- విద్యావ్యవస్థ గాడిన పడుతుంటే
- అంత కడుపుమంట ఎందుకు?
- ఈసెట్ ఎప్పుడు పెట్టారో తెలియదా?
- జూలై మూడోవారానికే
- మేం కౌన్సిలింగ్ పూర్తిచేస్తాం
- జగన్రెడ్డికి నారా లోకేష్ కౌంటర్
అమరావతి(చైతన్యరథం): వైసీపీ నేత జగన్రెడ్డికి ఎక్స్ వేదిక గా మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ ఏడుపులే మాకు దీవెనలు..ఐదేళ్లు విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయా రు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యావ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపుమంట రావడం సహజం. మీ హయాంలో ఈసెట్ ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు స్పృహ లేదు. కొవిడ్ తరువాత మీరు 2022 సెప్టెంబర్లో, 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సి లింగ్ పూర్తి చేసిన మీరు..మమ్మల్ని విమర్శించటం మీ అజ్ఞానానికి నిదర్శనం. మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సి లింగ్ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేశాం. ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్ని జూలై మూడోవారానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.