- అన్ని విధాలా మోసగించిన వైసీపీ ప్రభుత్వం
- … వారి పాలనలో యూరియా కోసం రైతు కన్నీళ్లు
- పంటల బీమా పేరుతోనూ మోసం చేశారు
- వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేశారు
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజం
అనంతపురం (చైతన్యరథం): వైసీపీ పాలనలో -రైతులను నరకం అనుభవించేలా చేశారని, యూరియా కోసం రైతులు రాత్రిళ్లు క్యూలలో నిలబడ్డారని వ్యవ సాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా పర్యటనలో మంత్రి అచ్చెన్నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభా ప్రాంగణం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ ఉచిత పంటల బీమా పేరుతో రైతులను మోసం చేశాడని, ఉద్యాన పంటలకు మద్దతు ధరలు ప్రకటించి నా ఒక్క కిలో కూడా కొనలేని చేతకాని వాడు జగన్ అని మండిపడ్డారు. వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య రంగాలను సర్వనాశనం చేసి నేడు కూటమి ప్రభు త్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపు కుంటున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ క్షణక్షణం పని చేస్తోందని, రైతులు ఇబ్బందిపడకుండా ముందుగానే యూరియా, విత్తనాలు, బీమా, మద్దతు ధరలతో సహాయాన్ని అంది స్తోందని తెలిపారు. మోసం చేసిన వైసీపీ పాలనకు రైతులు గుణపాఠం చెప్పారని, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
సరళీకృతంగా యూరియా సరఫరా
వైసీపీ ప్రభుత్వ కాలంలో యూరియా కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 81 వేల హెక్టార్లలో అధికంగా పంటలు వేయడం, వ్యవసాయంలో యూరి యా వాడకాన్ని తగ్గించమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం వల్ల రైతులు భయపడి, భవిష్యత్ అవసరాల కొరకు యూరియాని అధికంగా కొనుగోలు చేయటం వల్ల యూరియా డిమాండ్ అనూ హ్యంగా పెరిగిందన్నారు. మధ్యలో ఒక నెల డ్రై స్పెల్ వచ్చి తరు వాత ఒకేసారి వర్షాలు విస్తారంగా పడటం వల్ల ఎరువుల అవసరం పెరిగి యూరియా సరఫరాపై ఒత్తిడి పెరిగిందని, వాస్తవానికి ఖరీఫ్ సీజన్కు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటికే 6.75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసామని తెలిపారు. నేటివరకు 5.97 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరగగా, ఇంకా 78 వేల మెట్రిక్ టన్నుల యూరియా షాపుల్లోనూ మరియు ఆర్ఎస్కల ద్వారా అమ్మకానికి సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో కేంద్ర ప్రభుత్వం అదనంగా 49,367 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారని, దీంతో పూర్తిస్థాయిలో రైతులకు యూరియా అందుబాటులో ఉండి, యూరియా కొరత పూర్తిగా తీరిపోతుందన్నారు. రాబోయే రబీ కాలానికి అవసరమైన 9.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కూడా ముందస్తుగానే కేంద్రం ఇప్పటికే కేటాయించిందని తెలిపారు. 50 శాతం ప్రయివేటు డీలర్లు, 50 శాతం ప్రభుత్వ సంస్థల ద్వారా యూరియా గతంలో అమ్మగా, ప్రభుత్వానికి రవాణా ఖర్చులు పెరిగినప్పటికీ, 70 శాతం ప్రభుత్వం ద్వారా మరియు 30 శాతం ప్రయివేటు డీలర్ల ద్వారా యూరియా అమ్మకాలు ప్రారంభించామని అన్నారు. ఆర్ఎస్కే సేవలు మరింత మెరుగుపరిచామని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక సంవత్సరానికి సరాసరి ఆర్ఎస్కేల ద్వారా 255 కోట్ల విలువ చేసే యూరియా అమ్మకాలు జరగగా, కూటమి ప్రభుత్వ హయాంలో 2024-25 సంవత్సరంలో ఆర్ఎస్కేల ద్వారా 292 కోట్ల విలువ చేసే యూరియాను సరఫరా చేసామని తెలిపారు.
