చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రైతుల గొంతు కోసిన కసాయి జగన్మోసపు రెడ్డి: దేవినేని

ఇరిగేషన్‌కు జగన్‌ ఖర్చుపెట్టానంటున్న రూ.32 వేల కోట్ల లెక్కలు ప్రజలు ముందు ఉంచగలరా?

by చైతన్యరధం
Nov 16, 2023 at 11:11am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రైతుల గొంతు కోసిన కసాయి జగన్మోసపు రెడ్డి: దేవినేని
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • చంద్రబాబుకి పేరొస్తుందన్న దుగ్ధతో  సాగునీటి ప్రాజెక్టుల్ని ఆపేశాడు
  • కరువు విలయతాండవం చేస్తుంటే తాడేపల్లి ప్యాలెస్‌లో తబలా వాయించుకుంటున్న జగన్‌ రెడ్డి
  • ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు
  • చంద్రబాబు ఇరిగేషన్‌ రంగానికి పెట్టిన రూ.68వేల కోట్ల లెక్కలన్నీ చెప్పడానికి మేము సిద్ధం
  • ఇరిగేషన్‌కు జగన్‌ ఖర్చుపెట్టానంటున్న రూ.32 వేల కోట్ల లెక్కలు ప్రజలు ముందు ఉంచగలరా?
  • డీబీటీ స్కీమ్‌ పై జగన్‌ రెడ్డి..వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయగలడా?

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చేతకానితనంతో రాష్ట్రంలో సాగునీటి, వ్యవసాయ రంగాల్ని సర్వనాశనం చేసి, రైతుల గొంతు కోశారని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పల్నాడు జిల్లాలో వరికెపూడిశెల ఎత్తిపోతల పథకానికి చంద్రబాబునాయుడి హయాంలోనే పాలనాపరమైన అనుమతులిచ్చి, టెండర్లు పిలిచి, నిర్మాణ పనులకోసం ఏజెన్సీ ని కూడా నియమించారని, ఆ తరువాత 19 హెక్టార్ల అటవీ భూమికి క్లియరెన్సులు పొంది, పథకం శంకుస్థాపన చేసేందుకు జగన్‌ రెడ్డికి 53 నెలల సమయం పట్టిందని ధ్వజమెత్తారు. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో ముఖ్యమంత్రి ఇప్పుడు మురిగిపోయిన టెంకాయలు కొడుతూ, ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2019 డిసెంబర్లో ఉమ్మడి కడపజిల్లా జమ్మలమడుగులో ఉక్కుపరిశ్రమకు శంకుస్థాపన చేస్తూ జగన్‌ రెడ్డి ఏం మాట్లాడాడో..ఇప్పుడేం మాట్లాడుతున్నాడో ప్రజలు తెలుసుకోవాలన్నారు. (నాడు జగన్‌ రెడ్డి మాట్లాడిన వీడియోను దేవినేని విలేకరులకు చూపించారు) ఆ వీడియాలో జగన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయలు కొడితే దాన్ని మోసమంటారు.. అదే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు. అదీ పాలనలో తేడా.. ఇలా చెప్పిన జగన్‌ రెడ్డి ఇప్పుడు మూడు నెలల ముందు టెంకాయలు ఎందుకు కొడుతున్నాడో, ఎవర్ని మోసగించడానికి కొడుతున్నాడో చెప్పాలి. నాలుగున్నరేళ్లపాటు ఏమీ చేయకుండా.. ఆఖరి రోజుల్లో టెంకాయలు కొట్టడాన్ని మోసం అంటారన్న జగన్‌ రెడ్డి ..ఇప్పుడు తాను చెప్పే దేవుడి స్క్రిప్ట్‌ ద్వారా తన మాటల్ని దేవుడు తనకే తగిలేలా చేశాడని తెలుసుకోవాలని దేవినేని చురకలు వేశారు.

