- తక్కువ ధరకు పల్ప్ ఫ్యాక్టరీల కొనుగోలు
- అదనపు ధర చెల్లిస్తూ ఆదుకుంటున్న ప్రభుత్వం
- ధరలపై దుష్ప్రచారంతో వైసీపీ రాద్ధాంతం
- పొదిలి తరహాలో అల్లర్లకే చిత్తూరు జిల్లాకు జగన్
- ఏపీఎస్ఏఎం వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం
అమరావతి (చైతన్యరథం): వైసీపీ నేతలు, వారి సానూభూతిపరుల యాజమాన్యంలోని పల్ప్ ఫ్యాక్టరీలు సిండికేట్గా ఏర్పడి మామిడి రైతులను ఇబ్బంది పెడుతుంటే, పరిస్థితిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చరల్ మిషన్ (ఏపీఎస్ఏఎం) వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత జగన్రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నప్పటికీ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అబద్ధాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడంతో రాష్ట్రం పూర్తిగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడిరదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులను రాజులుగా చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి సంకల్పంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. గత నాలుగైదు నెలల్లో, పంటల సేకరణ తర్వాత ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు. రైతులు పండిరచిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మిర్చి, కోకో, పొగాకు, మామిడి రైతులకు ధరల సమస్యలు ఎదురైనప్పుడు మార్కెట్ జోక్యం ద్వారా ప్రభుత్వం అదనపు ధర చెల్లించిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుందని ఆయన వివరించారు. వాతావరణం అనుకూలించకపోవడం, దిగుబడులు తగ్గడం, మార్కెట్ ధరలు సరిగా లేకపోవడం వంటి సమస్యల నుండి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ నేతల వల్లే..
రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వైసీపీ నాయకులు.. స్థానిక ఫ్యాక్టరీలతో ఉన్న సంబంధాలను ఉపయోగించి మామిడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది మామిడి ఉత్పత్తి 6.5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. గత ఏడాది 2.5 లక్షల టన్నులతో పోలిస్తే దిగుబడి గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ నాయకులతో సంబంధం ఉన్న పీఎల్ఆర్ ఫుడ్స్, సీజీఆర్ ఫుడ్స్, టాసా, సన్నిధి వంటి కంపెనీలు రైతుల నుండి కిలో రూ.3కే మామిడిని కొనుగోలు చేస్తున్నాయని, ఇది ప్రభుత్వం నిర్దేశించిన కిలో రూ.8 ధరకు చాలా తక్కువ అని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పీఎల్ఆర్ ఫుడ్స్లో డైరెక్టర్లుగా ఉన్న పెద్దిరెడ్డి ఇందిర, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఇద్దరూ వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులేనన్నారు. వైసీపీ నాయకుడు ప్రకాష్ రెడ్డికి చెందిన సీజీఆర్ ఫుడ్స్ కూడా రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. వైసీపీ నాయకులు సిండికేట్గా ఏర్పడి, మామిడి రైతుల కష్టాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తూ, కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రచారం చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది 1.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పల్ప్ ఎగుమతులు లేక మిగిలిపోవడం వల్ల మార్కెట్ ధరలు తగ్గాయని, అయినప్పటికీ ప్రభుత్వం కిలోకు రూ.8గా ధర నిర్ధారించి, దానికి అదనంగా రూ.4 చెల్లిస్తూ, మొత్తంగా కిలోకు రూ.12 చొప్పున రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుందని ఆయన వివరించారు. వైసీపీ నాయకులు కర్ణాటకలో మామిడి కిలో రూ.16కు కొనుగోలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి కర్ణాటకలో మండీల వద్ద కిలో రూ.2, ఫ్యాక్టరీల వద్ద రూ.4కే కొనుగోలు చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రభుత్వం కిలో రూ.8 కొనుగోలు ధరను నిర్ధారించి, అదనంగా రూ.4 చెల్లిస్తోందని ఆయన తెలిపారు.
రైతులకు అండగా కూటమి ప్రభుత్వం
మామిడి రైతుల నష్టాలను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మామిడి పల్ప్పై 12% జీఎస్టీని పూర్తిగా తొలగించాలని, పండ్ల రసాల ఆధారిత జ్యూస్లపై జీఎస్టీని 12% నుండి 5%కు తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకురాకపోవడంతో రైతులు నష్టపోయారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని ఆయన వివరించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మద్దతు ధర లేకపోవడం, సబ్సిడీలు అందకపోవడం వల్ల వేలాది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆయన గుర్తు చేశారు.
వైసీపీ దిగజారుడుతనం
ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలను పీడిరచిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు సిగ్గు, శరం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ మామిడి రైతుల కోసం చిత్తూరు జిల్లాకు వెళ్తాననడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రైతుల పేరుతో రాజకీయం చేసి, గతంలో పొదిలిలో జరిగిన సంఘటనలను పునరావృతం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో, వైసీపీ నాయకులు రైతులను మభ్యపెట్టి, కూటమి ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన తీవ్రంగా ఖండిరచారు. గత వైసీపీ పాలనలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మామిడి రైతులకు సబ్సిడీలు, మద్దతు ధర, మార్కెట్ జోక్యం ద్వారా అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నాయకులు సిండికేట్గా ఏర్పడి రైతులకు అన్యాయం చేస్తున్నారని, ఈ పరిస్థితిని ప్రజలు గమనించి నిజాలను అర్థం చేసుకోవాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.