- ఎన్టీఆర్ హైదరాబాద్ని సాంస్కృతిక రాజధాని చేస్తే.. చంద్రబాబు సాంకేతిక రాజధాని చేసింది నిజం.
- ఎన్టీఆర్ రూ.2లకే కిలో బియ్యం ఇస్తే.. చంద్రబాబు పీ`4 ద్వారా పేదరికం తొలగించే కృషి చేస్తోంది నిజం.
- ఎన్టీఆర్ పింఛన్ రూ.30లతో ప్రారంభిస్తే.. చంద్రబాబు రూ. 2,840లకు పెంచింది నిజం.
- ఎన్టీఆర్ బీసీలకు 20 శాతం రిజర్వేషన్ ఇస్తే.. చంద్రబాబు 34 శాతం చేసింది నిజం.
- ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ 9 శాతం ఇస్తే.. చంద్రబాబు 33 శాతంకు పెంచింది నిజం.
- ఎన్టీఆర్ తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా లాంటివి ప్రారంభిస్తే.. చంద్రబాబు వాటికి భారీగా నిధులు ఇచ్చింది నిజం
- లోకేష్ పరిణతిని చూసి ఎన్టీఆర్ కన్న బిడ్డలు ‘భళా లోకేష్’ అంటున్నది నిజం.
- బాలయ్యబాబే లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తున్నది నిజం.
- ఎన్టీఆర్ ఏఐ ఆత్మ మహానాడు పలుకులు ముమ్మాటికి నిజాలే.
- ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన దుష్టశక్తిని ఆడిస్తున్నది జగన్ అనేది నిజం.
- మరణానికి ముందు ఎన్టీఆర్ చెప్పింది దుష్టశక్తి స్క్రిప్టే అనేది నిజం.
- ఖైదీ నెం.6093 అని గూగుల్లో కొడితే వచ్చేది జగన్ పేరే.
- గొడ్డలివేటు అని గూగుల్లో కొడితే వచ్చేది జగన్ ముఠా పేర్లే.
- గాజు కొంపలో కూర్చొని వర్ధెల్లి మురళి ఎదుటివారిపై రాళ్లు వేస్తే తిరిగి మాడు పగిలేది వేసినవాళ్లకే.
- అవినీతి సాక్షి ఉద్యోగి వర్ధెల్లి మురళి కుతంత్రం-21
01.06.2025 వ తేదీన వర్ధెల్లి మురళి కడప మహానాడుపై అసూయ, విద్వేషాలతో చంద్రబాబు, లోకేష్లపై విషం చిమ్ముతూ మరో భారీ వ్యాసం రాశారు. గాజుకొంపలో కూర్చొని వర్ధెల్లి మురళి దారినపోయే టీడీపీపై రాళ్లు విసిరితే తిరిగి మాడు పగిలేది వైసీపీకే అన్న సత్యాన్ని ఎప్పటికి తెలుసుకుంటారో చూడాలి.
మహానాడులో ఎన్టీఆర్.. ఏఐ ఆత్మ పలుకులన్నీ నిజాలే
ఎన్టీఆర్ హైదరాబాద్ను సాంస్కృతిక రాజధానిని చేశారు. హుసేన్ సాగర్లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్పై తెలుగు మహాత్ముల విగ్రహాలు స్థాపించారు. చెన్నై నుండి సినిమా పరిశ్రమను హైదరాబాద్కు తరలించారు. ఇలా ఎన్నో చేశారు. అలాగే చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా సైబరాబాద్ నగరాన్ని సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి పట్టణంలోని 30 లక్షల మందికి సైబరాబాద్ ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది. నేడు ప్రతి నలుగురు ఎన్ఆర్ఐలలో ఒకరు తెలుగువారు ఉన్నారంటే దానికి పునాది వేసింది చంద్రబాబే. హైదరాబాద్ను సాంకేతిక రాజధాని చేసింది చంద్రబాబే అని అందరూ అంగీకరిస్తారు. కానీ ఉలిపికట్టెలాంటి జగన్ ముఠా రాతగాళ్లు మాత్రం విషం కక్కుతారు.
