ఆక్వాకల్చర్ యూనిట్ల నమోదు తప్పనిసరి
సుంకాలపై కేంద్రంతో సీఎం సంప్రదింపులు
చికెన్ వ్యర్థాలు చేపల చెరువులకు తరలిస్తే చర్యలు
వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ఆక్వాకల్చర్ కమిటీ తొలి సమావేశం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని అంత ర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలో నిలుపుతా మని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఆక్వాకల్చర్ అభి వృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని మత్స్య సంపద, ఉత్పత్తి నాణ్యత, ఎగుమతి అవకాశాలు, రైతుల ఆదాయాన్ని పెంచే విధానాలపై సమగ్రంగా అధికారులతో చర్చిం చారు. రాష్ట్రంలో అక్వాకల్చర్ అభివృద్ధికి సంబంధించి కీలక అం శాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంద ర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మత్స్యశాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ అనుకూల పద్ధతులు, శాస్త్రీయ విధానాల వినియోగం ద్వారా ఉత్పత్తి పెంపుతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ స్థాయిని మరింత బలోపే తం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మత్స్యకారులు, ఆక్వా రైతులు, పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పర్యావరణం మరియు ప్రజారోగ్యం రక్షణ ప్రథమ కర్తవ్యమని, రైతుల సంక్షేమం, ఎగుమతుల ప్రోత్సా హం, కొత్త ఉపాధి అవకాశాల దిశగా రాష్ట్రానికి మైలురాయిగా నిలుస్తాయని స్పష్టం చేశారు.
అక్వాకల్చర్ లైసెన్స్ ప్రక్రియ సరళీకరణ
రైతులు ఇకపై ఏపీఎస్ఏడీఏ చట్టం కింద తమ ఆక్వా చెరు వులను ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా లైసెన్స్ పొందే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని చెప్పారు. ప్రభుత్వ ప్రయోజన పథకాలు పొందడాని కి ప్రతి అక్వాకల్చర్ రైతు తమ చెరువులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. సముద్ర ఆహార ఎగుమతుల నాణ్యత ను, ట్రేసబిలిటీని మెరుగుపరచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంద ని తెలిపారు. డి-పట్టా, అసైన్, సీజేఎఫ్ఎస్ భూములపై చేపల పెంపకం చేస్తున్న రైతులకు ఏపీఎస్ఏడీఏ చట్టం ప్రకారం సాగు ధ్రువీకరణ పత్రం ఇవ్వబడుతుందని తెలిపారు. దీని ద్వారా వారు ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయం పొందే అవకాశం కలుగు తుందని తెలిపారు.
పౌల్ట్రీ వ్యర్థాల వాడకంపై నిషేధం
కొన్ని ప్రాంతాల్లో పౌల్ట్రీ వ్యర్థాలను చేపల ఆహారంగా వాడుతు న్నట్లు గుర్తించామని చెప్పారు. ఇది ప్రజారోగ్యానికి హానికరంతో పాటు నీటి కాలుష్యం కావడంతో ఈ ప్రక్రియను పూర్తిగా వ్యతిరే కిస్తున్నామని తెలిపారు. రైతులు వెంటనే ఈ విధానాన్ని నిలిపి వేయాలని ఆదేశించారు. చెరువుల యజమానులు చికెన్ వ్యర్థాల ను చేపల ఆహారంగా వేసినట్లు రుజువైతే వెంటనే వారి లైసెన్స్లు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
సముద్ర, జలాశయ ఫిష్ కల్చర్ విధానాలకు ఆమోదం
రాష్ట్రంలో మారికల్చర్, రిజర్వాయర్ కేజ్ కల్చర్ విధానాలకు కమిటీ ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగా సముద్ర తీరప్రాం తాలు, జలాశయాల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించి మత్స్యకారు లు, మహిళా మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడమే దీని లక్ష్యం. ఇందుకోసం అనువైన 4-5 ప్రాంతాలను ఎంపిక చేసిన తీరప్రాంతాల్లో సముద్ర నాచు సాగును ప్రోత్సహించడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. భవిష్యత్ లో మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటారు.
అమెరికా టారిఫ్ల ప్రభావం తగ్గించడానికి చర్యలు
భారతీయ రొయ్య ఎగుమతులపై ఆగస్టు 27 నుంచి అమెరికా విధిస్తున్న 50 శాతం టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించేందుకు మంత్రి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎంపెడా సహకారంతో దక్షిణ కొరియా, యూరోప్, యూకే, మిడిల్ ఈస్ట్, రష్యా, ఆఫ్రికా వంటి కొత్త మార్కెట్లను అన్వేషించాలని సూచించారు. యూకేతో కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవకాశాలను వినియోగించుకోవాలని తెలి పారు. ఎగుమతిదారులు, ప్రాసెసర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలన్నారు. ఆక్వా రైతులకు మేలు జరిగేలా అధిక సుంకా ల వ్యవహరంపై సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సంప్ర దింపులు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీని కంపెనీ చట్టం కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఎఫ్ఎఫ్పీవోలు, అక్వాకల్చర్ రంగంలోని ఇతర వ్యాపారులు సభ్యులుగా ఉంటారు. దేశీయ వినియోగాన్ని పెంచడానికి ఇది ఎన్ఈసీసీ మోడల్ తరహాలో పనిచేస్తుంది. ఈ సమావేశంలో ఏపీఎస్ఏడీఏ కో-వైస్ చైర్మన్ ఆనం వెంకట రమ ణారెడ్డి, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ రామ శంకర్ నాయిక్, ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.