- కాలం చెల్లిన చట్టాలను మార్చుకుందాం
- సంక్షేమంతోనే అసమానతలు తగ్గుతాయి
- గత ప్రభుత్వంలో హెలిప్యాడ్ కోసం భూమి ఇవ్వలేదని 22(ఎ)లో పెట్టేశారు
- ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉండాల్సిందే
- టెక్నాలజీతో అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలు
- సమష్టి కృషితో లాభాల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్
- మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): ‘ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెల వారీగా సమీక్షించుకోవాలి, క్షేత్రస్థాయిలో పనుల్ని బేరీజు వేసుకోవాలి. ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తున్నాం. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంఛార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో పనులు జరిగేలా చూడాలి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో ఆయన మంత్రులు, కార్యదర్శులకు కర్తవ్య బోధ చేశారు. “గత 19 నెలల్లో ఏపీలో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీ సహా ఏఐ అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతోందో అంచనా వేసుకోవాలి. ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వ ప్రగతి, పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నాం. ఇలా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏ మేరకు చేరుకున్నామన్న దానిపై స్పష్టతతో ఉంటున్నాం. గడిచిన 19 నెలల్లో అగాధం, అంధకారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేశాం. వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్లను తల్లుల ఖాతాల్లో వేశాం. స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మొబిలిటీ పెరిగింది. ఇప్పటిదాకా 4.29 కోట్ల మేర ఉచిత ప్రయాణాలు జరిగాయి. ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ఆక్యుపెన్సీ పెరిగింది. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.6,310 కోట్ల ఆర్థిక సహకారం అందించాం. రాయలసీమలో హార్టి కల్చర్ హబ్, కోస్తాలో ఆక్వా కల్చర్ పెంచేలా చర్యలు చేపట్టాం. రైతు ఆత్మహత్యలనేవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే… వాటిని అధ్యయనం చేసి రైతులను ఆదుకుంటున్నాం. దీపం 2.0 ద్వారా నాలుగు విడతల్లో 3.64 కోట్ల గ్యాస్ సిలిండర్లను ఇప్పటి వరకు ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ.58 వేల కోట్ల మేర ఆర్థిక చేయూత అందించాం. సంక్షేమ పథకాలు అవసరమా…? అనే చర్చ సరికాదు… పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమే” అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
వివాదాలు సృష్టించారు… 22(ఎ)లో పెట్టేశారు
“రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాం. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేసింది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా డ్రైవర్లకు మేలు చేస్తున్నాం. రూ.1,100కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా రైతులను ఆదుకుంటున్నాం. ధాన్యం కొనుగోళ్లకు కూడా రూ.10వేల కోట్ల మేర 48గంటల్లోనే చెల్లింపులు చేశాం. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇస్తున్నాం. తాడేపల్లి ప్యాలెస్ వద్ద హెలిప్యాడ్ కోసం ఓ ప్రైవేటు భూమిని అక్రమంగా 22(ఎ)లో పెట్టేశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఈ తరహాలో అధికారం దుర్వినియోగం చేశారు. ఇది ఒక్క తాడేపల్లిలోనే కాదు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. భూ వివాదాలు లేకుండా… పకడ్బందీగా సర్వే ప్రక్రియ చేపడుతున్నాం. క్యూఆర్ కోడ్ సహా ఇతర భద్రతా ఫీచర్లతో పాస్ పుస్తకాలను అందిస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటివరకు రూ.24 వేల కోట్లు ఖర్చు చేశాం. క్వాంటం వ్యాలీకి ఇటీవలే శంకుస్థాపన చేసి అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా మారుస్తున్నాం. విశాఖలో గూగుల్తో తో పాటు ఇతర సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాయి. మొత్తం 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు రాబోతున్నాయి. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా తయారీకి కూడా కార్యాచరణ మొదలైంది. విద్యుత్ రంగంలో ట్రూ అప్ నుంచి ట్రూడౌన్ చేసే పరిస్థితికి వచ్చాం. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేశాం.
- 5757 మంది కానిస్టేబుళ్ల నియామకం కూడా పూర్తి చేశాం… వారి స్టైఫండ్ రూ.4500 నుంచి రూ.12,500కు పెంచాం. మార్చిలోగా రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
“రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేశాం. మరో రూ.3వేల కోట్లు ఖర్చు చేసి రోడ్లను నిర్మిస్తున్నాం. పల్లె పండుగ ద్వారా రూ.4వేల కోట్లు ఖర్చు పెట్టి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి. చేస్తున్నాం. జీ రామ్ జీ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. - 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి.
- జలజీవన్ మిషన్ పథకాన్ని గతంలో అస్తవ్యస్తం చేశారు. దాన్ని సరిదిద్ది రూ.25వేల కోట్లతో ఇంటింటికీ కుళాయి పథకం ద్వారా సురక్షిత తాగునీరు ఇస్తాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నాం. స్కూల్ కిట్లు పంపిణీ చేశాం.
- ఈసారి 9.88 గ్రోత్ రేట్ సాధించాం. త్వరలోనే డబుల్ డిజిట్ గ్రోత్ సాధించాలి. తలసరి ఆదాయం పెరిగేలా నిర్దిష్టమైన ప్రమాణాలను పెట్టుకున్నాం.
- సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ కేర్ నిర్వహించాలని నిర్ణయించాం. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఆరోగ్య భీమా కల్పిస్తున్నాం.
- పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. రూ.440 కోట్లతో కట్టిన డయాఫ్రమ్వల్ను గత పాలకులు ధ్వంసం చేశారు. ఇప్పుడు దాని నిర్మాణానికి అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు అవుతోంది.
- అమరావతి రాజధానిని శ్మశానం, ఎడారి అన్నారు. వచ్చే మూడేళ్లలో మోస్ట్ లివబుల్ సిటీగా మారుస్తాం.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారం అందించడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పడింది.
- అంతా టీమ్ స్పిరిట్తో పని చేయాలి. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్లాలి.
- పాలనలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అవుట్ డేటెడ్ రావాలి.
- అవసరం లేని చట్టాలను సమీక్షించుకుని ముందుకు వెళ్లాం.
- మెరుగైన ఫలితాలు సాధించడానికి లక్ష్యాలు నిర్దేశించుకుని అంతా కలిసి పనిచేద్దాం.
- 2026-27లో అనుకున్న లక్ష్యాలను సాధించేలా కార్యాచరణ ఉండాలి.












