చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో ఆకలికి అడ్డుకట్ట

సామాన్యులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి

by చైతన్యరధం
Aug 17, 2024 at 6:48am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో ఆకలికి అడ్డుకట్ట
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వంద రోజుల్లోపే హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం
  • పేదలను హేళన చేసేలా వైకాపా ఎమ్మెల్యే మాటలు బాధాకరం
  • మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం
  • నులకపేట, మంగళగిరిల్లో క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి లోకేష్‌
  • సామాన్యులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి

మంగళగిరి(చైతన్యరథం): అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో కూటమి ప్రభుత్వం పేదల ఆకలికి అడ్డుకట్ట వేసిందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. శుక్రవారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని నులకపేట, మంగళగిరి పాతబస్టాండ్‌ వద్ద ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను కూటమి నేతలతో కలిసి మంత్రి లోకేష్‌ ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి లోకేష్‌ నివాళులు అర్పించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రిబ్బన్‌ కట్‌ చేసి అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అన్న క్యాంటీన్‌ లలో ప్రజలకు స్వయంగా ఉదయం అల్పాహారం వడ్డించిన మంత్రి నారా లోకేష్‌.. అన్న క్యాంటీన్‌ వెబ్‌ సైట్‌ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టోకెన్‌ జారీ ప్రక్రియ, విరాళాల కోసం రూపొందించిన వెబ్‌ సైట్‌ ను పరిశీలించారు.

వంద రోజుల్లోపే హామీ నిలబెట్టుకున్నాం
గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్‌-6 హామీలతో పాటు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజల్లోగానే అన్న క్యాంటీన్ల ఏర్పాటు హామీని నిలబెట్టుకున్నాం. 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం. మిగతా వాటిని కూడా యుద్ధప్రాతిపదికన ప్రారంభిస్తాం. జగన్‌ రెడ్డి పాలనలో ఒకే ఒక్క సంతకంతో అన్న క్యాంటీన్లను మూసేశారు. దీనిపై శాసనమండలిలో నేను నిలదీయగా.. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని ఆనాటి మున్సిపల్‌ శాఖ మంత్రి హామీ ఇచ్చారు. కానీ తరువాత ఆ ఊసే ఎత్తలేదు. ప్రశ్నిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారని మంత్రి లోకేష్‌ అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-09-2025

చైతన్యరధం ఈ పేపర్ 31-08-2025

చైతన్యరధం ఈ పేపర్ 30-08-2025

 

ప్రతిపక్షంలో మంగళగిరి ప్రజల కోసం 4 అన్న క్యాంటీన్ల నిర్వహణ
ప్రతిపక్షంలో ఉండగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం నారా లోకేష్‌ 4 అన్న క్యాంటీన్లను నిర్వహించారు. మంగళగిరి పట్టణం, తాడేపల్లిలోని నులకపేట, దుగ్గిరాలలోని రైలుపేట, రేవేంద్రపాడులో సొంత నిధులతో అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేశారు. రూ.2కే మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించారు. వందలాది మంది పేద ప్రజల ఆకలి తీర్చారు. దీంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల కోసం 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సొంత నిధులతో తోపుడు బండ్లు, ప్రజల దాహార్తి తీర్చేందుకు జలధార వాటర్‌ ట్యాంకర్లు, వైద్యసేవలకు ఆరోగ్యరథాలు, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు కుట్టుమిషన్లు, చేనేతలకు మగ్గాలు, స్వర్ణకారులకు పనిముట్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు, పాదచారులు సేదదీరేందుకు సిమెంటు బల్లలు అందజేశారు.

సామాన్యులతో కలిసి అల్పాహారం..
మంగళగిరి పాతబస్టాండ్‌ వద్ద ప్రారంభించిన అన్న క్యాంటీన్‌లో సామాన్యులతో కలిసి మంత్రి నారా లోకేష్‌ టిఫిన్‌ చేశారు. ఈ సందర్భంగా తనతో పాటు టిఫిన్‌ చేస్తున్న అజయ్‌ నగర్‌ కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు జోసఫ్‌ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎంత కూలీ వస్తుందని, గతంలో రాజధాని పనులు ఉన్నప్పుడు ఎలా ఉండేదని ఆరా తీశారు. ప్రస్తుతం తనకు రోజుకు రూ.700 కూలీ వస్తుందని, భార్యా పిల్లలు ఉన్నారని జోసఫ్‌ తెలిపాడు. మరో నెలరోజుల్లో అమరావతి పనులు ప్రారంభమవుతాయని, అప్పుడు ఖాళీ ఉండదని మంత్రి లోకేష్‌ భరోసా ఇచ్చారు.