విత్తనాలు, బీమా అందచేస్తూ ప్రోత్సాహకాలు
వైసీపీ కాలంలో విత్తనాలు ఆలస్యంగా, తక్కువ నాణ్యతతో చేరాయని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 130 కోట్లు ఖర్చు చేసి 7.37 లక్షల మంది రైతులకు రాయితీతో 4.08 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందించామని తెలిపారు. కంటింజెంట్ విత్తనాలను 80 శాతం రాయితీతో ఇచ్చామని అన్నారు. పంటల బీమా విషయంలో వైసీపీ హయాంలో రైతులు మోసపోయారని, ఉచిత భీమా అంటూ మోసగించి, ప్రీమియం చెల్లింపులు చేయ కుండా వదిలేశారని మండిపడ్డారు. 2019 తరువాత పంటల బీమా పూర్తిగా విఫలం అయిందని, 2018-19 తరువాత ఏ రబీ సీజన్లో కూడా ఎలాంటి బీమా పరిహారం చెల్లించలేదని తెలిపారు. ఉచిత పంటల భీమా అని చెప్పి 2020-21లో ఖరీఫ్కు మాత్ర మే అమలు చేసి చేతులు దులుపుకున్నారు. తరువాత పీఎంఎఫ్ బీవైతో కలిసి ఉచిత పంటల భీమా అమలు చేస్తామని ప్రకటించి రైతుల వాటా, రాష్ట్రం వాటా రెండింటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చి మోసగించారు. 2022 ఖరీఫ్ తరువాత ప్రీమియం సబ్సిడీ చెల్లింపు చేయకుండా ఇచ్చిన హామీని గాలికి వదిలేసి రైతులను నట్టేట ముంచారు. దీని కారణంగా 2022-23 రబీ నుండి రైతులకు బీమా పరిహారం సరైన సమయానికి చెల్లించక రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కూటమి కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలిచి, సమయానికి పరిహా రం అందేలా చర్యలు తీసుకుంటోందని స్పష్టంచేశారు.
రైతులను ఆదుకున్న కూటమి ప్రభుత్వం
కోకో ధరలు పడిపోతే 3776 మంది రైతుల నుంచి కిలోకు రూ.50 అదనంగా ఇచ్చి కొనుగోలు చేశాం. ఇందుకు రూ. 11.8 కోట్లు చెల్లించాం. తోతాపురి మామిడి ధర పడిపోతే, 51 వేల మంది రైతుల నుంచి 4.3 లక్షల టన్నుల మామిడి కొను గోలు చేసి కిలోకు రూ.4 చొప్పున రూ.171 కోట్లు చెల్లిం చాం. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మిర్చీకి క్వింటాకి రూ.11,781 మార్కెట్ ధరను కల్పించాం. ప్రభుత్వం నుండి హామీ లభించటంతో మార్కెట్లో మిర్చి ధర స్థిరీకరించబడి రూ. 11,781 కంటే అధికంగా ట్రేడ్ అయింది. దీంతో ఎంఐఎస్ ఎథకం అమలు చేయాల్సిన అవసరం రాలేదు. 2017లో మిర్చీ ధరలు పడిపోతే ప్రభుత్వం 55 వేల మంది రైతులకు క్వింటాకి రూ.1500 చొప్పున రూ.130 కోట్లు చెల్లించాం. అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2020లో మార్కె ట్ ధర 12 వేలు ఉంటే మద్దతు ధర రూ.7 వేలు ప్రకటించి కొనడానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ధరలు పడిపో యినప్పుడు రైతులను ఆదుకోవడానికి ధరలు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి 2025-26 బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయిం చాం. అదనంగా అవసరం అయితే పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం బడ్జెట్లో 6300 కోట్లు కేటాయించాం. ప్రతి రైతుకీ రూ.20 వేలు ప్రకటించడమే కాకుండా మొదటి విడతగా రూ.7 వేలు చొప్పున రూ.3,174 కోట్లు చెల్లించాం. (2,343 కోట్లు రాష్ట్ర వాటా, రూ.831 కోట్లు కేంద్రం వాటా). దీనివల్ల 46.86 లక్షల మంది రైతులు లబ్ధిపొందారు.
ఉద్యానవన పంట హబ్ రాయలసీమ
రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన పంటల హబ్ మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పాన్ని గత ప్రభుత్వ పాలకులు సర్వనాశనం చేశారు. డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని రాయలసీమలో ప్రతి ఎకరానికి 100 శాతం ఇవ్వా లనే సంకల్పంతో 2014-19లో ప్రణాళికాబద్దంగా పనిచేశాం. అందులో భాగంగా డ్రిప్ పరికరానికి మా ప్రభుత్వం 90 శాతం రాయితీని కల్పించగా, మీ ప్రభుత్వం దానిని 70 శాతానికి తగ్గించింది.ఎస్సీ, ఎస్టీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన 100 శాతం రాయితీని, 90శాతానికి తగ్గించింది. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు చెల్లించాల్సిన రూ.1166 కోట్ల బకాయి లు చెల్లించకపోవటంతో రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా సర్వనాశనం అయింది. దీంతో కేంద్రం ఇచ్చే నిధులను ఉపయోగించుకోవడానికి కూడా కంపెనీలు ముందుకు రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక, గత ప్రభుత్వం చెల్లించకుండా ఉంచేసిన బకాయిలను చెల్లించటంతో పాటు, రాయలసీమ జిల్లాకు రాయితీని 70 శాతం నుంచి 90 శాతానికి పెంచాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం నుంచి 100 శాతం రాయితీని పెంచాము. దీంతో మైక్రో ఇరిగేషన్ అమలు లో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానం పొందింది. అదేవిధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు దూర దృష్టితో, ఆయిల్ పామ్ సాగులో కూడా మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం లో ఉండగా, గత ప్రభుత్వంలో ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం ఇచ్చే నిధులు కూడా వారు వినియోగించుకోలేదు. దీనివల్ల రైతులు రూ. 194 దీనివల్ల రైతులు మొక్కను బ్లాక్ మార్కెట్లో రూ.400 నుంచి రూ.500 వరకు కొనాల్సిన పరిస్థితి వచ్చించి. కానీ మా ప్రభుత్వం అదే ఆయిల్ పామ్ మొక్కని రాయితీపై ఉచితంగా అందించే విధంగా చర్యలు చేపట్టింది.
వైసీపీ పశు బీమా, ఆరోగ్య శిబిరాలు నిలిపివేసింది
పశు బీమా పథకాన్ని, పశు ఆరోగ్య శిబిరాలను గత ప్రభు త్వం పూర్తిగా నిర్వీర్యం చేసి మూగ జీవాల ఉసురు తీశారు. కూటమి ప్రభుత్వం 13957 పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిం చి సకాలంలో మూగ జీవాలకు ఉచిత వైద్యం, మందులు సరఫరా చేశాం. పశు భీమా ప్రీమియం గతంలో రైతు 50 శాతం చెల్లిస్తే, 50 శాతం ప్రభుత్వం భరించేది. కూటమి ప్రభు త్వం వచ్చాక, పశు రైతులను ఆదుకోవడానికి 85 శాతం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. పశు బీమా పరిహారం రూ.37,500 నుంచి రూ.50 వేలకు పెంచాం. 100 శాతం సబ్సిడీతో గడ్డి విత్తనాలను 50 శాతం సబ్సిడీతో పసుగ్రాసాన్ని అందిస్తున్నాం. 25,000 గోకులాలను నిర్మించాం. కృత్రిమ గర్భధారణ స్ట్రా ధరను రూ.500 నుంచి రూ.150కి తగ్గించాం.
మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను దెబ్బతీసింది. కూటమి ప్రభుత్వం సముద్ర వేట నిషేధ కాల భృతిని కుటుంబానికి రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచి అర్హులైన 1,21, 433 మంది మత్సకారులకు 242.8 కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వం బకాయి పడ్డ మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ రాయితీని తమ ప్రభుత్వం చెల్లించి ప్రస్తుత బడ్జెట్లో రూ.50 కోట్లు కేటా యించాం. మరణిం చిన 63 మంది మత్స్యకారులకు రూ.3.15 కోట్లు నష్ట పరిహారం చెల్లించాం. సముద్ర తీర మత్స్య కారులు దూర ప్రాంతానికి వేటకు వెళ్లకుండా తీరానికి దగ్గరలో చేపలు దొరికే విధంగా చేయ డానికి 770 లక్షలు పెట్టి 22 కృత్రిమ అవాసాలు ఏర్పాటు చేశాం. ఇంకో 175ఏర్పాటు చేస్తాం. మత్స్యకారుల ఆదాయం పెంచడానికి సముద్రపు నాచు పెంప కాన్ని రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తు న్నాం. ఇందుకు 1250 మత్స్యకార సంఘాలకు శిక్షణ ఇచ్చాం. మహిళా పీఎంఎంఎస్వై కింద 404 యూనిట్ల పడవలు, ఇంజన్లు సరఫరా చేశాం. రూ.30 కోట్లతో తీర ప్రాంత ఆవాసాల్లో మౌళిక వసతులు కల్పిస్తున్నాం. మంచినీటి మత్స్యకారుల హక్కులు కాపాడటానికి జీవో 27 ద్వారా 217ను రద్దు చేశాం. ఆక్వా రైతులను ఆదుకోవడానికి యూనిట్కు రూ.1.50 సబ్సిడీతో విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఇందుకు గత సంవత్సరం రూ.803 కోట్లు ఖర్చు చేశాం. రూ.88 కోట్లతో బాపట్లలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సరళతరం చేశామని తెలిపారు.
ఉద్యాన, వాణిజ్య పంటల అభివృద్దే లక్ష్యంగా అడుగులు
గత ప్రభుత్వం 9 ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిందని, ఏ ఒక్క పంటలో ఒక్క కిలో అయినా కొనుగోలు చేయలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం సాంప్రదాయ పంట లతో పాటుగా వాణిజ్య పంటల ధరలు కూడా పడిపోయినప్పుడు, రైతులకు అండదండగా నిలిచి వారిని ఆదుకుందని అన్నారు. హెచ్ఎ బర్లీ పొగాకు ధర పడిపోతే రూ.271 కోట్లు వెచ్చించి 20,000 మిలియన్ కిలోలు కొనుగోలు చేసేందుకు నిర్ణయించి, ఇప్పటికే 16,000 మిలియన్ కిలోలు కొనుగోలు చేశామని తెలిపా రు. ఇంకా మిగిలిన 4000 మిలియన్ కిలోలను కూడా కొంటా మని, ఇంకో 60 వేల మిలియన్ కిలోలను ప్రైవేట్ వర్తకుల ద్వారా కొనుగోలు చేయించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నప్పటి నుంచి మూడు సందర్భాలలో టమాటో ధర పడి పోతే, 4599 మెట్రిక్ టన్నుల పంటను కొనుగోలు చేసి 11.25 కోట్లు రైతులకు చెల్లించామని అన్నారు. 2016లో ఉల్లి ధరలు పడిపోతే 7723 మంది రైతుల నుంచి 2.77 లక్షల క్వింటాళ్ళు కొనుగోలు చేసి రూ.7 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. 2018లో మరొకసారి 9740 మంది రైతుల నుంచి 3.48 లక్షల క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి 6.45 లక్షలు చెల్లించా మని, 2020లో వైసీపీ ప్రభుత్వంలో ఉల్లి ధరలు పడిపోతే నామ మాత్రంగా క్వింటాకు రూ.770 మద్దతు ధర ప్రకటించి ఏ ఒక్కరి దగ్గరా ఉల్లి కొనుగోలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం క్వింటాకు రూ.1200లు మద్దతు ధర ప్రకటించి ఇచ్చిన మాటకు కట్టుబడి అదే ధరకు ఉల్లి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.