అమరావతి (చైతన్య రథం): యోగా మన సంస్కృతి, మన సంపద. శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించే యోగాను నిత్యం ఆచరిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జూలై 21న యోగా డేను పురస్కరించుకుని శుక్రవారం విశాఖకు చేరుకున్న సీఎం చంద్రబాబు.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘యోగాను జీవన విధానంగా మలచుకుందాం. విశాఖ వేదికగా జరిగే 11వ అంతర్జాతీయ యోగా డే నుంచి దీనికి నాంది పలుకుదాం. ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో విశాఖ ఆర్కే బీచ్లో జరుగనున్న యోగా డేను గ్రాండ్ సక్సెస్ చేద్దాం. అలాగే రాష్ట్రంలో వాడవాడలా.. యోగా సాధనతో సరికొత్త రికార్డు సృష్టిద్దాం. వారసత్వంగా వచ్చిన యోగాను మననుంతా ఆచరించటంతోపాటు భవిష్యత్ తరాలకు అందిద్దాం’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.