ఎన్టీఆర్ కన్న బిడ్డలందరూ భలా లోకేష్ అంటున్నది నిజం
అడుగడుగునా ఆపదల్ని ఎదుర్కొటూ లోకేష్ చేసిన యువగళం పాదయాత్రకు ఎన్టీఆర్ కన్నబిడ్డలందరూ అండగా నిలిచారు. బాలయ్య బాబు మనస్ఫూర్తిగా లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. తాత, తండ్రి ముఖ్యమంత్రులైనా, తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వం ఉన్నా లోకేష్ ఎంతో నమ్రతతో పెద్దల్ని, ప్రజల్ని గౌరవిస్తున్నారు. నాడు పంచాయతీ మంత్రిగా, నేడు విద్యా, ఐటీ మంత్రిగా గొప్ప ఫలితాలు సాధించారు. కార్యకర్తల సంక్షేమంలో, సాంకేతిక విజ్ఞానం అమలులో ఆయనకు ఆయనే సాటి. టీడీపీకి అనుకూలంగాని మంగళగిరిలో ప్రజల ఆదరణ పొంది 90 వేలకు పైగా ఓట్లు సాధించడం ఆయన నాయకత్వ దక్షతకు గీటురాయిగా ఉంది. నేడు ఎన్టీఆర్ ఉండివుంటే నిజంగా ‘భళా మనవడా’ అని వుండేవారు.
ఎన్టీఆర్ ఆశయాల్ని.. పథకాల్ని మరింత బలోపేతం చేసింది చంద్రబాబే.
-ఎన్టీఆర్ తెలుగువారికి ఆత్మగౌరవం పెంచితే.. చంద్రబాబు ఆత్మవిశ్వాసం పెంచారు.
-ఎన్టీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు ఇవ్వగా.. చంద్రబాబు 33 శాతానికి పెంచారు. డ్వాక్రా వ్యవస్థ ద్వారా కోటి మంది మహిళలకు సాధికారత పెంచారు.
-ఎన్టీఆర్ బీసీలకు 20 శాతం రిజర్లేషన్లు కల్పించగా.. చంద్రబాబు 34శాతానికి పెంచారు.
-ఎన్టీఆర్ ఎస్సీ రిజర్వేషన్లు 14 శాతం నుండి 15 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లు 4 శాతం నుండి 6 శాతానికి పెంచారు.
-చంద్రబాబు జస్టిస్ పున్నయ్య కమిషన్ నియమించి ఆ కమిషన్ సిఫార్సు చేసిన 42 అంశాల అమలుకు 18 జీవోలు ఇచ్చారు.
`ఎన్టీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులకు.. చంద్రబాబు భారీగా నిధులు కేటాయించారు.
-ఎన్టీఆర్ రూ.50లకే వ్యవసాయ విద్యుత్ ఇచ్చారు.
-చంద్రబాబు 15 వేల మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు నిర్మించి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాకు పునాది వేశారు.
-తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ చంద్రబాబు, లోకేష్లు ఎన్టీఆర్ ఆశయాల్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
-టీడీపీ దుష్టశక్తి బారిన పడివుంటే ఈపాటికే పార్టీ మునిగిపోయివుండేది.
విద్యా ప్రమాణాల్ని దిగజార్చింది జగనే
-2014-19 మధ్య విద్యా ప్రమాణాల్లో దేశంలో ఏపీ 3వ స్థానంలో ఉంది. 2019-24 మధ్య అది 19వ స్థానానికి దిగజారి పోవడానికి కారణం జగన్ పాలన కాదా?
-ఐదేళ్లలో జగన్ ఒక్క డిఎస్సీ కూడా జరపలేదు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ తొలి ఏడాదే 16.347 ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో 1.96 లక్షల ఉపాధ్యాయ నియామకాలు చేశారు.
