- ఎన్నికల గుర్తు గొడ్డలిగా పెట్టుకోండి
- సైకో నాయకుడు, ముఠాకు అవే కరెక్ట్
- సింగయ్యది జగన్రెడ్డి ప్రేరిపిత హత్యే
- జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకోవాలి
- దళితుల ప్రాణాలు తీయడం వారికి అలవాటే
- లిక్కర్ స్కామ్ డైవర్ట్ చేసేందుకే డ్రామాలు
- ప్రాణాలు తీసే వ్యక్తికి ప్రాణభయమా?
- టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు సోమిరెడ్డి ధ్వజం
నెల్లూరు(చైతన్యరథం): పోలీసు ఆంక్షలను ఉల్లంఘించి చేపట్టి న ర్యాలీలో సింగయ్య మెడను కారు కింద నలిపేశారు.. సాటి మానవుడి ప్రాణం పోతుందనే కనికరం కూడా లేకుండా శరీరాన్ని లాగి పక్కన పడేశారు.. దళితుల ప్రాణాలు తీయడం జగన్రెడ్డి, ఆ పార్టీ నాయకులకు అలవాటేనని పొలిట్బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. బెట్టింగ్ కట్టి ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు చావుకు జగన్రెడ్డే కార ణం. గంగమ్మ జాతరలో పోతును నరికినట్టు టీడీపీ కార్యకర్తలను రప్పా రప్పా నరికేస్తామనడం తప్పుకాదని సమర్థించుకోవడం సైకోకే చెల్లింది. వైసీపీ పేరు మార్చి రప్పా రప్పా పార్టీ అని పెట్టు కోవాలి.. ఎన్నికల గుర్తుగా గొడ్డలిని మార్చుకోవాలని హితవు పలి కారు. దళితుల ప్రాణాలు బలితీసుకోవడం వైసీపీ నాయకులకు మొదటి నుంచి అలవాటేనన్నారు. గతంలో డాక్టర్ సుధాకర్, డ్రైవ ర్ సుబ్రహ్మణ్యం, ఉదయగిరి నారాయణ, దుగ్గిరాల కరుణా కర్.. ఇప్పుడు సింగయ్యతో పాటు మరొకరు. ఆ దళిత కుటుంబా లను జగన్రెడ్డి, వైసీపీ నాయకులు ఎందుకు పరామర్శించలేదు. బెట్టిం గులో నష్టపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించే పేరుతో ర్యాలీ నిర్వహించి మూడు ప్రాణాలను బలితీసుకున్నాడు. సింగ య్య మృతి కేసులో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరా రు. రోప్ పార్టీ పోలీసులను పెట్టలేదని మాట్లాడటానికి జగన్ రెడ్డికి నోరెలా వచ్చింది? జగన్రెడ్డి భద్రత కోసం ఆ కార్యక్రమం లో ప్రభుత్వం 679 మంది పోలీసులను నియమించింది.
మీ అరాచకాలు ప్రజలకు గుర్తున్నాయి
జెడ్ ఫ్లస్ కేటగిరి భద్రతలో ఉండే చంద్రబాబుపై పుంగనూ రులో రాళ్లు వేయించారు.. వందల మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు.. పవన్కళ్యాణ్ను అప్పట్లో నడి రోడ్డుపై కూర్చోపెట్టారు.. విశాఖలో జనసైనికులపైనా రాళ్లు వేయించాడు..యువగళం పాదయాత్రలో లోకేష్ను చిత్రహింసలు పెట్టారు.. సొంత పార్టీ ఎంపీలను సైతం వదిలిపెట్టకుండా కక్ష సాధింపులకు పాల్పడ్డాడు.. ఎంపీ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వీడియో కాల్లో చూసి పైశాచిక ఆనందం పొం దారు..ఒంగోలు ఎంపీ మాగుంటపై గ్రావెల్ దొంగతనం కేసు పెట్టించారు..ఇలా ఎన్నో దుర్మార్గాలు చేసిన వైసీపీ పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తు కూడా మార్చేయాలి.
లిక్కర్ కుంభకోణం నుంచి తప్పించుకోలేరు
ఒక సీఎం కుటుంబం, ఆయన సన్నిహితులు అవినీతికి పాల్పడితే ఏ విధంగా చేయొచ్చ నేందుకు లిక్కర్ స్కామే నిదర్శనం. ఏపీ మద్యం స్కాముకు సంబంధించి అంశాలు పత్రికల్లో పుంఖా నుపుంకాలుగా వస్తున్నాయి. మద్యం స్కాములో జరిగిన అక్రమాల విలువ అధికారికంగా రూ.3200 కోట్లు అయితే..అనధికారిక విక్రయాలతో కలిపి స్కామ్ విలువ రూ.10 వేల కోట్లపైనే. లిక్కర్ స్కామ్లో నిజాలు చూస్తే సిట్ అధికారులకే మైండ్ బ్లాక్ అవు తోం దంట. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రూటింగ్, డిస్టలరీల స్వాధీనం, విదేశీ అకౌంట్లు, బంగారు నగలు, వజ్రాల లావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ డైవర్షన్ కోసమే రోజూ ప్రెస్ మీట్లు పెట్టి జగన్రెడ్డి హడావుడి చేస్తున్నాడు. పాలన సజావు గా నడవడం, అభివృద్ధి చెందడం జగన్ రెడ్డికి, సాక్షికి ఇష్టం లేదు. ప్రాణాలకు రక్షణ లేదని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ప్రాణాలు తీసే ఆయన ప్రాణభయం అనడం విచిత్రంగా ఉంది. 679 మంది పోలీసులు భద్రతగా ఉంటే ప్రాణభయమెందుకో? కాకులు, కోతులు చనిపోయినప్పుడు వందల కొద్ది కాకులు, గుం పులుగా కోతులు వస్తాయి. వాటికున్న జాలి, దయ కూడా జగన్రె డ్డితో పాటు వైసీపీ నాయకులకు లేకుండా పోయాయి. ముగ్గురు ప్రాణాలు పోతే ప్రెస్మీట్లు పెట్టి జోకులేస్తున్నాడు.. సైకో మనస్త త్వం కలిగిన వారి లక్షణాలు అలాగే ఉంటాయని హితవుపలికారు.