- సాంకేతికత, అవకాశాలను అందిపుచ్చుకోవాలి
- జిల్లాల్లో ఎంఎస్ఎంఈ సపోర్ట్ సర్వీసులు
- ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు
- ఎంఎస్ఎంఈ దినోత్సవంలో మంత్రి కొండపల్లి
- తొమ్మిది కంపెనీలతో అవగాహన ఒప్పందాలు
తిరుపతి(చైతన్యరథం): నూతన సాంకేతికతను, అవకాశాలను అందిపుచ్చుకుని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలని ఎంఎస్ ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నగరంలోని తాజ్ హోటల్లో నిర్వహించారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు ఎస్.పి.సోమనాథ్, ఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ సీఈ వో ఎం.విశ్వ, తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసు లు, కె.ఆదిమూలం, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలతో కలసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాల్గొన్న అన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులకు అభినందన లు తెలిపారు. ఈ ఏడాది ఎంఎస్ఎంఈ డే థీమ్ అయిన ‘‘సస్టైన బుల్ గ్రోత్, ఇన్నోవేషన్కు ఎంఎస్ఎంఈల పాత్ర’’పై ఎస్.పి. సోమనాథ్ ప్రసంగం ప్రేరణాత్మకంగా ఉందన్నారు. టెక్నాలజీ స్వీక రణ, పరిశ్రమల పునరుజ్జీవనం, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఆయ న సూచనలు అమూల్యమైనవన్నారు.
ఈరోజు అనేక సంస్థలు ఎం ఎస్ఎంఈలకు మద్దతుగా జ్ఞాపకార్థక ఒప్పందాలపై (ఎంవో యూ) సంతకాలు చేశారని, ముఖ్యంగా ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్)తో కుదిరిన ఒప్పందం ఎంఎస్ఎంఈలను ఐపీవో వైపు తీసుకెళ్లే కీలకమైన అడుగగా పేర్కొన్నారు. ఇది ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్లో కొత్త అధ్యాయంగా అభివర్ణించారు. ఎంఎస్ఎంఈ లు వ్యవసాయం తర్వాత రెండవ అతిపెద్ద ఉద్యోగ కల్పన కేంద్రా లుగా నిలిచారన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్లో 90 శాతం ఎంఎస్ఎంఈలేనని, 60-70 శాతం ఉద్యోగాలు వీటి ద్వారానే సృష్టించబడుతున్నాయని వివరించారు. సుమారు 50 శాతం ప్రపంచ జీడీపీకి ఎంఎస్ఎంఈలే కారణమన్నారు. భారతదేశం లో 30 శాతం జీడీపీకి, 45 శాతం ఎగుమతులకు, 11 కోట్లకు పైగా ఉద్యోగాలకు ఎంఎస్ఎంఈలు వెన్నెముక అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం పరిశ్రమలు రాష్ట్ర జీవీఏ(గ్రాస్ వాల్యూ యాడెడ్)లో 23.17% వంతు కల్పి స్తున్నాయని, ఇందులో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత ప్రధానమై నదన్నారు. జూన్ 4, 2024న ముఖ్యమంత్రి ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖలతో కూడిన ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని, ఇది దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేదన్నారు. ‘‘ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త’’ అనే దృష్టికోణంతో ఎంఎస్ఎంఈలు, జీవ నోపాధి, ఎన్ఆర్ఐ పెట్టుబడుల మధ్య వారధిగా పనిచేస్తుంద న్నారు. సెర్ప్ ద్వారా ఎస్హెచ్జీ మహిళలకు ఉపాధి అవకాశా లను కల్పించి ఆర్థిక స్థితిని మెరుగుకు చర్యలు తీసు కుంటున్నా మన్నారు. ఉదాహరణకు: రూ.90,000 కోట్ల ఎస్హె చ్జీ క్రెడిట్ లింకేజ్ గ్రామీణ ప్రాంతాలలో రానుందని, దీన్ని ఉత్పాదక, ఉపాధి గా మార్చే ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. ఇవాళ అవార్డులు పొందిన మహిళల్లో కొన్ని ఎస్హెచ్జీల నుంచి ఉండవచ్చునని, ఇది మా కార్యక్రమాల విజయానికి నిదర్శన మన్నారు.
