- ఏడాదిలో అభివృద్ధిపై ప్రచారం చేయాలి
- కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నాం
- సీనియర్ల అనుభవం,యువశక్తి తోడు కావాలి
- విజయంలో కార్యకర్తల కష్టం ఉంది..మరువొద్దు
- అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే ఉండాలి
- ఎక్కడ కూర్చోవాలో ప్రజలే నిర్ణయిస్తారు
- జూలై 5 నాటికి కమిటీలన్నింటిని పూర్తి చేయాలి
- టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్
మంగళగిరి(చైతన్యరథం): సుపరిపాలనలో- తొలి అడుగు కార్యక్రమాన్ని నెలరోజుల పాటు ఇంటింటికీ తీసుకెళ్లి విజయ వంతం చేయాలని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని, ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయాలని సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్య క్రమం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. సుపరిపాలనలో- తొలి అడుగు’’ కార్యక్ర మాన్ని నెలరోజుల పాటు ఇంటింటికీ తీసుకెళ్లి విజయవంతం చేయాలని పిలు పునిచ్చారు. 2024 ఎన్నికల్లో మనల్ని ఊహించని విధంగా 94 శాతం సీట్లతో ప్రజలు గెలిపించారు. దీనికి ప్రధాన కారణం గత వైసీపీ పాలకులకు ఉన్న అహంకారం. ఈ గెలుపు వెనుక కార్యకర్తల కష్టం చాలా ఉంది. నేను యువగళం పాద యాత్ర ప్రారభించినప్పుడు కబ్ సిస్టమ్ (క్లస్టర్, యూనిట్, బూత్) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మన నాయకుడు చంద్రబాబు చెప్పారు. క్లస్టర్, యూనిట్, బూత్ వ్యవస్థ వచ్చిన తర్వాతే మన బూత్లు పటిష్టం అయ్యాయి. అనేక కార్యక్రమాలు మన చేయ గలుగుతున్నాం. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
ఎక్కడ కూర్చోవాలో ప్రజలే నిర్ణయిస్తారు
పార్టీనే సుప్రీం. దేశం మొత్తం తిరిగినా, ప్రపంచం మొత్తం తిరిగినా తిరిగి వచ్చేది పవిత్ర దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయానికే. అందుకే ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మించాలని చెప్పాం. మనం ఎక్కడ కూర్చోవా లో ప్రజలే నిర్ణయిస్తారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలని తెలిపారు.
ప్రతి హామీ అమలు లక్ష్యంతో పనిచేస్తున్నాం
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం అమలు చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీ పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మనం అధికారంలో ఉన్నా ప్రతి పక్షంలో ఉన్నట్లే వ్యవహరించా లి.. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించాలి.. ఇటీవల ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి నప్పుడు పొగాకు రైతుల సమస్య ఉందని తెలుసుకున్నా. వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాం. పెట్టుబడులు తీసుకువచ్చేందుకే అహర్నిశలు కష్టపడుతున్నా. మన నియోజకవర్గ కోసం కష్టపడాలి..మంచి పనులు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
కష్టపడిన కార్యకర్తలను మరువద్దు
దేశం, ప్రపంచం మొత్తం తిరిగినా తిరిగి వచ్చేది మనం పవిత్ర దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయానికేనని చెప్పారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడిచేస్తే పట్టించుకోని పరిస్థితి ఆనాటి పాలనలో చూశాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం, సంస్థాగత నిర్మాణంపై చర్చించేందుకు ఇక్కడ సమా వేశమయ్యాం. 164 మంది ఎమ్మెల్యేల్లో 88 మంది మొదటిసారి గెలిచినవారు ఉన్నారు. మంత్రివర్గంలో ఉన్న 25 మందిలో 17 మంది మొదటిసారి గెలిచినవారు ఉన్నారు. ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది ప్రతిపక్షంలో ఉండగా వేధింపులకు గురైనవారు ఉన్నారు. జైలుకు వెళ్లిన వారు ఉన్నారు. అక్రమ కేసులు నమోదైన వారు ఉన్నారు. కష్టపడిన కార్యకర్తలను మరువద్దని కోరుతున్నా. వారిని విస్మరించకుండా ఉండేందుకే పరిశీలకులను వేయడం జరి గింది. పార్టీ పిలుపు నిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సీరియస్గా తీసు కోవాలి.
మహిళలను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తాం
మహిళలను ప్రోత్సహించేందుకు కబ్స్లో కో కన్వీనర్ పదవి తీసుకువచ్చాం. పార్టీ వ్యవస్థలో మహిళలను పెద్దఎత్తున భాగస్వా ములను చేస్తాం. కమిటీలు వేసేముందు స్థానిక నాయకత్వంతో మాట్లాడాలి. కేఎస్ఎస్లు 90 శాతం పూర్తి చేశాం. బూత్లు 82, యూనిట్లు 80 శాతం, క్లస్టర్ 80 శాతం పూర్తి చేయడం జరి గింది. అనుబంధ విభాగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆయా కమిటీల్లో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. జూలై 5 నాటికి కమిటీలన్నింటిని పూర్తి చేయాలి. పరిశీలకులకు కూడా బాధ్యత ఉంది. కుప్పంలో సంస్థాగత నిర్మాణం వల్లే అక్కడ వరుసగా విజయం సాధిస్తున్నారు. కచ్చితంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలి. క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని తెలిపారు.
సీనియర్ల అనుభవానికి యువశక్తి తోడవ్వాలి
సీనియర్లకు ఉన్న అనుభవం, యువతకు ఉన్న శక్తి రెండిరటినీ జోడిరచాల్సిన అవసరం ఉంది. సీనియర్లే పార్టీకి కాపలా కాశారు. నాలుగు దశాబ్దాలు పార్టీని ముందుకు తీసుకెళ్లారు. దీనిని మనం మర్చిపోకూడదు. పార్టీ పదవుల విషయంలో దామాషా ప్రకారం పదవులు ఇవ్వాలి. అందరినీ కలుపుకుపోవాలి. నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత నిర్మాణం బాగా చేసిన వారిలో మంత్రి నిమ్మల నెం.1గా ఉన్నారు. మంగళగిరి ఐదో స్థానంలో ఉంది. మనలో పోటీతత్వం రావాలి. బాగా పనిచేసిన కార్యకర్తలను గుర్తించాలి. తన నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా బాగా పనిచేసిన కార్యకర్తలను సత్కరిస్తున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలి. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి. నెలరోజుల పాటు తూ.చ. తప్పకుం డా అందరం డోర్ టూ డోర్ ప్రచారం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.