అమరావతి (చైతన్యరథం): విజయనగరం జిల్లా కొత్తవలస కస్తూర్బా స్కూల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్నిప్రమాదంపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులనుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంలో విద్యార్థులు నష్టపోయిన పుస్తకాలు, సామగ్రి తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని విద్యా సంస్థల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.