జిల్లాల్లో ఎంఎస్ఎంఈ సపోర్ట్ సర్వీసులు
ఎంఎస్ఎంఈలకు పలు సౌకర్యకరమైన పథకాలను అందిస్తు న్నామని, ర్యాంప్ పథకం ద్వారా ఐపీ సదుపాయాలు, స్కిల్లింగ్, బిజినెస్ డెవలప్మెంట్ సర్వీసులు లాంటి అంశాల్లో తగు జాగ్రత్త లు తీసుకుంటున్నామని, దీనిని జిల్లా స్థాయికి విస్తరిస్తున్నామని వివరించారు. కలెక్టర్లను ప్రధాన పాత్రదారులుగా మార్చి స్థానిక అవసరాలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈ సపోర్ట్ సర్వీసులను అమలు చేస్తామన్నారు. సూక్ష్మ తరహా ఎంటర్ప్రైజర్లు చిన్న తరహా ఎంటర్ప్రైజర్గా మారాలని, చిన్న తరహా ఎంటర్ప్రైజర్ మధ్య తరహా ఎంటర్ ప్రైజర్గా మారాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. కొన్ని పార్కులు సెక్టార్ స్పెస ిఫిక్గా అభివృద్ధి చేయబడతాయని, ఇస్రో వంటి సంస్థల సమీపం లో అంతరిక్ష సంబంధిత ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయా లనే యోచన ఉందన్నారు. ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు వారు కూడా పార్కులను నిర్మించవచ్చన్నారు. ప్రభుత్వం రూ.5 లక్షలు ఎకరాకు సీఈటీపీ, డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రోత్సాహకా లు కూడా అందిస్తుందన్నారు. ప్రపంచం దిశగా ఎంఎస్ఎంఈలు ఆలోచించాలని డిజిటల్ టెక్నాలజీని స్వీక రించాలని, ఓఎన్డీసీ, ఈఆర్పీ, ఏఐ, ఐవోటీ వంటి టూల్స్ ఎంఎస్ఎంఈలను సమర్థ వంతంగా మారుస్తాయన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మా ట్లాడుతూ జిల్లాలో 1.80 లక్షల మంది ఎంఎస్ఎంఈలపై ఆధా రపడి ఉన్నారన్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కార్యక్ర మంలో 2024-25 సంవత్సరానికి 186 యూనిట్ల లక్ష్యానికి 647 యూని ట్లను స్థాపించడం జరిగిందన్నారు.
తొమ్మిది కంపెనీలతో ఒప్పందాలు
ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ సీఈవో ఎం.విశ్వ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తొమ్మిది ఎంవోయూలను కుదు ర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. 1. ఎన్ఆర్డీసీ (నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్), 2. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్, పూడి, విశాఖ, 3.ఎన్ఐ`ఎంఎస్ఎంఈ(నేషనల్ ఇనిస్టి ట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ), 4.ఎన్ఐడీ(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డురియన్), సెర్ప్ అండ్ ఏపీఎంఎస్ఎంఈడీసీ ట్రిపార్టైట్ అగ్రి మెంట్, 5.ఎన్పీసీ(నేషనల్ ప్రోడక్టివిటీ కౌన్సిల్), 6.సీఎస్టీ ఎంఎస్ఈ(క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంట ర్ప్రైజెస్), 7.సిడ్బీ(స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), 8.ఎఫ్టీఈవో(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, 9.ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్చ్ఛేంజ్లతో ఒప్పం దాలు కుదుర్చుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆర్బీ ఎస్ఎం ట్రాకర్ను ప్రారంభించి ర్యాంప్ ఎక్స్ప్లైనర్, ఎం ఎస్ఎం ఈ స్కీమ్ బుక్ను అతిథులతో ఆవిష్కరించారు. ప్రతిభ కనబ రచిన ఎంఎస్ఎంఈలకు జ్ఞాపికలను అందించి సత్కరించారు. ఎన్ఎస్ఈ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ అయ్యర్ మంత్రిని సన్మానించారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఎంఎస్ఎంఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్బాబును సత్కరించారు.