ఎవరు నమ్ముతారు జగన్‌ రెడ్డి?
జగన్‌ రెడ్డి తనకు చిత్తశుద్ది ఉందని చెప్పుకోవడం ముమ్మాటికీ తన అసమర్థత.. మోసకారి తనాన్ని కప్పిపుచ్చుకోవడమే. చంద్రబాబునాయుడు వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు టెండర్లు పిలిచాడన్న అక్కసుతో జగన్‌ రెడ్డి ఆ టెండర్లు రద్దుచేసి, ఆనాడు ఇచ్చిన పనులను రద్దుచేశాడు. ఇదేనా జగన్‌ రెడ్డి చిత్తశుద్ది. నవంబర్‌ 15న టెంకాయ కొట్టాడు. నాలుగైదు నెలల్లో తనపని.. తన ప్రభుత్వం పని అయిపోతోంది. వరికపూడిశెల పథకం ఎలా 6 నెలల్లో పూర్తిచేస్తాడో జగన్‌ రెడ్డి సమాధానం చెప్పాలి. జగన్‌రెడ్డి చెప్పే గాలి మాటలు ఎవరు నమ్ముతారు? గతంలోనే చంద్రబాబునాయుడు కేవలం రూ.298 కోట్లతో నిర్మాణ సంస్థను నియమిస్తే.. ఈనాడు జగన్‌ రెడ్డి పెద్ద ఘనత సాధించినట్టు రూ.308 కోట్లకు అనుమతులు తెచ్చానని, పల్నాడు ప్రాంతాన్ని ఉద్ధరిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. చంద్రబాబు నాయుడు అనుమతించిన ఏజెన్సీతో అధికారంలోకి రాగానే జగన్‌ రెడ్డి పనులు చేయించిఉంటే, కేవలం రెండున్నరేళ్లలోనే వరికపూడిశెల ప్రాజెక్ట్‌ పూర్తై.. పల్నాడు ప్రాంతానికి నీళ్లు వచ్చేవి. మాచర్ల, గురజాల, వినుకొండ నియోజక వర్గాలు సస్యశ్యామలమయ్యేవి. కేవలం చంద్రబాబుకి పేరు వస్తుందన్న దుగ్ధతోనే జగన్‌ రెడ్డి మాచర్లలో టీడీపీ ప్రభుత్వం నిర్మించాలనుకున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని గాల్లో పెట్టేశాడు. పల్నాడు కరువు నివారణ పథకానికి సంబంధించిన డీపీఆర్‌ ల కోసం జగన్‌ ప్రభుత్వం.. రూ.3.5 కోట్లు చెల్లించకపోవడంతో ఏజెన్సీ పనులు ఆపేసిందని దేవినేని తెలిపారు.

సంబంధితవార్తలు

ఈవీఎంలపై జగన్‌రెడ్డి యు టర్న్‌

అది భూములు భక్షించే చట్టం

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తా

ముక్త్యాల ఎత్తిపోతల పథకాన్ని ముంచేసి, ప్రజలచెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టాడు

