- వాడరేవు`పిడుగురాళ్ల హైవే వేగవంతం
- ఆంధ్ర, తెలంగాణ మధ్య అనుసంధానం
- హైదరాబాద్కు కనెక్టివిటీతో రవాణా సులువు
- బాపట్ల జిల్లాలో కొనసాగుతున్న పనులు
- పర్యాటక, వాణిజ్య రంగాలకు అవకాశాలు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారుల పనులు వేగవం తం అయ్యాయి. జాతీయ రహదారుల నిర్మాణాలతో పలు జిల్లాలో రూపురేఖలు మారను న్నాయి. ఇందులో భాగంగా కోస్తాలో కీలకమైన వాడరేవు- పిడుగురాళ్ల 167ఏ జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బాపట్ల జిల్లా పర్చూరు మండల పరి ధిలో ఈ పనులు జరుగుతున్నాయి. పర్చూరును అనుసంధానం చేస్తూ కారంచేడు మీదు గా వాడరేవు వరకు రోడ్డు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ హైవే నిర్మాణంతో పాటు కల్వర్టులు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల పనులు చేపట్టారు. దాంతో జాతీయ రహదారి నిర్మా ణాలకు సమీపంలో ఉన్న గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. వాడరేవు – పిడుగు రాళ్ల జాతీయ రహదారి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేస్తోంది. ఈ మేరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. హైదరాబాద్ నుంచి వాడరేవు రవాణాకు ఉప యోగకరంగా ఉంటుంది. ఈ మేరకు మోటుపల్లి, పెద్దగంజాం ప్రాంతానికి ఏడు కిలో మీటర్ల దూరంలోనే రైల్వే ట్రాక్ కూడా ఉండటం కలిసొస్తుందని అంటున్నారు. ఈ హైవే నిర్మాణంతో తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా మరింత సులువు అవుతుంది. చీరాల ప్రాంతంలో వాడరేవు ఉండటంతో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందే అవ కాశం ఉంటుంది. వాణిజ్య, వ్యాపారాలు పుంజుకునే అవకాశాలు ఉంటాయి.
అలాగే ఈ హైవే హైదరాబాద్ (అద్దంకి- నార్కెట్పల్లి)కు కూడా కనెక్ట్ అవుతోంది. నేషనల్ హైవే 167-ఏ విస్తరణ ప్రాజెక్ట్ వాడరేవు-పిడుగురాళ్ల మధ్య నాలుగు లైన్లుగా చేపట్టా రు. 85 కిలోమీటర్లకు పైగా ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం రూ.1,064.24 కోట్ల వ్యయం అవుతోందని అంచనా వేశారు. నకరికల్లు దగ్గర అద్దంకి -నార్కెట్పల్లి రోడ్, చీరాల దగ్గర నేషనల్ హైవే 216, చిలకలూరిపేట దగ్గర నేషనల్ హైవే 16కి అనుసంధానం చేస్తున్నారు. వాడరేవు నుంచి ఈపురుపాలెం వరకు 18 కిలోమీటర్లు కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. పర్చూరు, తిమ్మరాజుపాలెం, చిలకలూరిపేట దగ్గర బైపాస్లు ఉంటాయి. ఈ హైవేతో చీరాల నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహంతో పాటుగా బాపట్ల-ఓడరేవు మధ్య బీచ్ టూరిజం అభివృద్ధి చెందనుంది. కోస్తా జిల్లాలకు కనెక్టివిటీ, ట్రాఫిక్ రద్దీ నివారణకు బైపాస్లు, సర్వీస్ రోడ్లు, బ్రిడ్జిలు ఉన్నాయి. మరోవైపు వాడరేవు-పిడుగురాళ్ల హైవేలో కీలకమైన నరసరావుపేట బైపాస్ సర్వే మొదలైంది. భూసేకరణ కూడా నరసరావుపేట బైపాస్ మినహా మిగతా అన్నిచోట్లా పూర్తి కాగా అలైన్మెంట్ మార్చాలని కొందరు రైతులు కోరుతున్నారు. కానీ జాతీయ రహదారి అథారిటీ అధికారులు మాత్రం డీపీఆర్కు అనుగుణంగానే కేసానుపల్లి, జొన్నలగడ్డ, రావిపాడు మీదుగానే బైపాస్ నిర్మించేలా ముందుకెళుతున్నారు. ఈ మేరకు సర్వే పనుల్లో బిజీగా ఉన్నారు.