- జనవరి 19నుంచి 23 వరకూ ముఖ్యమంత్రి పర్యటన
- సీఎం వెంట మంత్రులు లోకేష్, భరత్, ముఖ్య కార్యదర్శులు
అమరావతి (చైతన్య రథం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 2026 జనవరి 19 నుంచి 23 వరకు దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవుతారు. సీఎం చంద్రబాబు బృందంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సహా సీఎం కార్యదర్శి కార్తీకేయ మిశ్రా, పరిశ్రమల కార్యదర్శి యువరాజ్, ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ శుభం బన్సల్ ఉండనున్నారు. ఈమేరకు షెడ్యూల్కు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. దావోస్ పర్యటనకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బృందం దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధుల్ని కలవనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా.. పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. విస్తృతంగా పెట్టుబడులను ఆకర్షించే అంశంపై కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టడం తెలిసిందే. ఇటీవలే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ఐటీ మంత్రి నారా లోకేష్.. దిగ్గజ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రెండు రోజుల క్రితమే అమెరికా, కెనడా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.














