- లెర్నింగ్ అవుట్ కమ్స్ పై ప్రత్యేక దృష్టి సారించాం
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీలో మంత్రి లోకేష్
న్యూఢల్లీి (చైతన్యరథం): ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. న్యూఢల్లీిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మంత్రి లోకేష్ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాప్రమాణాల మెరుగుదలకు చేపడుతున్న సంస్కరణలను కేంద్రమంత్రికి వివరించారు. ఇందులో భాగంగా ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (ూజుAూ) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విద్యాప్రమాణాల మెరుగుదలకు 9600 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటుచేసి, వన్ క్లాస్ ` వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. 700 యూపీ స్కూళ్లను హైస్కూళ్లుగా అప్ గ్రేడ్ చేశాం. అకడమిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇస్తున్నాం. ఎటువంటి రాజకీయం జోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తెచ్చి సీనియారిటీ ప్రాతిపదికను ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలను విజయవంతంగా పూర్తిచేశామని మంత్రి లోకేష్ తెలిపారు.
విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం
రాష్ట్రంలో కొత్తగా 80 పీఎంశ్రీ స్కూళ్లు, పీఎం జన్మన్ పథకం కింద 79 హాస్టళ్లు మంజూరు చేశారు, స్టెమ్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ కోసం రూ.186 కోట్లు అందించి విద్యారంగ అభివృద్ధికి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు. మనబడి ` మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా పీఎంశ్రీ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 125 ఆటిజం స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములుగా చేసేందుకు ఈ ఏడాది జులై 5న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్ ` టీచర్స్ మీట్ (పీటీఏం)ను నిర్వహిస్తున్నాం. విద్యార్థుల పనితీరును వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో స్కూలు మేనేజ్మెంట్ కమిటీలను భాగస్వాములను చేస్తున్నాం. విద్యారంగ అభివృద్ధికి సలహాల కోసం ప్రతివారం టీచర్స్ యూనియన్లు, ఉత్తమ ఉపాధ్యాయులతో సమావేశమవుతున్నాం. జూలై 5 న జరిగే మెగా పీటీఏం కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను లోకేష్ ఆహ్వానించారు. ఆగస్ట్లో విద్యా శాఖ మంత్రుల కాంక్లేవ్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కు అవకాశం ఇవ్వాలని లోకేష్ కోరగా అందుకు ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై అధ్యయనం చెయ్యాలని కేంద్ర విద్యా శాఖ అధికారులకు ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్న లోకేష్ను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు.
వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యాశక్తి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో లెర్నింగ్ అవుట్ కమ్స్ (అభ్యసనా ఫలితాలు)కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇందులో భాగంగా ప్రైమరీ స్కూళ్లలో గ్యారంటీడ్ ఎఫ్ ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ) ప్రోగ్రామ్ను అమలు చేయబోతున్నాం. యాక్టివ్ లెర్నింగ్లో భాగంగా క్లిక్కర్స్, సమ్మరీ వీడియోలు, ప్రిస్క్రిప్టివ్ హోం వర్క్, పాల్ మోడల్ ను అమలు చేయబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యాశక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్, ఎసెస్మెంట్ బుక్ లెట్స్ అందజేస్తున్నాం. రాబోయే మూడేళ్లలో నూరుశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ప్రాజెక్టు అ, ఆ (అక్షర ఆంధ్ర)ను ఏర్పాటుచేశామని మంత్రి లోకేష్ తెలిపారు.
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
విద్యార్థుల సమగ్రాభివృద్ధి, సంక్షేమం కోసం పలు చర్యలు చేపడుతున్నాం. నూరుశాతం ఎన్రోల్ మెంట్, చైల్డ్ ట్రాకింగ్ కోసం 85శాతం అపార్ ఐడి నమోదును ఇప్పటికే పూర్తిచేశాం. విద్యార్థుల్లో నైతిక విలువల పెంపుదల, లింగసమానత్వంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను, రాజ్యాంగంపై అవగాహన కోసం బాల రాజ్యాంగాన్ని విద్యార్థులకు అందించబోతున్నాం. విద్యార్థుల్లో మానసిక వికాసం కోసం పాఠశాలల్లో యోగా, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, ఎన్జిసి, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే గా ప్రకటించి, స్పోర్ట్స్, ఇతర విద్యేతర కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాం. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో చైతన్యవంతం చేస్తున్నాం. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ పేరిట సత్కరిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం 255 మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను ఏర్పాటుచేశామని మంత్రి లోకేష్ వివరించారు.
యూనిఫైడ్ యాక్ట్ కోసం కసరత్తు
రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు యూనివర్సిటీల్లో ఏకీకృత చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. యూనివర్సిటీల ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మెరుగుదలకు కృషిచేస్తున్నాం. కేజీ టు పీజీ కరిక్యులమ్లో మార్పులు తెస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా వచ్చే పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఎన్ఎస్ క్యుఎఫ్ నైపుణ్యాభివృద్ధి కోర్సులను అమలుచేస్తున్నాం. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత ఉపాధి అవకాశాలు పెంచేలా క్యాంపస్ లలోనే శిక్షణ ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేయబోయే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీని డిజిటల్ యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. సమర్థ్, స్వయం, స్వయం ప్లస్ కార్యక్రమాల అమలు వల్ల ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జిఇఆర్) 36శాతం నుంచి 50శాతానికి పెరిగింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో భాగంగా రాష్ట్రంలో కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తునాం. విశాఖపట్నంలో ఏఐ యూనివర్సిటీ, అమరావతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (IIఖూజుR)ని ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి బడిబయట ఉండకూడదు, చదువు పూర్తిచేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం లభించాలన్న లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు శబరి, సానా సతీష్, లావు కృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కేశినేని శివనాథ్, బస్తిపాటి నాగరాజు, కేంద్ర విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.