- యూఎన్లో 175 దేశాలు ఆమోదించిన యోగాను హేళన చేస్తున్న జగన్ ముఠా
- హెల్త్ ఈజ్ వెల్త్ కాని.. మితిమీరిన దోపిడీ దుడ్డు హెల్త్ను పాడు చేస్తుంది
- తొలి ఏడాది జగన్ పాలనలో 10శాతమే హామీల అమలు.. కూటమి పాలనలో 70శాతం అమలు
- జగన్ పాలనలో విద్యా ప్రమాణాలు 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజారాయి
- యోగాంధ్ర రికార్డులపై అక్కసు వెళ్లగక్కిన వర్ధెల్లి మురళి కుతంత్రం `24
కాదేదీ కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ. కాదేదీ నిందలకు అతీతం అంటున్నారు జగన్ బాబా 40 దొంగల ముఠా. 22-06-2025వ తేదీ ఆదివారం అవినీతి విషపుత్రిక సాక్షిలో తన యజమాని జగన్ కళ్లలో ఆనందం చూడడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని హేళన చేస్తూ, వక్రీకరిస్తూ వర్ధెల్లి మురళి మరో భారీ వ్యాసం రాశారు. యోగా నిరుపయోగ కార్యక్రమమైతే.. 2014లో ఐక్యరాజ్య సమితిలోని 175 దేశాల ఆమోదంతో అంతర్జాతీయ యోగా డే తీర్మానం ఎందుకు ఆమోదించబడిరది? జగన్ బాబా 40 దొంగల ముఠాకు ఉన్నంత జ్ఞాన సంపద 175 దేశాలకు లేదా? గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు ఆంధ్రులకు వస్తే ఎందుకు సహించలేకపోతున్నారు? గిన్నీస్ రికార్డులను కూడా హేళన చేసే నీచస్థితికి ఎందుకు దిగజారారు? దుర్యోధనుడు నాశనమైంది.. అసూయ ద్వేషాలతోనేనని గుర్తిస్తే మంచిది.
కూటమి ప్రభుత్వ తొలి ఏడాది పాలనా వైఫల్యాల డైవర్షన్ కోసమే యోగ నిర్వహించారని వక్రీకరించారు. హెల్దీ… వెల్దీ… హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే చంద్రబాబు లక్ష్యం.
హెల్త్ ఈజ్ వెల్త్ `అనేది విజ్ఞుల సందేశం. ఆరోగ్యంలేని సంపదెందుకు? ఆరోగ్య సంపదకన్నా దోపిడీ నోట్లకట్టల సంపదే సంపదని జగన్ బాబా 40 దొంగల ముఠా భావిస్తున్నదా? అందుకే ఆరోగ్యాలు పాడు చేసుకొని సైకోలుగా, శాడిస్టులుగా మారుతున్నారా?
ఆరోగ్యాన్ని పెంపొందించుకునే మార్గాలలో యోగా కూడా ఒక మార్గం. కూటమి ప్రభుత్వం యోగా గొప్పగా నిర్వహించడంతోపాటు డిఎస్సీ ద్వారా జరిగే 16,347 ఉపాధ్యాయ నియామకాలలో క్రీడాకారులకు 3శాతం రిజర్వేషన్ను ప్రవేశపెట్టారు మన విద్యాశాఖామాత్యులు నారా లోకేష్. విద్యా ప్రమాణాలు పెంపొందించే చర్యలతోపాటు పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ హెల్దీ, వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలలో భాగాలే. జగన్ పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదు. ఒక్క డ్రిల్ టీచర్ను కూడా నియమించలేదు. విద్యా ప్రమాణాలలో 2019నాటికి చంద్రబాబు పాలనలో దేశంలో 3వ స్థానంలోవున్న ఏపీ.. జగన్ పాలనలో 19వ స్థానానికి దిగజారిపోయింది. 12 లక్షలమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి డ్రాపవుట్ అయ్యారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రద్దు చేశారు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదు. అంబేద్కర్ విదేశీ విద్య రద్దు చేశారు. ఎయిడెడ్ పాఠశాలలన్నింటినీ నిర్వీర్యం చేశారు. యూనివర్సిటీల్ని వైకాపా కార్యాలయాలుగా మార్చి ప్రమాణాల్ని పతనం చేశారు. జగన్ పాలనలో పట్టభద్రుల నిరుద్యోగం 24శాతం పెరిగి దేశంలో మొదటిస్థానంలో చేరింది. చంద్రబాబు ప్రభుత్వం 6 లక్షలమందికి నిరుద్యోగ భృతి ఇవ్వగా… దాన్ని జగన్ రద్దు చేశారు. ఏపీపీఎస్సీని అవినీతి అంగడి చేశారు. దాదాపు 1200మంది నిరుద్యోగులు జగన్ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది వాస్తవ స్థితి కాగా.. జగన్ పాలనలో విద్యావ్యవస్థ వెలిగిపోయినట్టు పదేపదే అబద్ధపు రాతలు రాస్తున్నారు. బైజూస్ ఒక కుంభకోణం. కుంభకోణం కోసమే పాఠశాలలకు వైకాపా జెండా రంగులు వేయడానికి, తీయడానికి రూ.3వేల కోట్లు తగలేశారు. రంగులు చూపించి విద్యావ్యవస్థ వెలిగిపోయినట్టు అబద్ధపు ప్రచారాలు చేసుకున్నారు. అబద్ధాలు ఎక్కవ కాలం నిలవవు. నేడున్న విద్యా సంస్థల్లో సింహభాగం టీడీపీ పాలనలో స్థాపించబడినవే. ఉపాధ్యాయులు, లెక్చరర్ల నియామకాలు అత్యధిక భాగం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. విద్యా ప్రమాణాల్ని అత్యున్నత స్థాయికి చేర్చేది నారా లోకేష్ మాత్రమే.
తొలి ఏడాది జగన్ ప్రభుత్వం 10శాతం మాత్రమే మేనిఫెస్టో హామీల్ని నెరవేరిస్తే… కూటమి ప్రభుత్వం 70 శాతానికి పైగా అమలు చేసింది. మద్యనిషేదం హామీపై జగన్ మాట తప్పి మడమ తిప్పాడు. కరెంట్ చార్జీలు తగ్గిస్తామన్న హామీపై మాట తప్పడమేకాక 9సార్లు పెంచి రూ.32 వేల కోట్ల భారం మోపాడు. మెగా డిఎస్సీపై మాట తప్పాడు. ఇద్దరు పిల్లలకు అమ్మఒడిపై మాట తప్పాడు. జనవరిలో జాబ్ క్యాలెండర్పై మడమ తిప్పాడు. సీపీఎస్ రద్దుపై మడమ తిప్పాడు. ఇలా 85 శాతం హామీలు అమలు చేయలేదు. దీనివల్ల ప్రతి లబ్దిదారుడుకి జగన్ లక్షల్లో ఎగనామం పెట్టాడు.
గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్.