- అంతర్జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారుడికి సముచిత రీతిలో గుర్తింపు
- స్వర్ణపతక విజేత, అర్జున్ అవార్డీ సాకేత్ను విస్మరించిన గత ప్రభుత్వం
అమరావతి (చైతన్యరథం): అంతర్జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనిని మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవించింది. సాకేత్కు గ్రూప్ -1 ఉద్యోగం ఇవ్వాలని మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయించింది. దక్షిణకొరియాలో జరిగిన 2014 ఆసియా గేమ్స్లో సానియా మీర్జాతో కలిసి మిక్స్డ్ డబుల్స్లో మన దేశానికి స్వర్ణపతకం సాధించిన సాకేత్.. గతంలోనే ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడైన సాకేత్ గౌరవార్థం ఆయనకు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగం ఇవ్వాల్సి ఉన్నా.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. తనకు అర్హత ఉన్నా రాజకీయ కారణాలతో ఉద్యోగం ఇవ్వకుండా పెండిరగ్లో ఉంచారని సాకేత్ ఇటీవల మంత్రి లోకేష్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశాడు. సాకేత్ మైనేని ట్రాక్ రికార్డును పరిశీలించిన లోకేష్.. ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడారు. మంత్రి లోకేష్ చొరవతో సాకేత్ మైనేనికి గ్రూప్ -1 కేడర్ లో డెప్యూటీ కలెక్టర్ కేడర్ ఉద్యోగం ఇస్తూ మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. దీనిపై సాకేత్ మైనేని స్పందిస్తూ… మంత్రి లోకేష్ చొరవతో దీర్ఘకాలంగా తాను ఎదురు చూస్తున్న గుర్తింపు లభించినందుకు ఆనందంగా ఉందన్నారు. తనకు లభించిన గుర్తింపు కేవలం వ్యక్తిగతమైనది కాదు, మన రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం, ప్రతి అథ్లెట్కు ప్రేరణగా నిలుస్తుందన్నారు.