- రెండేళ్లలో ఇరిగేషన్కి రూ.24 వేల కోట్లు ఖర్చు
- క్యాలెండర్కు అనుగుణంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు
- పుష్కరాలకు ముందే పోలవరం జాతికి అంకితం
- డబ్బులిచ్చి మరీ గొడ్డలి పార్టీ అరాచకాలు సృష్టిస్తోంది
- పవన్ను, వాళ్ల కుటుంబసభ్యులను అవమానిస్తున్నారు
- పిచ్చుకలంకలో రైతుల సమావేశంలో సీఎం చంద్రబాబు
- ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనుల ప్రారంభం
కొత్తపేట/ఆత్రేయపురం(చైతన్యరథం): గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీంట్లో భాగంగానే సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్కు కొత్త గేట్లను అమరుస్తు న్నట్టు చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజీకి రూ.152.95 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్లను అమర్చే పనులను ఆయన ప్రారం భించారు. ఈ మేరకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెలకు కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు గేట్లను అమర్చే పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రస్తుతం సముద్రంలోకి ఎంత నీరు వెళుతోందని సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం 27 వేల క్యూసెక్కుల నీరు సము ద్రంలోకి వెళుతోందని అధికారులు వివరించారు. అలాగే కాల్వల కు ఎన్ని క్యూసెక్కులు విడుదల చేశారని అడగ్గా.. 14,700 క్యూసెక్కుల నీరు కాల్వలకు వదిలామని అధికారులు చెప్పారు.
కాల్వ చివరి భూములకూ నీరు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధు లు, అధికారులు బాధ్యత తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పిచ్చుకలంకలో రైతులతో నిర్వహించిన ముఖాము ఖిలో ఆయన మాట్లాడారు. గోదావరి డెల్టాకు దేశానికే అన్నపూర్ణ అనే ఖ్యాతి రావడానికి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టే కారణమని, అనంతరం ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన కొత్త బ్యారేజీతో మరో పంటకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడిందని గుర్తుచేశారు. 2.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 32.2 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునే సామర్థ్యంతో పాటు ఈస్ట్రన్, సెంట్రల్, వెస్ట్రన్ డెల్టాల్లో కలిపి 10.13 లక్షల ఎకరా లకు సాగునీరు అందేలా బ్యారేజీ ఉపయోగపడుతోందన్నారు. అయితే 50 ఏళ్లకు పైగా గేట్లు, మోటార్లు, విద్యుత్ వ్యవస్థలు పాతబడటంతో వాటి ఆధునికీకరణ అత్యవసరమైందని చెప్పారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ.32 కోట్లతో కొత్త గేట్లను అమర్చిందని, ఇప్పుడు మిగిలిన పాత గేట్ల స్థానంలో 117 కొత్త గేట్లను తొమ్మిది నెలల్లో అమర్చేలా చర్యలు ప్రారంభించామని తెలిపారు. గత పాలకులు ఇరిగేషన్ ప్రాజెక్టులను కనీస నిర్వహణ కూడా చేపట్టలేదని విమర్శించారు. గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని.. కనీసం గ్రీజ్ పెట్టేందుకు అవసరమైన నిధుల ను కూడా గత పాలకులు ఇవ్వలేదని గుర్తుచేశారు. తుంగభద్ర ప్రాజెక్టుకు మొత్తంగా కొత్త గేట్లను బిగించామని వివరించారు. తాము గత రెండేళ్లలోనే సాగునీటి రంగానికి రూ.24 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు.
పోలవరం నిర్వాసితులను ఆనందంగా ఉంచుతాం
ఒకప్పుడు కోనసీమలో వరికి మద్దతు ధర లేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి నెలకొంటే.. ఇప్పుడు రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు విక్రయించిన 24 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిం దని విమర్శించారు. 2014-19 మధ్య 72 శాతం పనులు పూర్తి చేయగా, ఆ తర్వాత ఐదేళ్లలో కేవలం 2 శాతం పనులు మాత్రమే జరిగాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు వేగవంతమై ప్రస్తుతం 89 శాతం పురోగతి సాధించామని తెలిపారు. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని, పునరావాసం, పరిహారం విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. వారిని ఆనందంగా ఉంచుతామని.. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ప్రకటించిన క్యాలెండర్కు అనుగుణంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు చేపడుతోందని చెప్పారు. పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాలకు నీటి సమస్య శాశ్వతంగా తీరుతుందని, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా, రాయలసీమకు తరలించి అక్కడి వ్యవసాయ రూపురేఖలనే మార్చామని వివరిం చారు. మైక్రో ఇరిగేషన్ విస్తరించడంతో ఉద్యాన పంటలు అభివృ ద్ధి చెందాయని, పరిశ్రమలకు నీటి సరఫరా సాధ్యమై కియా వంటి భారీ పరిశ్రమలు రాయలసీమకు వచ్చాయని పేర్కొన్నారు.
గోదావరి జిల్లాల ప్రజల అభిమానం తరగనిది
గోదావరి ప్రజలు అభివృద్ధిని ఆదరించే స్వభావం కలవారని, గతంలోనూ టీడీపీకి అపూర్వ ఆదరణ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో కూటమికి ఇచ్చిన భారీ విజయా న్ని రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సహకారం, భగవంతుడి ఆశీస్సులతో ఆర్థిక సవాళ్లను అధిగమించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవం గా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పుష్కర ఘాట్ల అభివృద్ధితో పాటు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.1,200 కోట్లతో మౌలికవసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. పిచ్చుకలంక, బొబ్బర్లంక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని, కోనసీమకు రైల్వేలైన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. కోవ్వూరులో కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఆక్వా రైతుల కు యూనిట్కు రూ.1.50కే విద్యుత్ అందిస్తున్నామని, మెట్ట ప్రాంతాల్లో పామాయిల్, కోకో సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని చెప్పారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో శాస్త్రీయ విధానాలు అనుసరించాలని సూచించారు.
అభివృద్ధి-సంక్షేమమే కూటమి లక్ష్యం
రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని స్పష్టం చేశారు. ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు జమ చేస్తామని, సామాజిక భద్రత పెన్ష న్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, రౌడీయిజంపై రాజీపడబో మని హెచ్చరించారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. గంజాయిని ప్రోత్సహించే వారిపైనా, మహిళ లను కించపరిచే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రౌడీలతో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను మించి గొడ్డలి పార్టీతోనే సమస్యలు సృష్టిస్తోందని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కుటుంబసభ్యులపై అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని… ఆడవాళ్లని అసభ్యంగా మాట్లాడే వారిని గొడ్డలి పార్టీ సమర్థిస్తోం దని విమర్శించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ గొడ్డలి పార్టీ నేతలు ఫైనాన్స్ చేస్తున్నారు.. స్టూడియోలు పెట్టిస్తున్నా రని పేర్కొన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను గొడ్డలి పార్టీ సపోర్ట్ చేస్తోందని… వారికి డబ్బులిచ్చి ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వీళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, పొంగూరు నారాయణ, వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.













