- రక్షణ రంగంలో భారీగా పెట్టుబడుల ఆకర్షణ
- ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0పై సీఎం సమీక్ష
- క్లస్టర్ల వారీగా ఆయా రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు
- ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు నాణ్యత బెంచ్మార్క్, బ్రాండిరగ్
- అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): రక్షణ, అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు సాధించేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతనంగా తీసుకొచ్చే పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లనుంచి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రచించాలని ఆదేశించారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0పై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత, నవీన ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్రబిందువుగా మారేలా ప్రయత్నించాలన్నారు. ఆపరేషన్ సిందూర్లో భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని, రానున్న రోజుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ తరహా సాంకేతికతను రక్షణపరంగా వాడుకోవడంతోపాటు వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసి.. దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఏరోస్పేస్, అండ్ డిఫెన్స్ సలహాదారు సతీశ్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు. ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు.
ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు నాణ్యతా బెంచ్మార్క్
మిగతా రాష్ట్రాలకంటే ఈ రంగంలోని ఎంఎస్ఎంఈలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ఏడాదికి ప్రత్యేకంగా రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతోపాటు, లాజిస్టిక్స్ సబ్సిడీవంటివి నూతన పాలసీలో పొందుపర్చాలని సూచించారు. ‘ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయాలి. అనుంబంధ పరిశ్రమలలో ఉత్పత్తుల నాణ్యతలో బెంచ్మార్క్ ఉండేలా చూడాలి. అలాగే విలువ జోడిరపు జరగాలి. మార్కెటింగ్, బ్రాండిరగ్ ముఖ్యం. వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ ఆశయం సాకారం కావాలి’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రాంతాలవారీగా డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలు
విశాఖపట్నం- శ్రీకాకుళంలో నావల్ క్లస్టర్Ñ జగ్గయ్యపేట- దొనకొండ ప్రాంతంలో మిస్సైల్, ఆయుధాల ఉత్పత్తులుÑ కర్నూలు- ఓర్వకల్లులో మానవరహిత విమానాలు, డ్రోన్ల తయారీÑ లేపాక్షి- మడకశిర క్లస్టర్లో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తిరుపతిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలని, అలాగే డీఆర్డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నెలకొల్పాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు మడకశిర క్లస్టర్లో భారత్ ఫోర్జ్, ఎంఎండబ్ల్యు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
రాష్ట్రంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన 23 సంస్థలు
జాతీయ రక్షణ ఉత్పత్తుల విలువ ఏడాదికి రూ.1.27 లక్షల కోట్లుఉండగా, ఇందులో రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థల వాటా 73 శాతం కలిగి ఉన్నాయి. 21 శాతం విలువైన ఉత్పత్తులు ప్రైవేట్రంగం నుంచి వస్తున్నాయి. మిగిలిన 7 శాతం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉత్పత్తి అవుతున్నాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ క్లస్టర్లో 23 సంస్థలు రూ.22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. దీంతో 17 వేలమందికి ఉపాధి లభించింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ పాల్గొన్నారు.