- విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం
- మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
అమరావతి(చైతన్యరథం): నర్సింగ్, జీఎన్ఎం చదివిన ఎస్సీ నిరుద్యోగ యువతకు జర్మనీ భాషలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ యువతకు ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నర్సింగ్, జీఎన్ఎం చదివిన ఎస్సీ యువతకు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మనీ భాషలో ఉచిత శిక్షణ ఇవ్వ నున్నాం. మొదటి విడతలో 150 మందికి శిక్షణ ఇచ్చి అనంతరం వారికి జర్మనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎస్సీల్లో చదువుకున్న ఏ ఒక్కరూ ఉద్యోగ, ఉపాధి లేమితో ఉండకూడదన్న దే సీఎం చంద్రబాబు లక్ష్యం. ఎస్సీలను ఆర్థికంగా, రాజకీయంగా సామాజికంగా మరింత బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు పాటుపడుతున్నారని తెలిపారు.