అన్నదానము గొప్పదనవచ్చనేకాని
అన్నంబు జాములో అరిగిపోవు
వస్త్రదానం కూడ భవ్యదానమేకాని
వస్త్రమేడాదిలో పాతదగును
గృహదానమొకటి ఉత్కృష్టదానమేకాని
కొంప కొన్నేళ్లలో కూలిపోవు
భూమిదానము మహా పుణ్యదానమేకాని
భూమి అన్యుల చేజారిపోవచ్చు
అరిగిపోక… ఇంచుకయేని చిరగిపోక
కూలిపోక.. అన్యులపాలుకాక
నిత్యమై, వినిర్మలమై, నిశ్చలమై
యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి. – చిలకమర్తి లక్ష్మీనరసింహం
గొప్పకవి అయిన చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు ఆకాంక్షను తెలుగు నేలపై సాకారం చేస్తున్నది చంద్రన్నే. ఆ స్ఫూర్తిని ఉన్నతోన్నతం చేస్తున్నది నారా లోకేష్. -నాడు చంద్రన్న కిలో మీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్లకు ఒక మాధ్యమిక పాఠశాల, ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల, ప్రతి మండలంలో ఒక ఇంటర్ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ స్థాపించి విద్యా విప్లవాన్ని సామాన్యులకు చేర్చారు. ఉన్నతమైన ప్రొఫెషనల్ కాలేజీలు ఎన్నో స్థాపించారు. అంబేద్కర్ విదేశీ విద్య ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెసిడెన్షియల్ విద్యా సంస్థల్ని విస్తృతపర్చారు. నేడు ప్రతి నలుగురు ఎన్ఆర్ఐలలో ఒకరు తెలుగు వారు ఉన్నారంటే కారణం చంద్రన్నే. నేడు విద్యాశాఖమాత్యులు విద్యా సంస్కరణలతో మహా విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఎందరు పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం మరో గేమ్ఛేంజర్ కాబోతోంది. తెలుగు నేల నాలెడ్జ్ సొసైటీగా విలసిల్లాలన్న చంద్రన్న కలల్ని యువనేత లోకేష్ పరిపూర్ణం చేస్తున్నారు.
-గురజాల మాల్యాద్రి
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్.