- చారిత్మాత్మక గూగుల్ ఏఐ హబక్కు నేడు ఢిల్లీలో ఎంఓయూ
- రూ.87,250 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఎఫ్ఐ
- రాష్ట్ర చరిత్రలో మైలురాయి, భవిష్యత్ను మలుపు తిప్పే కీలక ప్రాజెక్ట్
- గూగుల్ రాకతో ఏఐ సిటీగా విశాఖ రూపాంతరం
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలోనే సంస్థ ప్రతినిధులతో తొలిచర్చలు
- రాష్ట్రానికి భారీ ఆదాయం, యువతకు 1.88లక్షల ఉద్యోగావకాశాలు
అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిరంతర కృషితో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు మంగళవారం న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం
కుదరనుంది. ఇది ఏపీ చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. భారత ఏఐ శక్తిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (ఏఐ) కేంద్రాన్ని “గూగుల్ ఏఐ హబ్” పేరుతో శ్రీకారం చుట్టనుంది. విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250 కోట్లు)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధిం చిన ఎంఓయుపై న్యూఢిల్లీలో సంతకాలు చేయను న్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ఐ)గా రికార్డు సృష్టించబో తోంది. న్యూఢిల్లీలోని మాన్ సింగ్ హెూటల్లో మంగళవారం ఉదయం 10గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీవైష్ణవ్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం ఎంఓయుపై సంతకాలు చేయ నున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఆసియాలోనే గూగుల్ అతి పెద్ద ప్రాజెక్ట్
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 31వతేదీన శాన్ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు.
ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏఐ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఆ తరువాత గూగుల్ ప్రతినిధులతో పలుదఫాలుగా జరిగిన చర్చలు కార్యరూపం దాల్చాయి. గూగుల్ ఏఐ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ సంస్థ పూర్తి ఏఐ సాంకేతిక వేదికకు ఆతిథ్యం ఇవ్వగల అవకాశం లభిస్తుంది. దీని ద్వారా భారతదేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక నాయకత్వం వహించబోతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గూగుల్ సంస్థ రాబోయే అయిదేళ్లలో (2026-2030 మధ్య) సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతి పెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్థాయి. రాష్ట్రంలోని యువత కోసం విస్తృత స్థాయి ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. అలాగే, ఈ ఏఐ హబ్ ద్వారా విశాఖపట్నానికి మరిన్ని గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశముంది. తద్వారా టెక్నాలజీ, ఇన్నొవేషన్ రంగాల్లో విశాఖ ప్రధాన కేంద్రంగా మారుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతోపాటు వ్యాపార అనుకూల విధానాలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను జాతీయ స్థాయి ఏఐ ఎక్సలెన్స్ సెంటర్గా అభివృద్ధి చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం.
ఏఐ సిటీగా విశాఖ
గూగుల్ చేపట్టే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నాన్ని ఏఐ సిటీగా మార్చబోతోంది.
విశాఖలో ఏర్పాటుచేసే డేటా సెంటర్ ద్వారా గూగుల్ తన పూర్తి కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను అమలు చేసి, భారతదేశంలో ఏఐ ఆధారిత ట్రాన్స్ఫర్మేషన్ ను వేగవంతం చేయనుంది. ఈ కొత్త ఏఐ హబ్లో అత్యాధునిక ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ సామర్థ్యం, భారీ స్థాయి ఇంధన వనరులు, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ను ఒకేచోట సమన్వయపరచి, విశాఖపట్నాన్ని భారతదేశ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రంగా నిలబెడుతుంది. గూగుల్ గ్లోబల్ నెట్వర్క్ సముద్ర గర్భ, భూభాగపు కేబుల్ కనెక్టివిటీ ద్వారా అనుసంధానించి, క్లీన్ ఎనర్జీతో పనిచేసే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనా ప్రకారం, ఈ ప్రాజెక్ట్ 2028-2032 కాలంలో సగటున సంవత్సరానికి రూ.10,518 కోట్ల జీఎస్డీపీ వాటాతోపాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టిస్తుంది. గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. మొత్తం ఐదేళ్ళలో సుమారు రూ.47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం పొందింది. ప్రాజెక్టును వేగవంతంగా ప్రారంభించడానికి వీలుగా సింగిల్ విండో క్లియరెన్స్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, రెన్యువబుల్ ఎనర్జీ, ప్లగ్-అండ్-ప్లే మౌలిక వసతులను ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖలు సమన్వయంతో అందించేవిధంగా ఏర్పాట్లు చేశారు.