జగన్‌ రెడ్డి వృథా ఖర్చుతో పేదలకు మూడు పుటలా అన్నం లభించేది
జగన్‌ రెడ్డి మన పాస్‌ పుస్తకాలపైన, సర్వేరాళ్లపైన తన ఫోటోలు ముద్రించేందుకు రూ.700 కోట్లు ఖర్చు చేశారు. విశాఖ రుషికొండపై రూ.500 కోట్ల ఖర్చుతో విలాసవంతమైన ప్యాలెస్‌ నిర్మించారు. సొంత పత్రిక సాక్షికి 50శాతం ఐ అండ్‌ పీఆర్‌ బడ్జెట్‌ రూ.400 కోట్లతో ప్రకటనలు ఇప్పించారు. 203 అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఏడాదికి సుమారు రూ.200 కోట్లు ఖర్చవుతోంది. రుషికొండ ప్యాలెస్‌కు పెట్టిన డబ్బులతో నిరుపేద కుటుంబాలకు రెండున్నర సంవత్సరాలు మూడు పూటలా భోజనం లభించేది. సాక్షికి ఇచ్చిన డబ్బులు ద్వారా రెండేళ్లు, సర్వే రాళ్ల ఖర్చు, పాస్‌ పుస్తకాల బదులు మూడేళ్లు అన్న క్యాంటీన్లు నడిపించవచ్చు. అన్న ఎన్టీఆర్‌ పేద ప్రజలే తమ దేవుళ్లని నినదించారు. నాడు, నేడు ఎప్పుడూ టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు నిరుపేద కుటుంబాల గురించే ఆలోచిస్తాయి. అందులో భాగంగనే మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించామని మంత్రి లోకేష్‌ చెప్పారు.

పేదవారిని ఎగతాళి చేసేలా వైకాపా ఎమ్మెల్యే మాట్లాడటం బాధాకరం
అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై వైకాపా ఎమ్మెల్యే పేదవారిని ఎగతాళి చేసేలా మాట్లాడటం బాధాకరం. మీరు చేతగానివాళ్లు. నిరుపేద కుటుంబాలకు మూడు పూటలా భోజనం పెట్టలేని అసమర్థులు. నిరుపేద కుటుంబాలను అవమానించే హక్కు మీకు ఎవరిచ్చారు? దీనిపై ఫేక్‌ జగన్‌ ఎక్కడా స్పందించరు. కనీసం ఖండిరచలేదు. ఏ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తోందో, ఎవరు పెత్తందార్ల గురించి ఆలోచిస్తున్నారో ప్రజలందరూ గమనించాలని మంత్రి లోకేష్‌ అన్నారు.

మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం
మంగళగిరి ప్రజలను నన్ను భారీ మెజార్టీతో ఆశీర్వదించారు. నాపై బాధ్యత చాలా పెరిగింది. ఎన్నికల ప్రచారంలో నేను మంగళగిరి ప్రజలకు అనేక హామీలు ఇచ్చా. పద్ధతి ప్రకారం ఆ హామీలన్నీ నెరవేరుస్తాం. మొదటి మూడేళ్లలోనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ప్రభుత్వ, రైల్వే, కొండ, వాగు పోరంబోకు భూముల్లో నివసిస్తున్నారు. వారికి శాశ్వత భూహక్కులు కల్పించే ప్రక్రియ ప్రారంభించాం. చేనేత సోదరులకు జీఎస్టీ రద్దుపై కేంద్రంతో సంప్రదించాం. అవసరమైతే రాష్ట్రమే జీఎస్టీ చెల్లిస్తుందని హామీ ఇచ్చా. స్వర్ణకారుల కోసం జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ పార్క్‌ ఏర్పాటు చేస్తాం. వారికి అత్యాధునిక నైపుణ్యశిక్షణ అందిస్తాం. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేశాం. త్వరలోనే దీనిని ప్రారంభిస్తాం. భూగర్భ డ్రైనేజీ, 24 గంటల తాగునీరు, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ తీగలు ఏర్పాటు వంటి వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి హామీని తూచా తప్పకుండా కూటమి ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా నిలబెట్టుకుంటాం. మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తాం. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరిస్తాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రణాళికలను ప్రజల ముందు పెడతామని మంత్రి లోకేష్‌ చెప్పారు.