పెళ్లిరోజు అనేది అందరికీ ఎంతో పవిత్రమైనది.. సంతోషకరమైనది. అలాంటి పెళ్లిరోజున జగన్‌ రెడ్డి గతంలో చంద్రబాబునాయుడు ప్రారంభించిన ముక్త్యాల ఎత్తిపోతల పథకానికి తన తండ్రి పేరు పెట్టుకొని పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు. వైఎస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తానని చెప్పి చివరకు పనులు చేసిన కాంట్రాక్ట్‌ సంస్థకు రూపాయి చెల్లించకుండా మొత్తం ప్రాజెక్ట్‌ ఆగిపోయేట్టు చేశాడు. నిర్మాణ సామగ్రిని.. నీటి పైపుల్ని.. ఇతర పరికరాల్ని వైసీపీ దొంగలు ఎత్తుకెళ్లే దుస్థితి కల్పించాడు. అదీ జగన్‌ రెడ్డి చిత్తశుద్ధి. జగన్మోసపు రెడ్డి.. ఎంత మోసకారో.. ఎంత దోపిడీదారో..ఎంతగా ప్రజల్ని వంచిస్తాడో ప్రజలకు అర్థమైంది. (తన పెళ్లినాడు జగన్మోహన్‌ రెడ్డి రైతులకు చెప్పిన మోసపు మాటల్ని వీడియో ద్వారా దేవినేని ఉమా విలేకరులకు చూపించారు) ఫిబ్రవరి, 2021 నాటికి ముక్త్యాల ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌ పూర్తిచేస్తానని చెప్పావు కదా.. జగన్‌ రెడ్డి.. ఏమైంది ఆ ప్రాజెక్ట్‌? 2023, డిసెంబర్‌ వస్తున్నా నేటికీ ఎందుకు పూర్తిచేయ లేదో చెప్పాలి. ఆ పథకం పూర్తైతే ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి ప్రాంత రైతాంగానికి ఎంతో మేలు జరిగి ఉండేది. ముక్త్యాల ఎత్తి పోతల పథకానికి రూ.489కోట్లతో చంద్రబాబునాయుడి హయాంలోనే పాలనా పరమైన అనుమతులు ఇచ్చారు. నిర్మాణ సంస్థ (ఏజెన్సీ) ని నిర్ధారించి , కేవలం 12నెలల్లోనే పనులు పూర్తిచేయాలని కూడా చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో పనులు ప్రారంభమైతే.. ఏజెన్సీని వెళ్లగొట్టిన జగన్‌ రెడ్డి 14 నెలలు డ్రామాలు నడిపించి, చివరకు తన పెళ్లిరోజున కొత్తగా మరలా శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టి నాడు జనం చెవుల్లో ఏకంగా క్యాలీఫ్లవర్లే పెట్టాడు. చివరకు ముక్త్యాల ఎత్తిపోతల పథకం మొత్తం ఎత్తిపోయేలా చేసిన ఈ జగన్మోసపు రెడ్డి.. ఇప్పుడు పల్నాడు రైతాంగాన్ని..అక్కడి ప్రజల్ని ఉద్ధరిస్తానని ఎన్నికల ముందు కలరింగ్‌ ఇస్తున్నాడు. కేవలం పల్నాడు వాసుల్ని మోసగించడానికి.. అక్కడి వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిని కప్పిపుచ్చడానికే నేడు జగన్‌ రెడ్డి మాచర్ల సాక్షిగా ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పాడని దేవినేని దుయ్యబట్టారు.

రాష్ట్రప్రయోజనాల్ని .. పోలవరాన్నే తాకట్టు పెట్టేశాడు
ముఖ్యమంత్రి అయింది మొదలు నేటివరకు జగన్‌ రెడ్డి రాష్ట్రంలోని ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ పూర్తి చేసి, ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్లిచ్చాడా? పోలవరం హెడ్‌వర్క్స్‌ కు ఏకంగా సంవత్సరం పాటు హాలిడే ప్రకటించాడు. వంశధార-నాగావళి-గోదావరి అనుసంధాన పనులకు తిలోదకాలిచ్చాడు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి మంగళం పాడాడు. ఇదీ జగన్‌ రెడ్డి రివర్స్‌ టెండరింగ్‌ తో సాధించిన రివర్స్‌ పాలన. 31 మంది ఎంపీలను చేతిలో పెట్టుకొని కూడా పోలవరం డీపీఆర్‌-2ను కేంద్ర ప్రభుత్వంతో ఆమోదింపచేయించు కోలేని అసమర్థుడు జగన్‌ రెడ్డి. బాబాయ్‌ హత్యకేసు నుంచి తనను..తన తమ్ముడు అవినాశ్‌ రెడ్డిని కాపాడుకోవడానికి ఏకంగా జగన్‌ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ ను తాకట్టు పెట్టేశాడు. రాష్ట్రవిభజన చట్టంలోని షెడ్యూల్‌ -9, 10 ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు, ప్రత్యేకహోదా.. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు… రైల్వేజోన్‌.. ఉక్కుపరిశ్రమ సహా అన్నీ వదులుకుని ఇప్పుడు తగుదనమ్మా అంటూ మరలా ప్రజల్ని కొత్తవిద్యలతో మోసగిస్తున్నాడని దేవినేని విమర్శించారు.

చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి

ప్రాజెక్టులు కట్టడమంటే, తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీ ఆడుకోవడం.. క్రికెట్‌ మ్యాచులు చూడటం..చంద్రబాబు ప్రజల్లోకి వస్తే టీవీలు పగలగొట్టడం కాదు. నీటిపారుదల రంగాన్ని ఎలా నిలబెట్టాలో.. రైతుల పొలాల్లో నీళ్లు ఎలా పారించాలో చంద్రబాబుని చూసి నేర్చుకో. నీ నియోజకవర్గానికి కూడా కృష్ణా నీళ్లు అందించిన భగీరథుడు చంద్రబాబు. అదీ పరిపాలనంటే. టీడీపీ ప్రభుత్వం.. 350 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి.. అక్కడినుంచి ఆ నీటిని తెలుగుగంగ, గాలేరు-నగరిద్వారా, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల ద్వారా చిత్తూరు జిల్లా మదనపల్లి, పలమనేరు, కుప్పం వరకు తరలించింది. అలాంటి గొప్ప ప్రాజెక్టులు పనిచేయకుండా చేసిన సైంధవుడు జగన్‌ రెడ్డి. సొంతజిల్లాకు.. సొంత నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేని జగన్‌ రెడ్డి.. పల్నాడు ప్రాంతాన్ని ఉద్ధరిస్తానని చెబుతుంటే, అక్కడి ప్రజలు నవ్వుకుంటున్నారు. 5ఏళ్లలో సాగునీటి రంగానికి రూ.68 వేలకోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు ఎక్కడ.. నాలుగేళ్లలో రూ.32వేల కోట్లు తన బినామీలకు..తనకు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు, విజయసాయి బినామీ కంపెనీలకు, పెద్దిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి కంపెనీలకు దోచిపెట్టి సాగునీట ిరంగాన్ని పడుకోబెట్టిన జగన్‌ రెడ్డి ఎక్కడ? రాష్ట్ర రైతాంగం గొంతుకోసిన కసాయి జగన్‌ రెడ్డి. నీటి నిర్వహణ అంటే ఏమిటో తెలియని అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి. జగన్‌ రెడ్డి చేతగానితనం తో రైతుల కళ్లల్లో నీళ్లకు బదులు రక్తం వస్తోందని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరువు విలయతాండవం చేస్తుంటే జగన్‌ రెడ్డి తాడేపల్లిలో తబలా వాయించుకుంటున్నాడు
అధికారంలోకి వచ్చాక పోలవరం సహా అనేక ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి అంటే తేదీలు మార్చడం తప్ప.. జగన్‌ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రులు చేసింది శూన్యం. ఇరిగేషన్‌ మంత్రి ఇరిటేషన్‌ మంత్రిగా మారాడు. పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌, చంద్రబాబుని తిట్టడం తప్ప.. అతనికి సాగునీరు విలువ ఏమిటో తెలియదు. వ్యవసాయశాఖమంత్రి కాకాణి, ఎలుకలు తిన్న కోర్టు ఫైల్స్‌ చుట్టూ తిరుగుతూ, టీడీపీ నేతలపై పడి ఏడుస్తున్నాడు. రాష్ట్రంలో 440 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తుంటే, జగన్‌ రెడ్డి తాడేపల్లిలో తబలా వాయించుకుంటున్నాడు. పబ్జీ ఆడుకుంటూ.. ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అనంతపురం రైతుల ఆవేదన..కర్నూలు రైతుల కడుపుమంట..కడప రైతుల కష్టం ఏదీ జగన్‌ రెడ్డికి కనిపించడం లేదు. బీటెక్‌ రవిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్‌ చేయించడం మాత్రం జగన్‌ కు బాగా గుర్తుంటుంది. జగన్‌ రెడ్డికి ఊడిగం చేస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఐపీఎస్‌ అధికారులు రఘురామి రెడ్డి, పీ.ఎస్‌.ఆర్‌ ఆంజనేయులు ఖాకీ యూనిఫామ్‌ తీసేసి వైసీపీ కండువాలు వేసుకోవాలి. చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డికి సిగ్గుందా? దొంగబంగారం కేసులో ఉన్న ధనుంజయరెడ్డి, అతని బంధువులపై కేసులు పెట్టలేని రాజేంద్రనాథ్‌ రెడ్డి.. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టాడు. రింగ్‌ లేదు..రోడ్డు లేదు..దాని పై చంద్రబాబుమీద కేసు పెడతారా? ఇసుకను ఉచితంగా ఇచ్చాడని కేసు పెడతారా? ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ లో తప్పు జరిగిందని అక్రమ కేసు పెడతారా? కేసులు పెట్టడం.. కాసులు కొట్టేయడం తప్ప జగన్‌ రెడ్డికి, అతని మోచేతి నీళ్లు తాగే మీకు పరిపాలన.. ప్రజాస్వామ్యరక్షణ ఏం తెలుస్తుంది? జగన్‌ రెడ్డి గొప్పులు చెబుతున్న డీబీటీ స్కీమ్‌ లోని గుట్టుమట్లు బయటకు వస్తే బుగ్గన.. ఆర్థికశాఖ అధికారులు జైలుకెళ్లడం ఖాయం. డీబీటీ స్కీమ్‌ తాలూకా పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం జగన్‌ రెడ్డికి.. చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డికి ఉన్నాయా? ఇరిగేషన్‌ రంగానికి చంద్రబాబునాయుడు ఖర్చుపెట్టిన .68 వేలకోట్లకు లెక్కలు చెప్తాను.. తాను ప్రజలకు ఇచ్చానంటున్న లక్షల కోట్ల సొమ్ము లెక్కలు..ఇరిగేషన్‌ రంగానికి ఖర్చుపెట్టానంటున్న రూ.32వేలకోట్ల లెక్కలు జగన్‌ రెడ్డి ప్రజల ముందు ఉంచగలడా అని దేవినేని ఉమ నిలదీశారు.