-జగన్ పాలనలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లు వదలి వెళ్లిపోయారు. ఉపాధ్యాయులకు సరిగా జీతాలు ఇవ్వలేదు. చిక్కీలకు రూ.5,500 కోట్ల బకాయి పెట్టారు. యూనివర్శిటీలను వైకాపా కార్యాలయాలుగా మార్చారు.
-పాఠశాలలకు వైసీపీ పార్టీ రంగులు వేయడానికి, తీయడానికి రూ.3 వేల కోట్లు దుర్వినియోగం చేశారు. కూటమి పాలనలో రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్లో వ్యత్యాసం 16.8 శాతం మాత్రమే. జగన్ పాలనలో 2023లో వ్యత్యాసం 18 శాతంగాను, 2022లో వ్యత్యాసం 20 శాతంగా ఉంది. పదవ తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాలు జగన్ పాలనకన్నా లోకేష్ ఆధ్వర్యంలో ఎక్కువ శాతం వచ్చాయి
85 శాతం మేనిఫెస్టో హామీలు ఎగ్గొట్టింది జగనే
-మద్యనిషేధంపై మాట తప్పి మడమ తిప్పారు జగన్. కమీషన్ల కోసం విషపూరిత మద్యం పోసి 30 వేలమంది ప్రాణాలు పోగొట్టారు. 35 లక్షలమంది ఆరోగ్యాలు నాశనం చేశారు. మెగా డిఎస్సీ, జాబ్ క్యాలండర్పై మాట తప్పి మడమ తిప్పారు. సీపీఎస్ రద్దుపై మాట తప్పి మడమ తిప్పారు. రైతు భరోసా రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని రూ. 7,500 లకే కోత కోశారు. ఇద్దరు బిడ్డలకు అమ్మ ఒడి ఇస్తానని హామీ ఇచ్చి ఒక్కరికే తగ్గించారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి దానికి విరుద్ధంగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మొత్తం 1.29 లక్షల కోట్ల భారం మోపారు. ఇలా 85 శాతం హామీలు ఎగ్గొట్టారు.
-జగన్ తొలి ఏడాది పింఛన్లు రూ.250 పెంచగా.. చంద్రబాబు ఒకే దఫా రూ.1,000 పెంచారు. జగన్ గ్యాస్ రేట్లు రెట్టింపు చేయగా… చంద్రబాబు 93 లక్షల మందికి ఉచిత గ్యాస్ ఇచ్చారు. జగన్ ధాన్యం బకాయిలు మూడు నెలలకు చెల్లించగా.. చంద్రబాబు 24 గంటల్లోనే చెల్లిస్తున్నారు. అమ్మఒడి ఒక్కొక్కరికి రూ. 13 వేలు ఇవ్వగా.. తల్లికి వందనం ఇద్దరికి రూ. 30 వేలు ఇస్తున్నారు. రైతు భరోసాకు జగన్ రాష్ట్ర నిధులు రూ.7,500 ఇవ్వగా.. చంద్రబాబు రూ.14వేలు ఇస్తున్నారు. ఆగస్టు 15 నుండి ఉచిత బస్ ప్రయాణం అమలు చేయబోతున్నారు. 20 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు వేశారు.
-3 లక్షల ఇళ్లు త్వరలో ఇవ్వబోతున్నారు. 9 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించారు. వీటిద్వారా 6 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు వచ్చాయి. అన్న క్యాంటిన్ల ద్వారా లక్షలాది మంది ఆకలి తీరుస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా స్వయం ఉపాధికి ఇస్తున్నారు. కేంద్రం పంపిన స్థానిక సంస్థల నిధులు దారి మల్లించకుండా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఇచ్చారు. ఇలా తొలి ఏడాదే 700లకు పైగా చంద్రబాబు ప్రభుత్వం మంచి పనులు చేసింది. తొలి ఏడాదే ఇన్ని హామీలు అమలుపరచిన ప్రభుత్వం మరొకటి లేదు. జగన్ ముఠా కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ధర్నాల డ్రామాలు ఆడుతున్నారు.
గురజాల మాల్యాద్రి
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జె సెంటర్