- పంచాయతీల స్వయం ప్రతిపత్తి లక్ష్యంగా ముందుకు
- పర్యావరణ హితంగా గ్రామాల్లో ఆర్థిక వృద్ధికి కృషి
- గుంతల రహిత రోడ్లు, గ్రామీణ ఉత్పత్తులకు మార్కెటింగ్
- పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పారిపాలన
- పంచాయతీరాజ్కు ఆర్థిక సంఘం సహకారం అవసరం
- 16వ ఆర్థిక సంఘం సమావేశంలో పవన్కళ్యాణ్
అమరావతి(చైతన్యరథం): వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామీణాంధ్రప్రదేశ్ కీల కం..పంచాయతీల స్వయం ప్రతిపత్తి సాధన లక్ష్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకువెళుతుందని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మం త్రి పవన్కళ్యాణ్ తెలిపారు. గ్రామాల సమగ్రాభివృద్ధితో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, వలసలు అరికట్టడం, ఆహార భద్రత వంటి లక్ష్యాల సాధన సాధ్య పడు తుందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంలో ఆర్థిక సంఘం సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఈ దిశగా ఆర్థిక సంఘం సహాయ సహకారాలతో పనిచేస్తామ న్నారు. బుధవారం సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులతో నిర్వహించిన సమా వేశంలో పాల్గొన్నారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా, ఇతర సభ్యుల తో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పక్షాన పవన్ తొమ్మిది అంశాలతో కూడిన ప్రతిపాదనలను ఆర్థిక సంఘం ముందుకు ఉంచారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాలకు సమాన పాత్ర ఉండా లి. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు కలసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రతి గ్రామాన్ని డిజిటల్ పంచాయతీగా అభివృద్ధి చేసే లక్ష్యంతో వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయనున్నామ ని వివరించారు. దీంతోపాటు వ్యవసాయం, మార్కెట్, రోడ్లు, గ్రామీణ పంపిణీ హబ్ల ఏర్పాటు, గుంతలు లేని రహదారుల నిర్మాణం ధ్యేయంగా పెట్టుకున్నాం. పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఏకీకృత సేవల విధానం సిబ్బంది నియామకాలతో పాటు నైపుణ్య సామ ర్థ్యాల పెంపుదల, క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా సమూల మార్పులు తీసుకురావడం జరిగింది. ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచా యతీల్లో గ్రామసభలు నిర్వహించడం ద్వారా విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టబోయే పనుల్లో ప్రజలను భాగస్వాములుగా చేయడంతో పాటు ఓ పారదర్శక విధానానికి నాంది పలికామని వివరించారు.
గ్రామాల్లో జాతీయ భావం పెంపొందించేందుకు చర్యలు
పంచాయతీల్లో జాతీయ భావాన్ని పెంపొందించే క్రమంలో గ్రామాల్లో స్వాతంత్య్ర దినోత్సవ, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా నిర్వ హణ వ్యయాన్ని రూ.100 నుంచి రూ.10 వేలకు, రూ.250 నుంచి రూ.25 వేలకు పెంచడం ద్వారా జాతీయ వేడుకలు ఘనంగా నిర్వహించుకునే ఏర్పాటు చేశాం. పంచాయతీల్లో జాతీయ భావం పెంపొందేలా చర్యలు చేపట్టాం. గ్రామాల్లో కలప మొక్క ల పెంపకం, ఎకో టూరిజం అభివృద్ధి, సినిమా రంగం, మీడియా వ్యవస్థల నిర్వహణ అనువైన పరిస్థితులు తీసుకురావడం, ఇతర స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశా లు మెరుగుపర్చడం ద్వారా ఆర్థిక వృద్ధికి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. స్థానికంగా ఉన్న ప్రతికూలతలను అవకాశాలుగా మలుచుకునేలా మెరుగైన విధానాలను అమలు చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో గో సంర క్షణ నిమిత్తం గోకులాల నిర్మాణం, హార్టీకల్చర్కు ప్రోత్సాహకాలు అందించడం, గిరిజ న..పీవీటీజీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించే కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పంచాయతీలే దేశ నిర్మాణానికి పునాదులు అని నమ్ముతున్నాం. జాతీయ వృద్ధిలో పంచాయతీల పాత్ర కీలకం. ఇబ్బందులు ఉన్నప్ప టికీ 2024 – 2025 ఆర్థిక సంవత్పరంలో దాదాపు రూ.800 కోట్ల ఇంటి పన్నును వసూలు చేశాం. పంచాయతీరాజ్ సంస్థల విస్తరణ ద్వారా ఆర్థిక వృద్ధిని సాధన దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
పాలనా వ్యవస్థలను ఏకతాటిపైకి తీసుకువస్తాం
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటి సరఫరా సదుపాయం కల్పించి వాటిపై స్థానిక సంస్థల అజమాయిషీ కల్పించడం, ద్రవ, ఘన వ్యర్థాల నిర్వ హణ వ్యవస్థను ఏర్పాటు చేసి సంపద సృష్టించడం ద్వారా ఆదాయాన్ని అందించడం, చిట్టచివరి గ్రామాలను సైతం అనుసంధానిస్తూ ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితు లను తట్టుకునే విధంగా రహదారుల నిర్మాణం చేపట్టడం వంటి కార్యక్రమాలను ముం దుకు తీసుకువెళుతున్నాం. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు రాష్ట్రంలో ఉన్న 13,371 గ్రామ పంచాయతీలు, 660 మండల పరిషత్లు, 26 జిల్లా పరిషత్లకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించి బలోపేతం చేయాల్సి ఉంది. తమ అంచనా మేరకు 2026-2027 నుంచి 2030-2031 వరకు స్థానిక సంస్థలకు రూ.62,515 కోట్ల మేర నిధుల లోటు ఉంటుందని భావిస్తున్నాం. ఉమ్మడి గ్రాంట్లలో అత్యధిక శాతం స్థానిక అవసరాల అభివృ ద్ధికి వినియోగించాలి. స్థానిక సంస్థలకు నిధులు నేరుగా పంపిణీ చేయడం ద్వారా అభివృద్ధి పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం లభిస్తుంది. కూటమి ప్రభు త్వంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పూర్తిస్థాయిలో సంస్కరణలు అమలు చేస్తూ.. పరిపాలనా వ్యవస్థలను ఏకతాటి మీదకు తీసుకురావడం ద్వారా వ్యవస్థల బలో పేతానికి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.