ప్రభుత్వాలు మారినా అన్న క్యాంటీన్లు ఆగకూడదు
తిరుమలలో మొట్టమొదటి సారిగా అన్న ఎన్టీఆర్‌ అన్నదానం ప్రక్రియను ప్రారంభించారు. దాతలు ఆనాడు రూ.3కోట్లు అందజేశారు. ఇప్పుడు దాదాపు రూ.1800 కోట్ల ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లు అన్నదానం ట్రస్ట్‌ కు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా మూడు పుటలా భక్తులకు అన్నదానం చేస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలో శాశ్వతంగా అన్న క్యాంటీన్లు నడవాలనేది మా లక్ష్యం. ఇందుకోసం పారదర్శకంగా ట్రస్ట్‌ ఏర్పాటుచేస్తాం. దాతలు ముందుకు రావాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పెనుమత్స శ్రీనివాసరాజు కోటి విరాళంతో పాటు వచ్చే ఐదేళ్లు కోటి రూపాయలు ఇవ్వనున్నారు. నా తల్లి భువనేశ్వరి కూడా కోటి విరాళం ఇచ్చారు. అందరూ ముందుకు రావాలని పిలుపునిస్తున్నా. పవిత్ర బాధ్యత మనపై ఉంది. ఆకలిలేని ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కలిసికట్టుగా సాధిద్దాం. ప్రభుత్వాలు మారినా అన్న క్యాంటీన్లు ఆగకూడదని మంత్రి లోకేష్‌ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను బలోపేతం చేస్తాం
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 50శాతం అడ్మిషన్లు మాత్రమే ఉన్నాయి. అడ్మిషన్లు పెంచాల్సిన బాధ్యత నాపై ఉంది. గత ప్రభుత్వం పాఠశాలలను నిర్లక్ష్యం చేయడంతో 2 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఉపాధ్యాయులు బోధనపైనే దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. సెర్చ్‌ కమిటీ ఏర్పాటుచేసి త్వరలోనే యూనివర్సిటీల్లో శాశ్వత వీసీలను నియమిస్తామని మంత్రి లోకేష్‌ చెప్పారు.

విదేశీ విద్యకు అంబేద్కర్‌ పేరు తీసేసి జగన్‌ రెడ్డి పేరు పెట్టుకున్నారు
జగన్‌ రెడ్డి సైకో నే కాదు ఫేక్‌ కూడా. ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్‌ స్మృతివనం వద్ద అంబేద్కర్‌ పేరు కంటే జగన్‌ రెడ్డి పేరు పెద్దదిగా ఉండటంతో బాధపడిన కొంతమంది దళిత యువకులు జగన్‌ రెడ్డి పేరు పీకేశారు. తొలగించింది జగన్‌ రెడ్డి పేరుని. అంతకుమించి ఏమీ చేయలేదు. విగ్రహానికి ఏదో జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం విదేశీ విద్యకు అంబేద్కర్‌ పేరు పెడితే జగన్‌ రెడ్డి వచ్చిన తర్వాత తీసేసి తన పేరు పెట్టుకున్నారు. ముందు దీనికి సమాధానం చెప్పాలని మంత్రి లోకేష్‌ డిమాండ్‌ చేశారు.

అడ్డగోలుగా ప్రజాసంపదను లూటీ చేస్తే చర్యలు తీసుకోకూడదా?
చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలను, ప్రజలను ఇబ్బందిపెట్టిన వారిని వదలిపెట్టనని ఆనాడు నేను స్పష్టంగా చెప్పా. జోగి రమేష్‌ కుమారుడు అగ్రిగోల్డ్‌ భూములు కొనుగోలు చేసి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. దీనిపై చర్యలు తీసుకోకూడదా? లిక్కర్‌, ఇసుక దందాలపైనా చర్యలు తీసుకుంటాం. అడ్డగోలుగా ప్రజాసంపదను లూటీ చేస్తే చర్యలు తీసుకోకూడదా? ఎన్నికల ప్రచారంలో రెడ్‌ బుక్‌ ఊరారా చూపించా. ప్రజలు మాకు అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. కక్షసాధింపుల ఆలోచన మాకు లేదు. అధికారులందరినీ తీసేయాలనే ఆలోచన లేదు. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తాం. గత ప్రభుత్వంలో విద్యాశాఖలో కూడా పెద్దఎత్తున కుంభకోణాలు జరిగాయి. స్కూల్‌ కిట్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయి. దీనిపై కమిటీ వేస్తామని మంత్రి లోకేష్‌ చెప్పారు.

