- రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు
- కారుతో తొక్కించి వెళ్లడం క్రూరత్వం
- ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
విజయనగరం(చైతన్యరథం): జగన్రెడ్డి ప్రవర్తనపై విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రానికి నాయకత్వం వహించి న వ్యక్తిగా జగన్కు మానవత్వం, బాధ్యత వంటి విలువలు కనిపించకపోవడం బాధాకరమన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదం లో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతిచెందిన తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో సింగయ్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా జగన్ కనీసం స్పం దించకపోవడం మానవతారాహిత్యానికి పరాకాష్టగా అభివర్ణిం చారు. కారు కింద నిమ్మకాయను తొక్కినట్లు సింగయ్య తలపై కారు తొక్కించడం దారుణమన్నారు. జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిప డ్డాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో అద్భుతమైన పాలన కొనసాగుతుందని పేర్కొన్నా రు. చట్టాన్ని ఉల్లంఘించి రెంటపాళ్లకు పర్యటనకు వెళ్లడం వల్ల ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకర మన్నారు. డ్రైవర్ను ఉపయోగించి కుట్రపూరితంగా హింసాత్మక ఘటనకు పాల్పడ్డాడు. నేరస్తుడి నాయకత్వంలో పనిచేసే వైసీపీ క్యాడర్ ఆలోచించాలని సూచించారు. జగన్ గతంలో 2014-19లోనూ విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించారు..ఇప్పుడు కూడా అదే ధోరణి తో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.