- కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఔదార్యం
- పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్
ఉండవల్లి (చైతన్యరథం): డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థ లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులను విరాళంగా అందించింది. సుమారు రూ. 40 లక్షల విలువైన నోట్ పుస్తకాలు, పెన్నులను కేఎల్ఎస్ఆర్ సంస్థ విరాళంగా అందించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని అందజేయనున్నారు. ఈ మేరకు నోట్ పుస్తకాల పంపిణీని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం లాంఛనంగా ప్రారం భించారు. పుస్తకాల ట్రక్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ పాటు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండీ కేఎల్ శ్రీధర్రెడ్డి, డైరెక్టర్ కే.ప్రీతత్రెడ్డి, సమగ్ర శిక్ష స్టేట్అప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.