అమరావతి (చైతన్యరథం): నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్ పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించడం పట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు గ్రేడిరగ్ కోసం కూలీలు ఆటోలో వెళ్తుండగా కారు ఢీకొని మృతిచెందడం అత్యంత బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మంత్రుల సంతాపం
పొగాకు గ్రేడిరగ్ కోసం వెళ్తున్న కూలీలు మృతుచెందడంపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రావాణా శాఖ అధికారులను ఆదేశించారు.