- పరామర్శ పేరుతో ఇద్దరి ప్రాణాలు తీశారు
- ఆయన రాజకీయాలకు అనర్హుడు
- ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర
- క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు
విజయవాడ(చైతన్యరథం): రాజకీయ లబ్ధి కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు.. పరామర్శ కోసం వెళ్లి ఇద్ద రి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు జగన్రెడ్డి అని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. నగరంలోని తన క్యాంపు కార్యాల యంలో శుక్రవారం మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా భారీఎత్తున వేడుకలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఏడాది పాలనలో సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళుతున్నామని వివరించారు. తల్లికి వందనం పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేశాం. త్వరలోనే అన్నదాత సుఖీభవ, ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతు న్నాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా పోలవరం, అమరావతి, బనకచర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఏడాది క్రితం బెట్టింగ్ మాఫియా వేధింపుల కార ణంగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరామర్శ పేరుతో ఇప్పుడు అరాచకం సృష్టిస్తున్నాడు. పోలీసుల ఆంక్షలు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రశాంతంగా బతికే పరిస్థితి లేకుండా చేసినందుకే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుం టే ప్రజలు నవ్వుకుంటున్నారు. సినిమాల్లో చంపారని సమాజంలో కూడా అలానే చేయాలని కార్యకర్తలకు చెప్పడం ఫ్యాక్షన్ మనస్త త్వానికి నిదర్శనమన్నారు. ఇలాంటి క్రూరమైన వ్యక్తులకు రాజకీ య క్షేత్రంలో ఉండే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.