న్యూఢల్లీి (చైతన్యరథం): కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢల్లీిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటు అక్కడి ప్రజల చిరకాల కోరిక, కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుకు సహకరించాలని కోరారు. న్యాయపరమైన అవసరాల కోసం రాయలసీమ ప్రజలు ఏపీ రాజధానికి రావడానికి 500 కి.మీ.కు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది. యువగళం పాదయాత్ర సందర్భంగా సీమ ప్రజలు, న్యాయవాదులు..కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని విన్నవించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా త్వరితగతిన బెంచి ఏర్పాటుకు సహకరించాలి. రాష్ట్రంలోని కోర్టుల్లో జ్యుడిషియరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి సహకారం అందించండి. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని మంత్రి లోకేష్ కేంద్రమంత్రికి అందజేశారు.