆంధ్రప్రదేశ్

మొంథా బాధిత చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ November 3, 2025
డ్రగ్స్‌ దందాలో వైసీపీ నేత కొండారెడ్డి
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్‌ దందాలో వైసీపీ నేత కొండారెడ్డి

చైతన్యరధం
@ November 3, 2025
నకిలీ మద్యం కేసు..
ఆంధ్రప్రదేశ్

నకిలీ మద్యం కేసు..

చైతన్యరధం
@ November 3, 2025
లండన్‌ చేరిన చంద్రబాబు దంపతులు
ఆంధ్రప్రదేశ్

లండన్‌ చేరిన చంద్రబాబు దంపతులు

చైతన్యరధం
@ November 3, 2025
ప్రగతిపథం.. స్వదేశీ!
ఆంధ్రప్రదేశ్

ఆత్మీయ నేస్తానికి నివాళి

చైతన్యరధం
@ November 3, 2025
ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పాన్‌ స్టీల్స్‌..పర్యావరణ అనుమతికి గ్రీన్‌ సిగ్నల్‌!
ఆంధ్రప్రదేశ్

ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పాన్‌ స్టీల్స్‌..పర్యావరణ అనుమతికి గ్రీన్‌ సిగ్నల్‌!

చైతన్యరధం
@ November 2, 2025
Load More

ముఖ్య వార్తలు

పోలవరం నిర్వాసితులకు..రూ.1000 కోట్లు పంపిణీ

పోలవరం నిర్వాసితులకు..రూ.1000 కోట్లు పంపిణీ

చైతన్యరధం
@ November 2, 2025
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

చైతన్యరధం
@ November 2, 2025
కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు..రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం

కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు..రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం

చైతన్యరధం
@ November 2, 2025
సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన, అభివృద్ధి

సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన, అభివృద్ధి

చైతన్యరధం
@ November 2, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

జగన్ పాలనలోనే మెడికల్ సీట్లు ప్రయివేటీకరణ

చైతన్యరధం
@ October 6, 2025 6:30 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

జగన్ తో.. జర జాగ్రత్త!

చైతన్యరధం
@ September 1, 2025 6:12 AM
అన్నదాతకు అండగా.. చంద్రన్న!

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

చైతన్యరధం
@ August 1, 2025 6:28 AM

మద్యం మారీచులపై ఉక్కుపాదమే!

చైతన్యరధం
@ July 29, 2025 6:35 AM
మరిన్ని

తాజా సంఘటనలు

జోగి పాపం పండింది

జోగి పాపం పండింది

చైతన్యరధం
@ November 3, 2025
మొంథా బాధిత చేనేతలకు భరోసా

మొంథా బాధిత చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ November 3, 2025
డ్రగ్స్‌ దందాలో వైసీపీ నేత కొండారెడ్డి

డ్రగ్స్‌ దందాలో వైసీపీ నేత కొండారెడ్డి

చైతన్యరధం
@ November 3, 2025
నకిలీ మద్యం కేసు..

నకిలీ మద్యం కేసు..

చైతన్యరధం
@ November 3, 2025
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist