- తిరుమల ప్రతిష్టను మంటగలిపావు
- భూమన విష ప్రచారం మానుకో
- చెవిరెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది
- టీడీపీ ఉపాధ్యక్షుడు ఆనంద్ సూర్య ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): తిరుమల మీద నిత్యం బురద జల్లు తూ ఏదొక అబాండాలు వేస్తూ వైసీపీ నేతలు తిరుమల ప్రతిష్టను మంటగలిపారని టీడీపీ ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ధ్వజమెత్తారు. భూమన కరుణాకర్రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయ డం మానుకోవాలని హితవుపలికారు. మంగళగిరి టీడీపీ కేం ద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో టీటీడీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టారు. చైర్మన్గా ఉన్నప్పు డు తాళిబొట్ల కోసం టన్నుల కొద్ది బంగారాన్ని బొంబాయికి తీసు కెళ్లి అక్కడ కరిగించి ఎంత కొట్టేశారో కరుణాకర్రెడ్డే చెప్పాలని ప్రశ్నించారు. తరుగు, మరుగు పేరుతో ఎంత మరుగుపరచారో చెప్పాలని నిలదీశారు. దేవుడి సొమ్మును కూడా వైసీపీ ఈ వైసీపీ నేతలు ఇష్టానుసారంగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. వైవీ సుబ్బా రెడ్డి అయితే ఆ దేవదేవుని ప్రసాదాన్ని ఓ స్వీట్ షాపులో అమ్మ కానికి పెట్టి కోట్లాదిమంది భక్తులు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. టికెట్లు అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారు. తిరుమ ల గదుల్లో మీ పోస్టర్లు అంటించుకున్నారు. ఇన్ని చెడ్డ పనులు చేసిన మీరు నేడు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారికి చెందిన రూ.2 కోట్ల విలువైన తల నీలాలను మొదట మయన్మార్, అక్కడి నుంచి థాయ్ల్యాండ్ మీదు గా చైనాకు అక్రమంగా తరలిస్తుండగా అస్సాం రైఫిల్స్ పట్టుకున్న విషయం గుర్తుందా? అది మీకు సిగ్గు అనిపించలేదా? పింక్ డైమండ్ అంటూ చంద్రబాబుపై దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మీ తప్పుడు ప్రచారాలు బయటపడ్డాయి.
టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్ నిధులు రూ.5 వేల కోట్లు దారి మళ్ళించడానికి ప్రయత్నిస్తే హైకోర్టు బ్రేక్ వేసింది. టీటీడీలో అన్యమతస్థుల నియామకం, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం, తిరుమల కొండపై అన్యమత గుర్తు, టీటీడీ వెబ్సైట్లో అన్యమత బోధనలు, భక్తుడికి అశ్లీల వెబ్సైట్ లింక్ పంపడం, దర్శనం, వసతి, అద్దె, టోల్, ప్రసాదాల ధరలు పెంచ డం వంటి అనేక ఘటనలతో తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. నిబంధనలు తుంగలో తొక్కి శారద పీఠానికి అడ్డగోలుగా భూ కేటాయింపులు చేశారు. ముద్దులు పెట్టే స్వామీజీకి, ముద్దులు పెట్టించుకునే జనగ్కు కలిపి అడ్డగోలుగా భూములు కేటాయించా రు. అనేక పాపాలు చేశారు. ఇన్ని పాపాలు చేసినందుకే 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. కూటమి పాలనలో టీటీడీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తు న్నారు. వేద విద్యార్థులకు రూ.3000 భృతి ఇచ్చి వారి అభ్యున్న తికి సహకరిస్తున్న ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారు. అనవసరంగా టీడీపీ, కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం మాను కోవాలని హితవుపలికారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి ఏ గతి పట్టిందో భూమన కరుణాకర్రెడ్డికి కూడా అదే గతి పట్టనుందన్నారు. భూమన చేసిన అవకతవకలకు సమాధానం చెప్పక తప్పదు..వెంకన్న స్వామితో పెట్టుకున్న మీరు ఆ స్వామి ఆగ్రహానికి గురికాకతప్పదని స్పష్టం చేశారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం
జగన్ తాను అధికారంలోకి వస్తే అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం అందరికి ఇచ్చాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఖతాల్లో నగదు జమ చేశాం.. ఇచ్చి హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే ప్రజలు కూటమి పాలనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం నిర్విరామంగా అమలైతే తమకు పుట్టగతులు ఉండవని గ్రహించిన జగన్రెడ్డి తన రౌడీమూకలు, గంజాయి మూకలతో పరామర్శల పేరుతో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనంతో ప్రజలకు జరిగిన మేలును, యోగా మహాసంగమం కార్యక్రమాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించాలనే జగన్రెడ్డి కుట్రపూరితంగా పరామర్శల డ్రామా ఆడుతున్నాడని ధ్వజమెత్తారు.