అమరావతి (చైతన్యరథం): హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ పునరుద్ధరణ పనులపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం..తెలుగుజాతి వెలుగు సంతకం.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు-మహా నాయకుడు ఎన్టీఆర్ ఘాట్కు రూ.1.35 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ మరమ్మతులు చేపట్టడం చాలా సంతోషం అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.