- కాకినాడ పరిసరాల్లో తీరం తాకే అవకాశం
- ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియచేయండి
- కాకినాడ జిల్లా కలెక్టర్ తో టెలీ కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి (చైతన్యరథం): బంగాళా ఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చ రికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలన్నారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్తో పవన్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ. జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠా పురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతోపాటు తాళ్ళరేవు మండలంపైనా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయాల న్నారు.
జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేం దుకు తగిన చర్యలు తీసుకోండి. తుపాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటి వన్నీ సమకూర్చి ఉంచండి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధంచేయాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్త లు తీసుకోవాలి. మత్స్యకారులను అప్ర మత్తం చేయాలని స్పష్టం చేశారు.ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపైనా పవన్ ఆరాతీశారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువగా నీటి నిల్వలు పెరు గుతున్నాయని, నీటిని వదిలేటప్పుడు ప్రజ లను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. వరద ముంపు పరిస్థితి వస్తే నీటిపారుదలశాఖ అధికారు లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకో వాలని, పిఠాపురం, పెద్దాపురం నియోజక వర్గాల రైతులు, ప్రజలకి సమాచారం ఇవ్వా లని పవన్ కళ్యాణ్ సూచించారు.














