- రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి
- మామిడి రైతులకు ప్రాసెసింగ్ యూనిట్లు సహకరించాలి
- ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే పల్ప్ యూనిట్లపై కఠిన చర్యలు
- ధాన్యం కొనుగోలు, పంట ఉత్పత్తుల మార్కెటింగ్పై సమీక్షలో సీఎం ఆదేశం
అమరావతి (చైతన్య రథం రైతులకు ప్రయోజనం కలిగించేలా రబీ -ఖరీఫ్ -రబీ పంటలకు సంబంధించిన క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ, ఉద్యానశాఖలను ఆదేశించారు.. దీనికి అనుగుణంగానే పంటల హార్వెస్టింగ్, మార్కెటింగ్ జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ధాన్యం సేకరణ, వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్పై సమీక్ష నిర్వహించారు. వర్చువలుగా మంత్రులు కె అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ సమీక్షకు హజరయ్యారు.
రబీ- ఖరీఫ్ రబీ సీజన్లలో ఎలాంటి వంటలు
వేయాలి… రైతులకు ఏది ప్రయోజనమన్న అంశాలను ॥ రైతుల్లో అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. పంట ఉత్పత్తుల నాణ్యత పెంచటంతోపాటు కోత సమయంలోనూ తగిన సూచనలివ్వాలని అన్నారు. కోల్డ్ చైన్ సహా దేశీయం అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను తరలించటంతోపాటు ప్రాసెసింగ్పై దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు వంట ఉత్పత్తులను తరలించేలా రైల్ కార్గోలాంటి లాజిస్టిక్స్ సౌకర్యాలను కల్పించాలన్నారు. వివిధ జిల్లాల్లో నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎదురవుతున్న బ్యాంకు గ్యారెంటీ సమస్యల్ని పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఈమేరకు సమీక్షనుంచే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కన్వీనర్తో ముఖ్యమంత్రి మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని సీఎం బ్యాంకర్లను ఆదేశించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం మేరకు తక్షణమే చర్యలుండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులనుంచి చేసే కొనుగోలులో మిల్లర్లు ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా చూడాలని సీఎం సూచనలు జారీ చేశారు.
మామిడి రైతులకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగిస్తే చర్యలు
ఆర్థిక కష్టాలున్నా మామిడి రైతులను ఆదుకు నేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.184కోట్లను రాయితీగా చెల్లింపులు చేసిందని… ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా కేజీకి రూ.4 చొప్పున అదనపు ధర చెల్లిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులపట్ల ఉదారంగా ఉండాలని సీఎం కోరారు. రైతులను కాపాడుకోవాలనే మామిడికి అదనంగా రూ.4ధర చెల్లిస్తుంటే కొందరు ఉద్దేశ పూర్వ కంగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా తన దృష్టికి వచ్చిందని… ఇలాంటి చర్యలపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కొందరు వ్యక్తులు, కొన్ని ప్రాసెసింగ్ యూనిట్లవల్ల రైతులకు ఇబ్బందులు రాకూడదని.. ప్రభుత్వానికి చెడ్డ పేరుతెచ్చేలా ఎవరు వ్యవహరిం చినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
రైతులకు కలిగిన ఇబ్బందులను 10 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించా రు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మామిడికి ధరలేక మార్కెట్లో ఉన్న ధరకే అక్కడి రైతులు విక్రయించు కోవాల్సి వస్తుందని… అందుకే ఏపీలోని మామిడి రైతులను కాపాడుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందన్నారు. తోతాపురి మామిడి రైతులకు ప్రయో జనం కలిగించేలామరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకువచ్చి ఒక ఎకో సిస్టంను తయారు చేస్తున్నా మని సీఎం అన్నారు. జనవరిలో ఉద్యాన ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించాలని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖను ఆదేశించారు. ప్రస్తుతం పండ్ల ఉత్పత్తిలో దేశంలో ఏపీ నెంబర్ 1గా ఉందని.. ప్రపంచంలోనే అత్యుత్తమ పండ్ల ఉత్పత్తి కేంద్రంగా ప్రకాశం సహా రాయలసీమ జిల్లాలు తయారుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.














