- 5,200 మందికి తప్పనిసరి బదిలీలు
- అభ్యర్థనలతో 1899 మందికి స్థానభ్రంశం
- బదిలీ అయిన 379 మంది బోధనా సిబ్బంది
- ప్రక్రియలో ముగిసిన మొదటి అంకం
- మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం
- ఈ నెలాఖరుకు 9,650 మంది ఏఎన్ఎంలు
అమరావతి(చైతన్యరథం): వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో శుక్రవా రంతో తొలి దశ బదిలీలు పూర్తయ్యాయి. మొత్తం 7,099 మంది వైద్య సిబ్బంది కొత్త స్థానాలకు బదిలీ అయ్యారు. ఇందులో వివిధ స్థాయిల్లో 5,200 మందికి ప్రస్తుతం ఉన్న చోట ఐదేళ్లు సర్వీసు దాటిన వారు తప్పనిసరిగా బదిలీ అయ్యారు. 1899 మందిని వారి అభ్యర్థనల మేరకు బదిలీ చేశారు. బదిలీల ప్రక్రియ రెండవ అంకంలో గ్రామస్థాయిలో పనిచేసే 9,650 గ్రేడ్-3 ఏఎన్ ఎంలను ఈ నెలాఖరుకు బదిలీ చేస్తారు. గ్రామ,వార్డు సచివాల యాల విభాగం సమన్వయంతో ఈ బదిలీలను చేయాల్సి ఉన్నం దున ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 30 వరకు గడువునిచ్చింది.
మంత్రి సత్యకుమార్ హర్షం
పలు కారణాలతో క్లిష్టమైన భారీ బదిలీల ప్రక్రియను సజావుగా, వివాదరహితంగా నిర్వహించినందుకు వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ దిశగా వివిధ స్థాయిల్లో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందిం చారు. గత బదిలీల ప్రక్రియలకు సంబంధించి ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో ఈసారి చేపట్టిన బదిలీలను నియమ నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించటానికి చేసిన కృషి మంచి ఫలి తాలను ఇచ్చిందని ఆయన తెలిపారు.
అక్రమాలకు అడ్డుకట్ట …తొలిసారిగా
గతంలో జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో జరిగే సిబ్బంది బదిలీలపై ఆయా స్థాయి అధికారులు నిర్ణయాలు తీసుకునేవారు. దీని వల్ల కిందిస్థాయి అధికారులు తీసుకునే నిర్ణయాలపై ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ లేక బదిలీలపై పలు ఆరోపణలు వచ్చాయి.ఈ నేపధ్యంలో…బదిలీల నిర్ణయాలకు సంబంధించి మంత్రిత్వశాఖలోని వివిధ విభాగాధిపతులు బాధ్యత వహించాలని, అవకతవకలను ఉపేక్షించమని మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటు జిల్లా, జోనల్ స్థాయిల్లో పాలనా సహాయక సిబ్బం దిలో పలువురు అదే స్థానాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తూ అక్రమాలు, అవినీతికి పలుపడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేప థ్యంలో ఒకేచోట మూడేళ్లకు పైగా పనిచేసిన జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, అకౌంట్ ఆఫీసర్లు, ఆఫీసు సూపరింటెండెంట్లు వంటి వారిని వేరే చోటకు బదిలీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆ మేరకు మంత్రిత్వశాఖ జారీచేసిన బదిలీ విధివిధానాలో స్పష్టంగా పొందుపరిచారు. దీర్ఘకాలికంగా ప్రధాన పోస్టుల్లో పనిచేస్తూ ఆరో పణలకు గురైన కొందరు ఉన్నతాధికారులను మంత్రి బదిలీ చేయడం మరో విశేషం. ఒకేచోట ఐదేళ్లు పనిచేసి తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉన్న వారి వివరాలను, రెండేళ్లకు పైగా సర్వీసు ఉండి బదిలీ కోరుకున్న వారి వివరాలను, వారివారి సీనియారిటీ లను, ఖాళీ స్థానాలను ప్రకటించి వాటిపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించే దిశగా స్పష్టమైన విధానాలను మంత్రిత్వశాఖ ప్రక టించటంతో బదిలీల ప్రక్రియ సాఫీగా సాగింది
ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న 840 మంది
మంత్రి ఆదేశాల మేరకు అధికారులు అందించిన సమాచారం ప్రకారం 840 వైద్య సిబ్బంది అదే చోట్ల ఐదేళ్లకు పైగా కొనసాగు తున్నారు. దీనికి కారణాలు కొంతమందికి ఆరోగ్య కారణాలు, ఉద్యోగులైన భార్యాభర్తలను ఒకే చోట ఉంచే ఉద్దేశంతో మినహా యింపు కల్పించారు. వీటితో పాటు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు నియమాల మేరకు మినహాయింపు ఉంది. అయినా ఈ 840 మందికి సంబంధించి వారు ఏఏ కారణాలతో అదేస్థానాల్లో కొనసాగుతున్నారో పూర్తి వివరాలను త్వరలో తెల పాలని మంత్రి ఆదేశించారు. శుక్రవారంతో ముగిసిన మొదటి అంకం బదిలీ ప్రక్రియలో 60 మంది ప్రొఫెసర్లతో పాటు మొత్తం 379 మంది కొత్త స్థానాలకు బదిలీ అయ్యారు.