Tags: ఉక్కుపరిశ్రమకు శంకుస్థాపనకరువు విలయతాండవంజగన్ రెడ్డితాడేపల్లి ప్యాలెస్దేవుడి స్క్రిప్ట్‌వరికెపూడిశెల ఎత్తిపోతలసాగునీటి ప్రాజెక్టులు
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 16-11-2023

Next Post

చంద్రబాబు ఆరోగ్య సమాచారంపై హైకోర్టుకు నివేదిక

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-05-2025

కార్యకర్త
@ May 25, 2025
ఆంధ్రప్రదేశ్

విసిరికొట్టినా.. అదే వంచన!

చైతన్యరధం
@ May 25, 2025
విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి
ఆంధ్రప్రదేశ్

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు
ఆంధ్రప్రదేశ్

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!
ఆంధ్రప్రదేశ్

చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!

చైతన్యరధం
@ May 25, 2025
ఆంధ్రప్రదేశ్

పొగాకు పంట చివరి ఆకు వరకూ కొంటాం

చైతన్యరధం
@ May 25, 2025
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

చైతన్యరధం
@ May 25, 2025
చైతన్యరధం ఈ పేపర్ 24-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-05-2025

కార్యకర్త
@ May 24, 2025
Load More

ముఖ్య వార్తలు

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

చైతన్యరధం
@ May 22, 2025
ప్రపంచానికి వరం మన యోగా

ప్రపంచానికి వరం మన యోగా

చైతన్యరధం
@ May 22, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విసిరికొట్టినా.. అదే వంచన!

చైతన్యరధం
@ May 25, 2025
విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!

చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!

చైతన్యరధం
@ May 25, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist