- కేంద్ర పర్యాటక మంత్రి, అధికారులతో భేటీ
- మూడు పర్యాటక ప్రాజెక్టులకు డీపీఆర్లు
- ఆయా ప్రతిపాదనలకు సానుకూల స్పందన
న్యూఢిల్లీ : ఏపీ పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి విజయవాడ నుంచి న్యూఢల్లీి బయలుదేరిన మంత్రి కందుల దుర్గేష్ సోమవా రం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర పర్యాటక అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ సుమన్ బిల్లాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రం లో పర్యాటకాభివృద్ధి, పలు ప్రాజెక్టులకు అనుమతులపై సానుకూ లంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ అభివృద్ధికి సంబంధించి దాదాపు రూ.270 కోట్ల విలువైన మూడు పర్యాటక ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించారు. ప్రధానంగా లేపాక్షిలో కల్చరల్ సెంటర్, పర్యాటకుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.103 కోట్లు, లంబసింగిలో పర్యాట కులకు ఆహ్లాదకరమైన, అద్భుతమైన అనుభవాల కల్పనకు రూ. 99.87 కోట్లు, బుద్ధిస్ట్ సర్క్యూట్ సమీపంలో టెంట్ సిటీల ఏర్పా టుకు రూ.77.32 కోట్లు అవసరమవుతాయని సంబంధిత డీపీ ఆర్లను కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు మంత్రి కందుల దుర్గేష్ సమర్పించారు. అదేవిధంగా ప్రపంచ స్థాయి హోదా కల్పనలో భాగంగా యునెస్కో జాబితాలో లేపాక్షికి గుర్తింపు అంశంపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతిపాదనలకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. లలిత కళలను ప్రోత్సహించేందుకు, యువ కళాకారులకు మద్దతుగా విశాఖపట్నంలో లలిత కళా అకా డమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని అభ్య ర్థించినట్లు తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు చేసేందుకు విజయవాడలోని జీవీఆర్ మ్యూజిక్, డ్యాన్స్ కాలేజీలో కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణం, రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో తెలుగు భాష, సాహిత్యాన్ని, సంగీత, నృత్య, నాటక కళలను సంరక్షించేం దుకు, ప్రోత్సహించేందుకు, రచయితలకు అవకాశాలు కల్పించేం దుకు సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయా లని కోరినట్లు వివరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సూచ నల మేరకు సూర్యరాయ ఆంధ్ర నిఘంటువును పునర్ముద్రించా లని, భవిష్యత్ తరాలకు అందజేయాల్సిన అవసరాన్ని వివరించా నని తెలిపారు. అదేవిధంగా సింగపూర్ విజిటర్ సెంటర్, దుబా య్ టూరిజం హబ్ల మాదిరిగా రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదు పాయాలు, సందర్శకుల సౌకర్యాలు మరింత బలోపేతం చేసేందు కు, అంతర్జాతీయ పర్యాటక డెస్క్లు, ప్రధాన పర్యాటక అగ్రిగేట ర్లకు స్థలాలు, వీసా ఫెసిలిటేషన్ కౌంటర్లు ఏర్పాటు కోసం రూ. 100 కోట్లతో అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ఎక్స్పీరియన్స్, ఇంటర్ ప్రెటేషన్, ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఏపీటీఐఎఫ్సీ) ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై అమరావతిలో 5 ఎకరాల భూమికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రికి వివరించినట్లు చెప్పారు. పై అభ్యర్థనలకు త్వరితగతిన నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. భేటీలో భాగంగా రాజ మహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, అమరావతిలో పర్యాటక భవన్ అంశం చర్చకు వచ్చిందని వెల్లడిరచారు. అదే విధంగా గతంలో సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.