ఘోర ఓటమి తర్వాత కూడా వైకాపాకు బుద్ధి రాలేదు
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికపై వైకాపా నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఎన్డీయే కూటమికి 164 స్థానాల్లో ప్రజలు పట్టంకట్టిన తర్వాత కూడా వైసీపీకి బుద్ధిరాలేదు. ఎవరైనా కూటమిలో చేరాలంటే రాజీనామా చేసిన తర్వాతనే చేర్చుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టంగా చెప్పారు. వైకాపా హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏవిధంగా జరిగాయో మనం చూశాం. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను ఇంట్లో కట్టేసి, హౌస్‌ అరెస్ట్‌లు చేశారు. అడ్డగోలుగా రిగ్గింగ్‌ చేశారు. మాకు ఎమ్మెల్సీ ముఖ్యం కాదు.. ఎవరినైనా సరే రాజీనామా చేసిన తర్వాతనే కూటమిలో చేర్చుకుంటామని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ కూటమి నేతలతో పాటు అధికారులు, అక్షయపాత్ర నిర్వాహకులు పాల్గొన్నారు.

Previous Post

జిల్లా కేంద్రంగా హిందూపురం

Next Post

స్వర్ణాంధ్రప్రదేశ్‌` విజన్‌ 2047పై పారిశ్రామిక వేత్తలు, నిపుణులతో టాస్క్‌ ఫోర్స్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-09-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-09-2025

కార్యకర్త
@ September 1, 2025
చైతన్యరధం ఈ పేపర్ 31-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-08-2025

కార్యకర్త
@ August 31, 2025
చైతన్యరధం ఈ పేపర్ 30-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-08-2025

కార్యకర్త
@ August 30, 2025
చైతన్యరధం ఈ పేపర్ 29-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-08-2025

కార్యకర్త
@ August 29, 2025
దివ్యాంగులకు ఒక్క రూపాయి కూడా పింఛన్‌ పెంచని జగన్‌
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు ఒక్క రూపాయి కూడా పింఛన్‌ పెంచని జగన్‌

చైతన్యరధం
@ August 29, 2025
ఫాస్ట్‌ ట్రాక్‌లో పారిశ్రామిక ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్

ఫాస్ట్‌ ట్రాక్‌లో పారిశ్రామిక ప్రాజెక్టులు

చైతన్యరధం
@ August 29, 2025
ఉల్లి రైతుకు మేలు!
ఆంధ్రప్రదేశ్

ఉల్లి రైతుకు మేలు!

చైతన్యరధం
@ August 29, 2025
ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు
ఆంధ్రప్రదేశ్

ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు

చైతన్యరధం
@ August 29, 2025
Load More

ముఖ్య వార్తలు

ఫాస్ట్‌ ట్రాక్‌లో పారిశ్రామిక ప్రాజెక్టులు

ఫాస్ట్‌ ట్రాక్‌లో పారిశ్రామిక ప్రాజెక్టులు

చైతన్యరధం
@ August 29, 2025
విశాఖలో గూగుల్‌ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌

విశాఖలో గూగుల్‌ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌

చైతన్యరధం
@ August 29, 2025
వచ్చే మహిళా దినోత్సవం నాటికి..లక్షమంది మహిళా పారిశ్రామిక వేత్తలు

వచ్చే మహిళా దినోత్సవం నాటికి..లక్షమంది మహిళా పారిశ్రామిక వేత్తలు

చైతన్యరధం
@ August 27, 2025
పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య రక్ష!

పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య రక్ష!

చైతన్యరధం
@ August 24, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

చైతన్యరధం
@ August 1, 2025 6:28 AM

మద్యం మారీచులపై ఉక్కుపాదమే!

చైతన్యరధం
@ July 29, 2025 6:35 AM

దొంగలు, క్రిమినల్స్‌ కంపెనీ వైసీపీ!

చైతన్యరధం
@ July 25, 2025 6:09 AM

జగన్‌ అబద్ధాలకు బ్రేకులేయాలి!

చైతన్యరధం
@ July 12, 2025 6:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దివ్యాంగులకు ఒక్క రూపాయి కూడా పింఛన్‌ పెంచని జగన్‌

దివ్యాంగులకు ఒక్క రూపాయి కూడా పింఛన్‌ పెంచని జగన్‌

చైతన్యరధం
@ August 29, 2025
ఫాస్ట్‌ ట్రాక్‌లో పారిశ్రామిక ప్రాజెక్టులు

ఫాస్ట్‌ ట్రాక్‌లో పారిశ్రామిక ప్రాజెక్టులు

చైతన్యరధం
@ August 29, 2025
ఉల్లి రైతుకు మేలు!

ఉల్లి రైతుకు మేలు!

చైతన్యరధం
@ August 29, 2025
ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు

ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు

చైతన్యరధం
@ August 29, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist