- ఈ నెల 6 నుంచి 11 వరకు వివిధ నగరాల్లో కార్యక్రమాలు
- పాల్గొంటున్న టీడీ జనార్థన్, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి, బోడే ప్రసాద్, తదితరులు
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని ముఖ్య నగరాలలో జరిగే 75 సంవత్సరాల ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం, సీబీఎన్ 75వ జన్మదిన వేడుకల సంయుక్త కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు టీడీ జనార్ధన్, ప్రత్యేక అతిధి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ పయనమై వెళ్లారు. ఎన్నారై టీడీపీ, తెలుగు సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో మొదటిది జూన్ 6న న్యూజిలాండ్ రాజధాని అక్లాండ్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం శాసనసభ్యులు బోడే ప్రసాద్, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ వైస్ చైర్మన్ అశ్విన్ అట్లూరి కూడా పాల్గొంటున్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు జూమ్ ద్వారా పాల్గొంటారు.
జూన్ 7న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిధి టీడీ జనార్ధన్తోపాటు నందమూరి రామకృష్ణ, అశ్విన్ అట్లూరి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, బోడే ప్రసాద్, పాల్గొంటున్నారు. జూమ్ ద్వారా రఘురామ కృష్ణరాజు తమ సందేశాన్ని వినిపిస్తారు.
జూన్ 8న అడిలైడ్ నగరంలో జరిగే 75 సంవత్సరాల ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం, సీబీఎన్ 75వ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిధులుగా టీడీ జనార్ధన్, నందమూరి రామకృష్ణ, బోడే ప్రసాద్, సినీ నటుడు నారా రోహిత్, అశ్విన్ అట్లూరి, టీటీడీపీ సీనియర్ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి పాల్గొంటారు.
జూన్ 9న సిడ్నీ నగరంలో జరిగే కార్యక్రమంలో టీడీ జనార్ధన్, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, బోడే ప్రసాద్, అశ్విన్ అట్లూరితోపాటు నారా రోహిత్, నర్సిరెడ్డి పాల్గొంటారు.
జూన్ 11న బ్రిస్బేన్ నగరంలో జరిగే మినీమహానాడు,ఎన్టీఆర్ సినీవజ్రోత్సవ కార్యక్రమాల్లో టీడీ జనార్ధన్, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, బోడె ప్రసాద్, నారా రోహిత్, అశ్విన్ అట్లూరి, నన్నూరి నర్సిరెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న తెలుగు సంఘాల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.