అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన – తొలి అడుగు పేరిట సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ప్రతి ఒక్క టేబుల్ దగ్గరకు వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలంతా గత ఏడాది కాలంగా స్వేచ్చాయుత వాతావణంలో జీవిస్తున్నారు, ప్రజా ప్రభుత్వంలో అందరూ ప్రశాంతంగా జీవించాలన్నదే తమ లక్ష్యమని లోకేష్ చెప్పారు.